మెదడు, నరాల వ్యాధులపై అవగాహన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి దేవాలయం అన్నమయ్య కళావే దికపై కిమ్స్ శిఖర హాస్పిటల్స్, గుంటూరు జిల్లా సీనియర్ సిటిజ న్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంయు క్తంగా సోమవారం మెదడు, నరాల సంబంధిత వ్యాధులపై సదస్సు నిర్వహించారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. వైద్యులు వివేక్ లంకా, సూరప్రదీప్కుమార్రెడ్డి పవర్పాయింట్ ప్రజంటేషన్తో మెదడు, నరాలకు సంబంధించి వ్యాధులపై అవగాహన కల్పించారు. నరాల సం బంధింత వ్యాధులు అనేక రకాలని, పుట్టుకతో వచ్చేవి, జన్యుపరమైనవి లేదా జీవిత కాలంలో వచ్చేవి ఉంటాయని అన్నారు. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవ డం, నివారణ చర్యలు తీసుకుని, సరైన చికిత్స పొందాలన్నారు. సంస్థ అధ్యక్షులు మన్నే సుబ్బారావు, కె. బసవనందికేశ్వరరావు పాల్గొన్నారు.
బృహత్తర చండీయాగ ప్రారంభం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన్ పరిషత్, దేవాలయ కమిటి సంయుక్త ఆధ్వర్యంలో 13వ స్వాముల సద్ధి కార్యక్రమంలో భాగంగా మాసశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం బృహత్తర చండీయాగ కార్యక్రమం ప్రారంభమైంది. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 13మంది వేదపండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన, శివలింగానికి మాన్యాసపూర్వక రుద్రాభిషేకం, నవగ్రహాలకు, గణపతి స్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరిగాయి. శ్రీలక్ష్మీగణపతి, రుద్ర, చండీ హోమాలు ప్రారంభమయ్యాయి. చండీ, లలితా సహస్రనామ సామూహిక పారాయణాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొల్లేపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ చండీయాగం జనవరి 13 వరకు నిత్యం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.