ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అంకయ్యకు విశ్వనాథ సంస్కృతి పురస్కారం ప్రదానం - 07.02.2026

అంకయ్యకు విశ్వనాథ సంస్కృతి పురస్కారం ప్రదానం ప్రపంచంలోని ఏడువేల భాషల్లో భారతదేశంలో ఎనిమిది వందల భాషల్లో అంకమ్మ కథలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలుగు నెరవు వ్యవస్థాపకులు స.వెం.రమేష్ అన్నారు. దివంగత జె.వెంకటేశ్వరరావు ఆకాంక్ష విశ్వనాథ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో శనివారం సాయం త్రం బృందావన్గార్డెన్స్స్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవ స్థానం అన్నమయ్య కళావేదికపై సంపూర్ణ అంకమ్మ కథల గాయకుడు చలంచర్ల దానం అంకయ్య( కావలి)కు విశ్వనాథ సంస్కృతి పురస్కారం, నగదు అందించి సత్కరించారు. ముఖ్య వక్త రమేష్ మాట్లాడుతూ నాగరికత, అభివృద్ధి పేరుతో మనిషి అంతరిక్షంలో విహరిస్తున్నాడని అన్నారు. అయితే పుట్టుకకు మూలమైన సంస్కృతి మూలాలను మర్చిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిర క్షరాస్యుడైన అంకమ్మ కథల్లో ఇతివృత్తం ఆయన జ్ఞాన తపస్సుకు అద్దం పడుతుందని అన్నారు. విశ్వనాథ సాహిత్య అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ మద్దినేని సింహకౌటిల్యచౌదరి మాట్లాడుతూ అరు దైన గొప్ప కథల గాన కళాకారుడైన అంకయ్యను సత్కరించడం సాహిత్య అకాడమీకి గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. అనంతరం వంతలకోటి సాంబమూర్తి కళామండలి డాక్టర్ బొంతల కోటిశం కరరావు భాగవత బృందంతో తూర...
ఇటీవలి పోస్ట్‌లు

పాదుకా పట్టాభిషేకంపై ప్రవచనము - 04.02.2026

పాదుకా పట్టాభిషేకంపై ప్రవచనము స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై పచ్చిపులుసు రామకుమారి గారి జ్ఞాపకార్ధం భర్త పచ్చిపులుసు రాఘవరావుగారు మరియు కుటుంబసభ్యుల సౌజన్యంతో పాఠశాల విద్యార్ధులకు ఉపకార వేతనాల పంపిణి చేశారు. అనంతరం బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారిచే పాదుక పట్టాభిషేకం ఆధ్యాత్మిక ప్రవచనం కార్యక్రమం జరిగింది.

శ్రవణానందంగా సాగిన భక్తి గీతాలాపన - 03.02.2026

శ్రవణానందంగా సాగిన భక్తి గీతాలాపన స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శ్రీ సాయి సంగీత కళా నిలయ సంస్థ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సుమారు 52 మంది చిన్నారుల అన్నమయ్య కీర్తనలను గానం చేసి ప్రేక్షకులను శ్రవణానందం చేశారు. అనంతరం సీనియర్స్, కీబోర్డ్ కళాకారులు భక్తిగీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వివా ది స్కూల్ డైరెక్టర్ కోయ శ్రీనివాసరావు, హెల్త్ ఆస్పత్రి డాక్టర్ దుంప రవీంద్రరెడ్డి, టూబాకో బోర్డ్ మెంబర్, కొప్పరావూరి అగ్రో ప్రొడక్ట్ ఫౌండర్ కె. రమేష్ పాల్గొని చిన్నా రులను ఆశీర్వదించారు. ఏ.ఐ.ఆర్. బి హైగ్రేడ్, టీటీడీ ఆర్టిస్ట్ బి భువనేశ్వరికి సంగీత సుధామయి బిరుదు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నృత్య కళాభారతి అధ్యక్షుడు నాట్యాచార్యులు ఎన్. బాలు వ్యవహరించగా, వ్యవస్థాపక అధ్యక్షుడు తిన్నలూరి హరిబాబు కార్యక్రమాల్ని పర్యవేక్షించారు.

