ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

సంప్రదాయ కళలతో దేవాలయాలకు మరింత శోభ - 08.08.2026

సంప్రదాయ కళలతో దేవాలయాలకు మరింత శోభ సంప్రదాయ కళలు దేవాలయాలకు మరింత శోభను తీసుకువస్తాయని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమూర్తి అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై నృత్య కిన్నెర ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న కూచిపూడి నృత్యోత్సవాల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. కూచిపూడి నృత్య కళ ఆంధ్ర రాష్ట్రానికే గర్వ కారణమన్నారు. అనేకమంది నాట్యాచార్యులు దేశ, విదేశాలలో కూచిపూడి నృత్య వైభవాన్ని చాటారన్నారు. సంస్కృతి సంప్రదాయలపై మక్కువ పెంచుకొనే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నృత్య కిన్నెర వారిని ఆయన అభినందించారు. అనంతరం కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ మద్దాళి ఉషా గాయత్రీ నృత్య దర్శకత్వంలో నృత్య కిన్నెర శిష్యబృందం శ్రీ అలమేలు మంగ చరితం కూచిపూడి నృత్య రూపకం, హంసధ్వని కూచిపూడి నృత్యాలయం శిష్య బృందం కూచిపూడి నృత్యమాలిక ప్రేక్షకులను ఆలరించాయి. తొలుత ఈ కార్యక్రమాల్ని ఆలయ పాలక మండలి అధ్యక్షుడు మస్తానయ్య, ప్రముఖ అడిటర్ రామరాజు శ్రీనివాస్ తో కలిసి బొప్పూడి కృష్ణమ...
ఇటీవలి పోస్ట్‌లు

కనులపండువగా విప్రనారాయణ యక్షగానం - 07.08.2026

కనులపండువగా విప్రనారాయణ యక్షగానం స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై మూడు రోజులపాటు జరగనున్న నృత్య కిన్నెర-కూచిపూడి నృత్యోత్సవాలు శుక్రవారం ప్రారంభమ య్యాయి. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ఆధ్వర్యంలో జరగ్గా, అతిథులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. శ్రీసాయిమంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమి ఆధ్వర్యం లో కళా రత్న కాజా వెంకటసుబ్రహ్మణ్యం దర్శకత్వంలో విజయరాఘవనాయుడు రచించగా, సంగీతం కుమార సూర్యనారాయణ అందించగా విప్రనారాయణ చరితం యక్ష గానం ప్రదర్శన నిర్వహిం చారు. ప్రేక్షకులను అలరించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం స్వీకరించిన కుమార సూర్యనారాయణను అతిధులు, సంస్థ తరుపున సత్కరించారు. పి.త్రివిక్రమరావు, ఆం ధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్, డీఎస్పీ గోలి లక్ష్మయ్య, పాలకమండలి అధ్యక్షులు సిహెచ్.మస్తానయ్య, సహా కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు ప్రసంగించారు. కార్య క్రమంలో సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఆర్. ప్రభాకరరావు, కార్యదర్శి మద్దాళి రఘురామ్, నిర్వాహ కులు పి.విజయకుమార్, కోశాధికారి కేవీ సుబ్బారావు పాల్గొన్నారు.

ఇహలోక సుఖాలు అశాశ్వతం - పూజ్యశ్రీ కె.వి. కోటేశ్వరరావు - 06.08.2026

ఇహలోక సుఖాలు అశాశ్వతం  శరీరాలు, సంపదలు శాశ్వతం కాదని, ఈ రెండు శాశ్వతం కానప్పుడు వాటి నుంచి లభించే సుఖం కూడా శాశ్వతం కాదని ఆధ్యాత్మిక ప్రవచకులు కేవీ కోటేశ్వరరావు అన్నారు. బృందా వన్ గార్డెన్స్లోలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై రెండు రోజులుగా వ్యాస మహర్షి రచించిన విశ్వనాథాష్టకంపై నిర్వహించిన ప్రవచనాలు గురువారం ముగిశాయి. ఆలయ పాల కమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్య క్షుడు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేవీ కోటేశ్వరరావు మాట్లాడుతూ, సుఖానికి హేతువు, సుఖస్థానం భగవంతుడేనని అన్నారు. అనిత్యమైన వాటి కోసం జీవితాంతం శ్రమించినా శాశ్వత సుఖం లభించదన్నారు. ఆ జ్ఞానం కలిగినప్పుడు మనసు అనిత్యమైన వాటి నుంచి శాశ్వత మైన సుఖాన్ని ప్రసాదించే భగవంతుని వైపు తిరుగు తుందని చెప్పారు. పి. శివారెడ్డి, తూనుగుంట్ల సుం దరరామయ్య, వి. ఏకాంబరేశ్వరరావు, వి. అరు ణకుమారి, వలేటి అంకినీడు ప్రసాద్, బి. యశోద తదితరులు పాల్గొన్నారు.

