కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం శ్రీగోవిందాష్టకమ్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సుందర సత్సంగ్ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ గోవిందాష్టకమ్ అనేది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ రచించిన ఒక అత్యంత మధురమైన , భక్తిరస పూరితమైన స్తోత్రమన్నారు. ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ అష్టకంలో శ్రీకృష్ణుని లీలలు , ఆయన దివ్య మంగళ స్వరూపం , పరమాత్మ తత్త్వం అద్భుతంగా వర్ణించబడ్డాయన్నారు. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో కృష్ణుడిని కేవలం ఒక గోపాలకుడిగా మాత్రమే కాకుండా , సృష్టి-స్థితి-లయ కారకుడైన పరబ్రహ్మ స్వరూపంగా కొనియాడారన్నారు.
స్వచ్ఛంద సేవలు అభినందనీయం భారతీయత-స్వచ్ఛంద సేవాత్సరాల సేవా ప్రస్థానం సంస్థ 25 సంవ ఆదర్శనీయమని ఇస్కాన్ టెంపుల్స్ అంతర్జాతీయ ప్రచారకుడు రామ్ మురారిదాస్ అన్నారు. శనివారం రాత్రి స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక మీద భారతీయ స్వచ్చంద సేవా సంస్థ రజతోత్సవం, అమరావతి సాంసృతిక చైతన్య వేదిక ఉగాది సాంస్కృతిక వేడుకలు జరిగాయి. దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యర్రంశెట్టి శివసూర్యనారాయణ, అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ పీవీ మల్లికార్జునరావు, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ తదితరులు ప్రసంగించారు. గత 25 సంవత్సరాలుగా చలివేంద్రాలు, యోగా తరగతులు, రైతు ప్రాధాన్య సదస్సులు, న్యాయ సంబంధ చట్టాలపై అవగా హన కార్యక్రమాలు, పేదలకు నిత్యా వసరాలు వైద్య సేవలు అందించినట్లు సంస్థ ప్రతినిధి చిగురుపాటి రవీంద్రబాబు చెప్పారు. గాయకులు లెనీన, పాటల వెంకన్న, రంగం రాజేష్, ఎం అరుణ్ కుమార్, పి అశోక్, బిల్లా నాగరాజులకు నిర్వా హకులు, అతిధులు ఉగాది కళాపురస్కారాలిచ్చి సత్కరించారు. కార్యక్ర మంలో డాక్టర్ విజయలక్ష్మి, పీ...