డిజిటల్ మోసాలపై అవగాహన అవసరం - 02.02.2026

డిజిటల్ మోసాలపై అవగాహన అవసరం బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై సోమవారం రాత్రి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మహిళా విభాగం ఆధ్వర్యంలో డిజిటల్ మోసాలపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో సైబర్ మోసాల బారిన పడకుండా ఎవరికి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హెల్ప్ ఏజ్ ఇండియా స్వచ్చంద సంస్థ తరఫున రాష్ట్ర సమన్వయకర్తగా పులి శ్యామ్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డిజిటల్, సైబర్ మోసాలు జరిగే తీరుతెన్నులు, వాటి నుంచి రక్షించుకొనే మార్గాలను వివరించారు. ప్రధానంగా మహిళలు, వయోవృద్ధులు ఎలా మోసపోతున్నారో వివరించి.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాహితీవేత్త ఆచార్య వెలువోలు నాగరాజలక్ష్మి నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ తూనుగుంట్ల రాధాబాయి అధ్యక్షత వహించారు. అనంతరం పులి శ్యామ్ను మహిళా విభాగం, ఆలయ పాలక మండలి సభ్యులు సత్కరించారు.

భక్తిశ్రద్ధలతో చండీహోమం - 01.02.2026

భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్ గార్డె న్స్ శ్రీవేంకటే శ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞా నపరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా ఆదివారం విశ్వశాంతిని కాం క్షిస్తూ ఛండీహోమం భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు. బొల్లేపల్లి సత్యనారా యణ లలితాంబ దంపతులచే పది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, ఛండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. ఆలయ కమిటీ అధ్య క్షుడు సీహెచ్. మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.

చూడముచ్చటగా నృత్య రూపకం - 01.02.2026

చూడముచ్చటగా నృత్య రూపకం బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై గుళ్లపల్లి సుబ్బారావు సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గోదాకల్యాణం కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శితమైంది. తొలుత గుళ్లపల్లి సుబ్బారావు, విశ్రాంత అధ్యాపకుడు నూతలపాటి తిరుపతయ్య, ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, వెంకటరామశర్మ దంపతులు జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారం భించారు. విజయవాడ శ్రీనృత్య ఆర్ట్ అకాడమీ నాట్యాచార్యులు భాగవతుల వెంకటరామశర్మ శిష్యబృందం గోదారంగనాథుల కల్యాణంలోని ప్రధానాంశాల ఇతివృత్తంతో నృత్య రూపకం ప్రదర్శించారు. అనంతరం భాగవతుల వెంకటరామశర్మ దంపతులను, శిష్య బృందాన్ని నిర్వాహకులు సత్కరించారు. సంస్థ సమన్వయకర్త గుళ్లపల్లి రాఘవ వేంద్ర కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

సాయిరాగా సంగీత కళాశాల పంచమ వార్షికోత్సవం - 31.01.2026

సాయిరాగా సంగీత కళాశాల పంచమ వార్షికోత్సవం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం సాయిరాగా సంగీత కళాశాల పంచమ వార్షికోత్సవాలు సంస్థ ప్రిన్సిపాల్ మునిపల్లె రమణి ఆధ్వర్యంలో ఉల్లాసంగా జరిగాయి. అతిథులుగా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి.హెచ్.మస్తానయ్య పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత రమణి మునిపల్లె ప్రార్ధనాగీతంతో స్వరార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూనియర్ శిష్యలు నాగవరపు తిశీత, కట్ట జూహితేశ్వరి, కట్టమోహిత యశస్వి, సూది గీతికా దీపాలక్ష్మీ శ్రీష్టి, సీనియర్స్ మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్, ఎం.రామశేషు గీతాలను ఆలపించి స్వరార్చన చేశారు. తబలాపై రమణ, ప్యాడ్స్పై ఈశ్వర్ చక్కటి వాయిద్య సహకారం అందించారు. మునిపల్లె మూర్తి వ్యాఖ్యనంతో బాబూరావు ఇస్మాయిల్, కార్య క్రమ పర్యవేక్షణ చేశారు.