అలరించిన సినీ సౌరభాలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మహతి స్వర సుధ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సినీ సౌరభాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయని గాయకులు పత్రి నిర్మల, జి వీరయ్య, డి.టి. సాయి బాబా, డాక్టర్ ఏ వీర రాఘవ, వై ఈశ్వరరావు ఎస్ కే వలీ, బి కృష్ణ ప్రసాద్, సిహెచ్ రాజ్యలక్ష్మి, వై. హేమమాలిని, ఎం ఎన్ ప్రసన్నలక్ష్మి, డాక్టర్ జె ముకుందప్రియ, ఎన్.లక్ష్మి,టి రమాదేవి, ఎం కృష్ణ, బి ప్రద్యుమ్న లు తమ గాత్రధారణ లొ అలనాటి మేటి చిత్రాల్లోని పలు మధుర గీతాలను శ్రావ్యంగా ఆలపించారు. కీబోర్డుపై కే రవిబాబు, తబలాపై ఎస్ వెంకట్, ప్యాడ్స్ పై ఎన్ బి సైదులు వాయిద్య సహకార అందించారు కార్యక్రమానికి బి.కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.కె.మదన్ మోహన్రావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి