కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం శ్రీగోవిందాష్టకమ్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సుందర సత్సంగ్ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ గోవిందాష్టకమ్ అనేది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ రచించిన ఒక అత్యంత మధురమైన , భక్తిరస పూరితమైన స్తోత్రమన్నారు. ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ అష్టకంలో శ్రీకృష్ణుని లీలలు , ఆయన దివ్య మంగళ స్వరూపం , పరమాత్మ తత్త్వం అద్భుతంగా వర్ణించబడ్డాయన్నారు. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో కృష్ణుడిని కేవలం ఒక గోపాలకుడిగా మాత్రమే కాకుండా , సృష్టి-స్థితి-లయ కారకుడైన పరబ్రహ్మ స్వరూపంగా కొనియాడారన్నారు.
నాగభైరవ స్మారక పురస్కారాల ప్రదానం సుప్రసిద్ధ సాహితీవేత్త నాగభైరవ కోటేశ్వరరావు స్మారక పురస్కార ప్రదాన సభ బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం రాత్రి జరిగింది. ప్రముఖ విద్యావేత్త పెంట్యాల శ్రీమన్నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాహితీవేత్తలు నూనె అంకమ్మరావు , డాక్టర్ సెట్లం చంద్రమోహన్లకు పురస్కారాలు అందజేశారు. సభకు డాక్టర్ జక్కంపూడి సీతారామారావు. అధ్యక్షత వహించారు. ఆలయ పాలక మండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్ర మంలో ఆత్మీయ అతిథులుగా డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ , నవ్యాంధ్ర తెలుగు రచయిత్రుల సంఘం అధ్యక్షురాలు తేళ్ల అరుణ , మోదుగుల రవికృష్ణ , గాయకుడు నూకతోటి శర త్బా బు , డాక్టర్ భూసరపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.