కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం శ్రీగోవిందాష్టకమ్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సుందర సత్సంగ్ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ గోవిందాష్టకమ్ అనేది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ రచించిన ఒక అత్యంత మధురమైన , భక్తిరస పూరితమైన స్తోత్రమన్నారు. ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ అష్టకంలో శ్రీకృష్ణుని లీలలు , ఆయన దివ్య మంగళ స్వరూపం , పరమాత్మ తత్త్వం అద్భుతంగా వర్ణించబడ్డాయన్నారు. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో కృష్ణుడిని కేవలం ఒక గోపాలకుడిగా మాత్రమే కాకుండా , సృష్టి-స్థితి-లయ కారకుడైన పరబ్రహ్మ స్వరూపంగా కొనియాడారన్నారు.
ఆకట్టుకున్న సంప్రదాయ సంగీత కచేరి భావి తరాలకు సంప్రదాయ సంగీతాన్ని అందించటమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న కార్యక్రమాలు అభినందనీయమని డాక్టర్ వైవీకే దుర్గాప్రసాదరావు అన్నారు. గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో ‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ఆవరణలోని అన్నమయ్య కళావేదికపై నిర్వహిస్తోన్న వాగ్గేయకార మహోత్సవాలు 27.10.2024 ఆదివారం ముగిశాయి. డాక్టర్ వై.శైలజ , ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్. మస్తానయ్య , సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. సన్మండలి అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు డాక్టర్ పి.విజయ , ఎంవై. శేషు రాణి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ దుర్గప్రసాదరావు మాట్లాడుతూ కొన్నాళ్లుగా సన్మండలి నిర్వహిస్తోన్న సేవలు ప్రశంస నీయమని అన్నారు. అనంతరం విదుషి కస్తూరి కమలదీప్తి (విశాఖపట్నం) శాస్త్రీయ సంగీత కచేరి నిర్వహించారు. వయోలిన్పై మందా శ్రీరమ్య(చెన్నై) , మృదంగంపై బుర్రా శ్రీరామ్ (చెన్నై) వాయిద్యాన్ని అందించారు. అనంతరం ఉపాధ్యక్షులు డాక్టర్ రాజరాజేశ్వరి , ఎం.మీనాక్షి , పి.లలితదేవి , కార్యదర్శి ఎ.మంగాదేవి , కోశాధికారి ఎం. విజ...