రంగస్థల కళాకారులకు బీవీ రావు ఆదర్శనీయులు రంగస్థల కళాకారుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బీవీ రావు ఆదర్శనీయులని పలువురు నివాళులర్పించారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై శ్రీజైభవాని నాట్య మండలి ఆధ్వర్యంలో బీవీ రావు కళాసేవా పుర స్కార సభ జరిగింది. సభకు రంగస్థల ప్రముఖుడు ఎంవీఎల్ నరసింహారావు అధ్యక్షత వహించారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తా నయ్య, జైభవాని నాట్యమండలి అధ్యక్షుడు అయితి వాసు దేవశర్మ, ఆర్కిటెక్ట్ బి. శ్రీనివాస్ తదితరులు బీవీ రావు వృత్తి ప్రవృత్తుల్లో కనబర్చిన నీలబద్ధత, ఆదర్శాలను వివరించారు. బి.వి.రావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటి రాంపిళ్ల రాజేశ్వరికి వి.ఎస్.వి.ఎస్. రోహిత్ అందించి సత్కరించారు. ఈసందర్భంగా డాక్టర్ నరాలశెట్టి రవికుమార్ దుర్యోధన- హేమ్లెట్, శ్రీకృష్ణదేవరాయలు ఏక పాత్రలను అభినయించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్య క్షుడు పి. రామచంద్రరాజు పాల్గొన్నారు. కార్యక్రమాలను బీవీఎస్ ప్రసాద్, కావూరి సత్యనారాయణ పర్యవేక్షించారు. ఏవీకే సుజాత వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై యువ కళావాహిని, కళావిపంచి సం యుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ప్రముఖులకు పురస్కార ప్రదానోత్సవ సభ నిర్వ హించారు. అనంతరం జె. రాధాకృష్ణకు కళావిపంచి జీవన సాఫల్య పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్యకు కళావిపంచి సాహిత్య పురస్కారం, జమలాపురం రాధాకృష్ణ జి.వి.జి.శంకర్, జి.మల్లికార్జునరావులకు బొప్పన ఆత్మీయ పురస్కారంతో సత్కరించారు. సభానంతరం ఉషోదయ కళానికేతన్ (కాట్రపాడు) ప్రదర్శించిన గారడి నాటిక అలరించింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విఫ్ జి.వి.ఆంజనేయులు, రాష్ట్ర నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికా ర్జునరావు, బి.జె.పి.అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్, డాక్టర్ రవి కొండబోలు, కె.సి.పి. సిమెంట్ వైస్ చైర్మన్ మధుసూదనరావు, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనా రాయణ, సయ్యద్ జానీబాషా పాల్గొన్నారు. నాటక కళాకారులకు బొప్పన నరసింహారావు ఒక వరమని కళ పత్రిక సంపాదకుడు మ...