వైభవంగా శ్రీవారి కళ్యాణం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా ఆదివారం స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. మూలవిరాట్కు విశేష అభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరిగాయి. వేదపండితుల ఆధ్వర్యంలో దంపతులచే ఉభయదేవేరి సమేతుడైన స్వామి ఉత్సవమూర్తులకు కళ్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
యుద్ధకాండపై ప్రవచనం బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై ముప్పవ రపు కేశవరావు శత జయంతి ఉత్సవాలు కొనసాగుతు న్నాయి. ఈ సందర్భంగా రామాయణ నవాహ జ్ఞానయజ్ఞంలో గురువారం రాత్రి ప్రవచనకర్త బాచం పల్లి సంతోషకుమార్ శర్మ యుద్ధకాం డలో సీతను కనుగొన్న హనుమంతు డిని శ్రీరాముడు ప్రశంసిస్తూ ఆలిం గనం చేసుకోవడం, యుద్ధానికి వానర సైన్యాన్ని సిద్ధం చేసిన విధానం, వారధి నిర్మాణం వంటి విశేషాలను వివరించారు. ముప్పవరపు సింహాచ లశాస్త్రి, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు మస్తానయ్య, ఉమామహేశ్వరరావు, నాగేశ్వరరావులు జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభిం చారు. ముఖ్యఅతిథిగా డి. రాధాకృష్ణ (కాకినాడ) పాల్గొన్నారు.