ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కళా దర్బార్ ఉగాది పురస్కారాల ప్రదానం - 31.03.2025

కళా దర్బార్ ఉగాది పురస్కారాల ప్రదానం బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై కళాదర్బార్-ఆంధ్రప్రదేశ్ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కారాల ప్రదానం సోమవారం రాత్రి జరిగింది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పొత్తూరి రంగారావు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ఆలయ పాలకమండలి కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనురాధ అయ్యంగారి(టీవీ రంగం), డాక్టర్ జి. నాగార్జున (వైద్యం), కనుమూర్ రాజ్యలక్ష్మి (విద్య), శనివారపు శిరీష (సంగీతం), చెన్నుపాటి శివనాగేశ్వర రావు(వ్యాపారం), సాయి లక్కరాజు(కళారంగం)లకు ఉగాది పురస్కారాలు అందించి సత్కరించారు. అనంతరం సినీ సంగీత విభావరి నిర్వహించారు. హేమమాలిని, సౌజన్య, బాబూరావు, సుధీర్ బాబు, అబ్దుల్ ఖాదర్ సినీ గీతాలను ఆలపించారు.

గాంధీ మహాత్ముని ఆస్థాన కవి తుమ్మల – అప్పాజోస్యుల సత్యనారాయణ – 13.12.2024

 గాంధీ మహాత్ముని ఆస్థాన కవి తుమ్మల – అప్పాజోస్యుల సత్యనారాయణ – 13.12.2024

గాంధీ మహాత్ముని ఆస్థానకవి తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తి రుషి వంటి కవి అని ఆచార్య అప్పోజోస్యుల సత్యనారాయణ అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణకు తుమ్మల సాహిత్య పురస్కార ప్రదానం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తుమ్మల సాహిత్య విశేషాలను విశ్లేషించి చెప్పారు. తుమ్మల సీతారామమూర్తి గురించి కట్టమంచి రామలింగారెడ్డి లాంటి ప్రముఖులు ఎంతో గొప్పగా పేర్కొన్నారన్నారు. ఆటవెలది, తేటగీతి, కందం లాంటివే కాక అన్ని ఛందస్సులు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ ఎంతో గొప్పగా ఆయన కవిత్వం కనిపి స్తుందన్నారు. ఆయన రాసిన రైతుకవి త్వంలో తెలుగు రైతన్నల జీవన సరళి స్పష్టంగా చూడొచ్చన్నారు. గాంధీజీ ఆస్థానకవిగా ఆయన స్థానం ఎప్పటికీ సుస్థిరమని, చాలామంది కవులలాగా తాత్కాలిక ప్రయోజనాల దృష్టితో కాక కాలాతీత కవిత్వ రచన చెయ్యబట్టే 124 సంవత్సరాల తర్వాత కూడా ఆయన జయంతిని చేసుకుంటూ స్మరించుకొంటున్నాము న్నారు. వేదికపై ఆచార్య అప్పాజోస్యుల సాంస్కృ తిక సేవలకు గుర్తింపుగా తుమ్మల కళాపీఠం పురస్కారాన్ని అందిస్తున్నట్లు సభాధ్యక్షుడు డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్ చెప్పారు. రూ. 20 వేల నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభలో రచయితలు డాక్టర్ సూర్యదేవర రవికుమార్, పెద్ది సాంబశివరావు, డాక్టర్ వి. నాగరాజ్యలక్ష్మి ప్రసంగించారు. నగర ప్రముఖులు నూతలపాటి తిరుపతయ్య, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ నాగసుశీల, డాక్టర్ వి. సింగారావు, ఏలూరి సూర్యనారాయణ, పారా అశోక్‌కుమార్, నాగేంద్రం పాల్గొన్నారు.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 04.10.2024 శుక్రవారం ఉదయం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికపై యం.వై.శేషురాణి, భువనేశ్వరి గార్లచే దేవీ కీర్తనల గానం సుమధురంగా సాగింది. తంగిరాల అన్నపూర్ణ (ఏ.ఐ.ఆర్. ఆర్టిస్ట్) వ్యాఖ్యానం అందించారు.
వాగ్గేయకారుల మహోత్సవాలు – గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావనగార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో వాగ్గేయకారుల మహోత్సవాలు 26.10.2027 శనివారం ప్రారంభమయ్యాయి. పి. జానకి జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. పెరవలి జయతి ప్రార్ధన అనంతరం స్థానిక విద్వాం సులు పలువురు వాగ్గేయకారుల వర్ణాలు , కృతుల గానం సంగీతాభిమానులను అలరించింది. ప్రధాన కచేరీలో భాగంగా విద్వాన్ వివేక్ మూజికులం , ( చెన్నై) శాస్త్రీయ సంగీత కచేరి జరి గింది. కచేరీకి వయోలి న్పై మంధా శ్రీరమ్య , ( చెన్నై) , మృదంగంపై బుర్రా శ్రీరామ్(చెన్నై) , ఘటం పై ఎస్.హను మంతరావు(తాడేపల్లి గూడెం) , వాద్య సహకా రాన్ని అందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామారావు , సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ ప్రసంగించారు. కార్యక్రమాలను డాక్టర్ జి. జాహ్నవి , ఆలయ పాలకమండలి అధ్యక్షులు మస్తానయ్య , కార్యదర్శి ఉమామహేశ్వరరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సంస్థ అధ్యక్ష, ప్రధా...
 తెలుగువారు గర్వించదగ్గ సాహితీ పరిశోధకులు ఆచార్య గంగప్ప ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు భాష విభాగాధిపతిగా పనిచేసిన సందర్భంలో తన శిష్యరికంలో వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దటంతో పాటు 25 మంది పిహెచ్డీలు 25 మంది ఎంఫిల్డ్ పట్టాలు సాధించటంతో పాటు శతాధిక గ్రంథకర్తగా, పరిశోధకుడిగా, మార్గదర్శకుడుగా ప్రఖ్యాతిగాంచిన ఆచార్య గంగప్ప రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప సాహిత్య కృషివలుడని ముఖ్యఅతిథిగా పాల్గొన్న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఇ.వి నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై ఆచార్య గంగప్ప స్మారక సాహిత్య పురస్కార కమిటీ ఆధ్వర్యంలో "ఆచార్య గంగప్ప 28వ సాహితీ పురస్కారం 2024" ప్రముఖ సాహిత్య వేత్త, అనువాద రచయిత డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి దేవి కి అందజేసి ఘనంగా సత్కరించి నగదు పురస్కారం అందజేశారు.  సభకు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షతగా దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన గావించారు. కార్యక్రమంలో ఆచార్య జీవి చలం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నిశెట్ట...