ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మే, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

అంకయ్యకు విశ్వనాథ సంస్కృతి పురస్కారం ప్రదానం - 07.02.2026

అంకయ్యకు విశ్వనాథ సంస్కృతి పురస్కారం ప్రదానం ప్రపంచంలోని ఏడువేల భాషల్లో భారతదేశంలో ఎనిమిది వందల భాషల్లో అంకమ్మ కథలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలుగు నెరవు వ్యవస్థాపకులు స.వెం.రమేష్ అన్నారు. దివంగత జె.వెంకటేశ్వరరావు ఆకాంక్ష విశ్వనాథ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో శనివారం సాయం త్రం బృందావన్గార్డెన్స్స్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవ స్థానం అన్నమయ్య కళావేదికపై సంపూర్ణ అంకమ్మ కథల గాయకుడు చలంచర్ల దానం అంకయ్య( కావలి)కు విశ్వనాథ సంస్కృతి పురస్కారం, నగదు అందించి సత్కరించారు. ముఖ్య వక్త రమేష్ మాట్లాడుతూ నాగరికత, అభివృద్ధి పేరుతో మనిషి అంతరిక్షంలో విహరిస్తున్నాడని అన్నారు. అయితే పుట్టుకకు మూలమైన సంస్కృతి మూలాలను మర్చిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిర క్షరాస్యుడైన అంకమ్మ కథల్లో ఇతివృత్తం ఆయన జ్ఞాన తపస్సుకు అద్దం పడుతుందని అన్నారు. విశ్వనాథ సాహిత్య అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ మద్దినేని సింహకౌటిల్యచౌదరి మాట్లాడుతూ అరు దైన గొప్ప కథల గాన కళాకారుడైన అంకయ్యను సత్కరించడం సాహిత్య అకాడమీకి గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. అనంతరం వంతలకోటి సాంబమూర్తి కళామండలి డాక్టర్ బొంతల కోటిశం కరరావు భాగవత బృందంతో తూర...

భక్తిశ్రద్ధలతో చండీ హోమం - 04.12.2026

భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.

భావితరాలకు స్ఫూర్తి సీతారామాచార్యులు - 04.12.2025

భావితరాలకు స్ఫూర్తి సీతారామాచార్యులు ప్రతిభా పాటవాలతో భావితరాలకు నుండి  స్ఫూర్తిని అందించిన సారస్వత మూర్తి శ్రీమాన్ కోగంటి సీతారామచార్యులు అని సాహిత్య శిరోమణి పండితరత్న ఎంటీ ఆల్వార్ కొనియాడారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం అన్నమయ్య కళా వేదికపై నిర్వహిస్తోన్న పండిత ప్రకర్ష కోగంటి సీతారామచార్యుల శత జయంతి ఉత్సవాలు గురువారం రెండో రోజుకి చేరాయి. దేవస్థానం సంయుక్త కార్యదర్శి పుట్టగుంట ప్రభాకరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించగా, సభకు చతుష్పావధాని కాశీ కవి అధ్యక్షత వహించారు. దత్త వైభవాన్ని మనోహరంగా, సుబోధకంగా కోగంటి వెం కటాచార్యులు వివరించారు. అక్కిరాజు సుందరరావు మాట్లాడుతూ తమ లాంటి వందలాది మందికి సీతారామాచార్యుల సన్నిహిత సాంగత్యం లభిం చడం పూర్వజన్మ సుకృతమని తెలిపారు. కార్యక్రమంలో కేవీఎల్ఎన్ అప్ప లాచార్యులు, డాక్టర్ కేవీ రంగనాయకి పాల్గొన్నారు.

ఘనంగా సీతారామాచార్యుల శతజయంతి - 03.12.2025

ఘనంగా సీతారామాచార్యుల శతజయంతి స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై పౌరాణిక శిరోమణి, బహు గ్రంథకర్త సారస్వతమూర్తి కోగంటి సీతారామచార్యుల శతజయంతి వారోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు చిట్టిపోతు మస్తానయ్య దీప ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న ప్రముఖ సాహితీవేత్త డీఎన్ దీక్షిత్ మాట్లాడుతూ సంస్కృతంతో పాటు తెలుగు సాహితీ ప్రియుల్ని ఆయన రచనలు అలరింప చేస్తాయని చెప్పారు. సభకు కోగంటి వీరరాఘవచార్యులు అధ్యక్షత వహించారు. ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి హనుమద్ వైభవంపై మాట్లాడారు. కార్యక్రమంలో తిరుప్పావై డాక్టర్ కోగంటి శ్రీరంగ నాయకి, భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపకుడు బొల్లేపల్లి సత్యనారాయణ, నూతలపాటి తిరుపతయ్య, కోగంటి అప్పలాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా భగవద్గీత పారాయణం - 01.12.2025

