భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో కార్తీకమాసం, మాసశివరాత్రి సందర్భంగా మంగళ వారం చండీహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు.ఆలయ కమిటి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అలరించిన సంగీత విభావరి – 15.12.2024
బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి
ఆలయప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కళాంజలి,
గుంటూరు
వారిచే నిర్వహించిన సుమధుర సంగీత విభావరి కార్యక్రమం ఆల రించింది. గాయనీగాయకులు
సత్యవర్ధన్, సుధీర్, సాంబశివరావు, రమేష్, గాయత్రి గాత్ర ధారణలో అలనాటి సినీ భక్తి గీతాలను శ్రావ్యంగా
ఆలపించారు. కీబోర్డుపై రవిబాబు. తబలపై వెంకట్, ప్యాడ్సైపై ఈశ్వర్ చక్కటి వాయిద్య సహకారం అందించారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి