సంప్రదాయ కళలతో దేవాలయాలకు మరింత శోభ సంప్రదాయ కళలు దేవాలయాలకు మరింత శోభను తీసుకువస్తాయని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమూర్తి అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై నృత్య కిన్నెర ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న కూచిపూడి నృత్యోత్సవాల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. కూచిపూడి నృత్య కళ ఆంధ్ర రాష్ట్రానికే గర్వ కారణమన్నారు. అనేకమంది నాట్యాచార్యులు దేశ, విదేశాలలో కూచిపూడి నృత్య వైభవాన్ని చాటారన్నారు. సంస్కృతి సంప్రదాయలపై మక్కువ పెంచుకొనే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నృత్య కిన్నెర వారిని ఆయన అభినందించారు. అనంతరం కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ మద్దాళి ఉషా గాయత్రీ నృత్య దర్శకత్వంలో నృత్య కిన్నెర శిష్యబృందం శ్రీ అలమేలు మంగ చరితం కూచిపూడి నృత్య రూపకం, హంసధ్వని కూచిపూడి నృత్యాలయం శిష్య బృందం కూచిపూడి నృత్యమాలిక ప్రేక్షకులను ఆలరించాయి. తొలుత ఈ కార్యక్రమాల్ని ఆలయ పాలక మండలి అధ్యక్షుడు మస్తానయ్య, ప్రముఖ అడిటర్ రామరాజు శ్రీనివాస్ తో కలిసి బొప్పూడి కృష్ణమ...
హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.