విశ్వనాథాష్టకంపై ఆధ్యాత్మిక ప్రవచనం - 05.08.2026

విశ్వనాథాష్టకంపై ఆధ్యాత్మిక ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై వ్యాస మార్చి రచించిన విశ్వనాధాష్టకం పై బుధవారం ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రవచకులు, సుందర చైతన్యానంద శిష్యులు కే.వీ. కోటేశ్వరరావు ప్రవచనం చేస్తూ విశ్వాన్ని సృష్టించిన భగవంతుడు విశ్వవ్యాప్తమై విశ్వంలోనే ఉన్నాడన్నారు. సృష్టిలోని ధర్మాలన్నీ దైవ స్వరూపమే, ధర్మమే దైవం అంటూ సృష్టి ధర్మాలే దైవస్వరూపాలు అన్నారు. ధర్మజీవనమే దైవారాధనతో సమానమన్నారు అందువల్ల చేసే ప్రతి పని పూజగా మారుతుంది. ధర్మం తోడుగా వున్నప్పుడు. దైవం వున్నట్లే అన్నారు. చేసే పనిలో ధర్మం తొంగిచూస్తే దైవం నిన్సు చేస్తున్నట్లే అని తెలిపారు. ధర్మమూ, దైవము వేరుకాదు. మన కర్మలని మార్చకుండా కర్మలలో దైన భావం ఏర్పరుచుకుంటే జీవితం యజ్ఞ స్వరూపంగా మారుతుంది. కాశీ మహా పుణ్య క్షేత్రమని విశ్వనాధ దర్శనంతో ఒక్క రోజులో పుణ్యం లభిస్తుందన్నారు. జీవితకాల ఆరాధనచేసిన ఫలితం విశ్వనాధుని ఒక్క దర్శనంతో లభిస...

పద్మావతి బాలచంద్ర కళాకార పురస్కార ప్రధానోత్సవం - 04.08.2026

పద్మావతి  బాలచంద్ర  కళాకార పురస్కార ప్రధానోత్సవం  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై  శ్రీ పద్మావతి బాలచంద్ర ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం మంచా బాలచందర్రావు 6వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలుత పద్మావతి బాలచందర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రముఖ రంగస్థలం నటుడు, దర్శకుడు ఎం. వి.ఎల్. నరసింహారావు అధ్యక్షత వహించారు.  అతిథులుగా ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య, ప్రముఖ రంగస్థల నటుడు తుర్లపాటి రాధాకృష్ణమూర్తి రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు కావూరి సత్యనారాయణ,ప్రముఖ నాట్యాచార్య డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం, చింతల ఆనంద్, కే. శ్రీనివాస్, కే.శివ ప్రసాద్ రావు, మంచా కృష్ణమోహన్,ఎం గణేష్ తదితరులు పాల్గొని ప్రముఖ రంగస్థల నటుడు ఉప్పలపాటి సైదులు ను పద్మావతి బాలచంద్ర కళాకార పురస్కారంతో ఘనంగా సత్కరించారు. సభానంతరం శ్రీ సాయి మంజీరా కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు,  నాట్యాచార్య డాక్టర్ కాజా వెంకట సుబ్రమణ్యం శిష్యబృందం పలుకీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల...

పింగళి దేశభక్తి ఆదర్శనీయం - 03.08.2026

పింగళి దేశభక్తి ఆదర్శనీయం నట నాలయ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని సోమ వారం రాత్రి బృందావన గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ముఖ్యఅతిథిగా వచ్చి పింగళి దేశభక్తి, స్వాతంత్య్ర పోరాటంలో ఆయన పాత్ర, మువ్వన్నెల జెండా రూపొందించిన విధానం తదితరాలను వివరించారు. రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.రామచంద్రరాజు... వెంకయ్య జీవిత విశేషాలు తెలిపారు. కార్యక్రమంలో తూములూరి రాజేంద్రప్రసాద్, కాలంగి వంశీకృష్ణ, అన్నదాన సమాజం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, నటనాలయ అధ్యక్షుడు నీలం మందారావు, కొల్లూరి శివప్రసాదరావు ప్రసంగిం చారు. తొలుత కార్యక్రమాన్ని దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జ్యోతి సరళ స్మారక కళాపరిషత్ విశాఖ పట్నం వారు రేపటి శత్రువు నాటిక ప్రదర్శించారు.

అలరించిన భక్తి గానలహరి - 02.08.2026

అలరించిన భక్తి గానలహరి స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆదివారం బెల్లంకొండ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ చింతలపాటి గోపాలకృష్ణ జయంతి సందర్భంగా ఆదివారం జరిగిన భక్తి గానలహరి ప్రేక్షకులను అలరింపజేసింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయనీమణులు రమాగోపాలకృష్ణ, పావని, అంజనీ లు తమ గాత్రధారణలో పలువురు వాగ్గేయకారుల అరసినన్నుగాచిన, కలిగెనిదె నాకు కైవల్యము, ఇందరికి అభయమంబు లిచ్చు చేయి, విచ్చేయవమ్మా, వీధుల వీధుల అంటూ పలు అన్నమయ్య, నరసింహదాసు కీర్తనలను శ్రావ్యంగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. వయోలిన్‌పై పాలపర్తి సీతారామాంజనేయ శాస్త్రి, తబలాపై పి. బాలాజీ వాయిద్య సహకారం అందించారు.