హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
అలరించిన సంగీత విభావరి – 15.12.2024
బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి
ఆలయప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కళాంజలి,
గుంటూరు
వారిచే నిర్వహించిన సుమధుర సంగీత విభావరి కార్యక్రమం ఆల రించింది. గాయనీగాయకులు
సత్యవర్ధన్, సుధీర్, సాంబశివరావు, రమేష్, గాయత్రి గాత్ర ధారణలో అలనాటి సినీ భక్తి గీతాలను శ్రావ్యంగా
ఆలపించారు. కీబోర్డుపై రవిబాబు. తబలపై వెంకట్, ప్యాడ్సైపై ఈశ్వర్ చక్కటి వాయిద్య సహకారం అందించారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి