భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై యువ కళావాహిని, కళావిపంచి సం యుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ప్రముఖులకు పురస్కార ప్రదానోత్సవ సభ నిర్వ హించారు. అనంతరం జె. రాధాకృష్ణకు కళావిపంచి జీవన సాఫల్య పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్యకు కళావిపంచి సాహిత్య పురస్కారం, జమలాపురం రాధాకృష్ణ జి.వి.జి.శంకర్, జి.మల్లికార్జునరావులకు బొప్పన ఆత్మీయ పురస్కారంతో సత్కరించారు. సభానంతరం ఉషోదయ కళానికేతన్ (కాట్రపాడు) ప్రదర్శించిన గారడి నాటిక అలరించింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విఫ్ జి.వి.ఆంజనేయులు, రాష్ట్ర నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికా ర్జునరావు, బి.జె.పి.అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్, డాక్టర్ రవి కొండబోలు, కె.సి.పి. సిమెంట్ వైస్ చైర్మన్ మధుసూదనరావు, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనా రాయణ, సయ్యద్ జానీబాషా పాల్గొన్నారు. నాటక కళాకారులకు బొప్పన నరసింహారావు ఒక వరమని కళ పత్రిక సంపాదకుడు మ...