ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పాదుకా పట్టాభిషేకముపై ఆధ్యాత్మిక ప్రవచనము - 07,08.05.2025

పాదుకా పట్టాభిషేకముపై ఆధ్యాత్మిక ప్రవచనము స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం పాదుకా పట్టాభిషేకముపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆల య కమిటీ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య , సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాహితీవేత్త మల్లాది కైలాసనాధ్ ప్రవచిస్తూ అయోధ్యాకాండలో అనేక ధర్మసూక్ష్యాలు మనకు తెలియవస్తాయన్నారు. దశరధ మహారాజు ప్రజలలో అన్ని వర్గాల వారిని పిలిపించి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి , ఆ సభలో శ్రీరాముడిని రాజుని చేద్దామని దీనిపై మీ మీ అభిప్రాయాలు చెప్పమన్నారు. దీనిని బట్టి ఆ రోజులల్లో ప్రజాస్వామ్యము ఎంత చక్కగా పరిఢవిల్లినదో మనకు అర్ధమవుతుందన్నారు. తండ్రిని సత్యము నందు నిలబెట్టుటకై శ్రీరాముడు అరణ్యములకు బయలు దేరుతాడనీ , తెల్లవారితే పట్టాభిషేకం అన్నపుడు , రెండు సందర్భాలలో కూడా శ్రీరాముడు ఒకే విధంగా ఉన్నాడని , ఇది దైర్యవంతుడి లక్షణమన్నారు. నేటి యువత శ్రీరాముడు చూపించిన ఈ లక్షణాలు తప్పక కలిగి ఉండాలన్నారు.

ప్రతిభామూర్తులకు సత్కారాలు - 21.01.2025

 ప్రతిభామూర్తులకు సత్కారాలు

వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన 70 సంవత్సరాల వయస్సు దాటిన మహిళలను సత్కరించారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై గుళ్లపల్లి సుబ్బారావు సేవాసంస్థ తరపున గుంటుపల్లి ఆరుణకుమారి మంగళవారం జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవాలయ పాలకమండలి గౌరవాధ్యక్షురాలు గద్దె రామతులశమ్మ (ఆధ్యాత్మికం), వేమూరి రామలక్ష్మి (సంగీతం), డాక్టర్ సీహెచ్. సుశీలమ్మ. (సాహిత్యం), ి.యన్.డి. శ్యామసుందరీ దేవి (విద్య), మాధవపెద్ది మీనాక్షి (సంగీతం) తో పాటు మరికొందరికి సత్కారాలు పొందారు. తొలుత గద్దె రామతులశమ్మ ఇంటి వద్ద ఆమెను సత్కరించి, రామతులశమ్మ జీవన యానం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి కుందుర్తి స్వరాజ్య పద్మజ అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్ ఎన్. విజయలక్ష్మి సంధానకర్తగా వ్యవహరించి గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ ప్రతి నెలా 70 సంవత్సరాలు దాటిన, వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన మహిళలను సన్మానించాలని తీర్మానించడం అభినంద నియమన్నారు. కార్యక్రమంలో గుళ్ళపల్లి స్వాతి, అర్ధలపూడి నేహ, గుళ్ళపల్లి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిమంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకుడు డాక్టర్ కాజ వేంకట సుబ్రహ్మణ్యం శిష్యబృందం స్వాగతాంజలి నృత్యం ప్రదర్శించారు.








 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 04.10.2024 శుక్రవారం ఉదయం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికపై యం.వై.శేషురాణి, భువనేశ్వరి గార్లచే దేవీ కీర్తనల గానం సుమధురంగా సాగింది. తంగిరాల అన్నపూర్ణ (ఏ.ఐ.ఆర్. ఆర్టిస్ట్) వ్యాఖ్యానం అందించారు.
వాగ్గేయకారుల మహోత్సవాలు – గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావనగార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో వాగ్గేయకారుల మహోత్సవాలు 26.10.2027 శనివారం ప్రారంభమయ్యాయి. పి. జానకి జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. పెరవలి జయతి ప్రార్ధన అనంతరం స్థానిక విద్వాం సులు పలువురు వాగ్గేయకారుల వర్ణాలు , కృతుల గానం సంగీతాభిమానులను అలరించింది. ప్రధాన కచేరీలో భాగంగా విద్వాన్ వివేక్ మూజికులం , ( చెన్నై) శాస్త్రీయ సంగీత కచేరి జరి గింది. కచేరీకి వయోలి న్పై మంధా శ్రీరమ్య , ( చెన్నై) , మృదంగంపై బుర్రా శ్రీరామ్(చెన్నై) , ఘటం పై ఎస్.హను మంతరావు(తాడేపల్లి గూడెం) , వాద్య సహకా రాన్ని అందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామారావు , సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ ప్రసంగించారు. కార్యక్రమాలను డాక్టర్ జి. జాహ్నవి , ఆలయ పాలకమండలి అధ్యక్షులు మస్తానయ్య , కార్యదర్శి ఉమామహేశ్వరరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సంస్థ అధ్యక్ష, ప్రధా...
 తెలుగువారు గర్వించదగ్గ సాహితీ పరిశోధకులు ఆచార్య గంగప్ప ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు భాష విభాగాధిపతిగా పనిచేసిన సందర్భంలో తన శిష్యరికంలో వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దటంతో పాటు 25 మంది పిహెచ్డీలు 25 మంది ఎంఫిల్డ్ పట్టాలు సాధించటంతో పాటు శతాధిక గ్రంథకర్తగా, పరిశోధకుడిగా, మార్గదర్శకుడుగా ప్రఖ్యాతిగాంచిన ఆచార్య గంగప్ప రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప సాహిత్య కృషివలుడని ముఖ్యఅతిథిగా పాల్గొన్న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఇ.వి నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై ఆచార్య గంగప్ప స్మారక సాహిత్య పురస్కార కమిటీ ఆధ్వర్యంలో "ఆచార్య గంగప్ప 28వ సాహితీ పురస్కారం 2024" ప్రముఖ సాహిత్య వేత్త, అనువాద రచయిత డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి దేవి కి అందజేసి ఘనంగా సత్కరించి నగదు పురస్కారం అందజేశారు.  సభకు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షతగా దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన గావించారు. కార్యక్రమంలో ఆచార్య జీవి చలం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నిశెట్ట...