తిరుప్పావైపై ఆధ్యాత్మిక ప్రవచనం ప్రారంభం స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం, అన్నమయ్య కళావేదికపై తితిదే ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సౌజన్యంతో ధనుర్మాసం సందర్భంగా మంగళవారం తిరుప్పావై ఆధ్యాత్మిక ప్రవచనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం గోదా అమ్మవారి మూలవిరాట్ కు వివిధ ఫలరసాలు, పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు, అలంకరణ జరిగాయి. సాయంత్రం ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి తిరుప్పావై ప్రవచనం చేస్తూ కార్తీకమాసం లాంటిదే ధనుర్మాసమన్నారు. ఈ మాసం శ్రీకృష్ణపరమాత్మకు అత్యంత ప్రీతికరమైందని ఈనెల రోజులు పండుగ రోజులుగా జరుపుతారన్నారు.
ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై యువ కళావాహిని, కళావిపంచి సం యుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ప్రముఖులకు పురస్కార ప్రదానోత్సవ సభ నిర్వ హించారు. అనంతరం జె. రాధాకృష్ణకు కళావిపంచి జీవన సాఫల్య పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్యకు కళావిపంచి సాహిత్య పురస్కారం, జమలాపురం రాధాకృష్ణ జి.వి.జి.శంకర్, జి.మల్లికార్జునరావులకు బొప్పన ఆత్మీయ పురస్కారంతో సత్కరించారు. సభానంతరం ఉషోదయ కళానికేతన్ (కాట్రపాడు) ప్రదర్శించిన గారడి నాటిక అలరించింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విఫ్ జి.వి.ఆంజనేయులు, రాష్ట్ర నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికా ర్జునరావు, బి.జె.పి.అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్, డాక్టర్ రవి కొండబోలు, కె.సి.పి. సిమెంట్ వైస్ చైర్మన్ మధుసూదనరావు, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనా రాయణ, సయ్యద్ జానీబాషా పాల్గొన్నారు. నాటక కళాకారులకు బొప్పన నరసింహారావు ఒక వరమని కళ పత్రిక సంపాదకుడు మ...