వైభవంగా భగవద్గీత పారాయణం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గీతా జయంతి సందర్భంగా సోమవారం భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి నిర్వహణలో సత్సంగ సభ్యులచే భగవద్గీత పారాయణం జరిగింది. తొలుత ఆలయ పాలకవర్గం వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డా. కోగంటి వేంకటే శ్రీరంగనాయకి ప్రవచిస్తూ, జీవన యుద్ధంలో ఎదురయ్యే సంకటాలను, కష్టాలను అధిగమించడానికి భగవద్గీతలో చెప్పబడిన మార్గదర్శకాలను అనుసరించడం భగవద్గీతను పఠించడం లేదా వినడం ద్వారా జ్ఞానం, ఓర్పు, నేర్పు లభిస్తాయని, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయన్నారు. అనంతరం సత్సంగ సభ్యులచే భగవద్గీత పారాయణం జరిగింది. కార్యక్రమంలో బొల్లేపల్లి సత్యనారాయణ, దేవాలయ కమిటి సభ్యుల పాల్గొన్నారు.

ఆకట్టుకున్న 'విడాకులు కావాలి' హాస్యనాటిక - 30.11.2025

ఆకట్టుకున్న 'విడాకులు కావాలి' హాస్యనాటిక స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని పద్మావతి కల్యాణ వేదికపై గుంటూరు గాంధీ వట్టికూటి వెంకటసుబ్బయ్య జయంతి వేడు కలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివారెడ్డి అధ్యక్షత వహించారు. అతిథులుగా పెద్ది సాంబశివరావు, పీఎస్ మూర్తి, విద్యావేత్త నూతలపాటి తిరుప తయ్య, ఆలయ ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని వట్టికూటి వెంకట సుబ్బ య్య చేసిన సామాజిక సేవలను కొనియాడారు. సభానంతరం అరవింద ఆర్ట్స్, తాడేపల్లి ఆధ్వర్యంలో వల్లూరు శివప్రసాద్ రచనకు గంగోత్రి సాయి దర్శకత్వం వహించిన విడాకులు కావాలి.. ఇచ్చట విడాకులు ఇవ్వబడవు హాస్యనాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం కళాకారులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. నన్నపనేని శేషగిరిరావు, సామ్రాజ్యలక్ష్మి దంపతుల సౌజన్యంతో జరిగిన కార్యక్రమాలను దాసరి హనుమంతరావు, వల్లూరు తాండవ కృష్ణ పర్యవేక్షించారు.

అలరించిన హరికథ గానం - 29.11.2025

అలరించిన హరికథ గానం స్థానిక బృందా వన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం ఈశ్వర వరప్రసాద పరిషత్తు నిర్వహణలో విజ యనగరానికి చెందిన హరికథా చూడామణి కాళ్ళ నిర్మల భాగవతారిణిచే శ్రీవల్లీ కల్యాణం హరికథాగానం అలరించింది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, పరిషత్తు కార్యదర్శి మోదుగుల రవికృష్ణ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు పసుపులేటి శ్రీధర్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ములుకుట్ల పున్నయ్యశాస్త్రి హరికథగా రచించిన స్కాంద పురాణాంతర్గతమైన వల్లీ, కుమారస్వామి కల్యాణ గాథలో నారదుని చమత్కారంతో లక్ష్మి అతిశయం ప్రకటించటం, తనకున్న సంపద ముల్లోకాలలో ఎవరికీ లేదని గర్వించటం, వల్లీదేవితో కుమా రస్వామి వివాహం భక్తజనామోదంగా జరగడం వంటి ఘట్టాలను భాగవతారిణి వీనులవిందుగా గానం చేశారు. మృదంగంపై భానుహర్ష, వయోలిన్పై మహేశ్వరరావు చక్కటి వాయిద్య సహకారం అందించారు. కళాకారులను గరిమెళ్ళ సత్యనారాయణమూర్తి, మోదుగుల రవికృష్ణ ఘనంగా సత్కరించారు.

శ్రీమద్భగవద్గీత అష్టాదశ అధ్యాయంలోని మోక్షసన్యాస యోగం - 24.11.2025 - 28.11.2025

 శ్రీమద్భగవద్గీతపై ప్రవచనాలు స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం శ్రీమద్భగవద్గీత అష్టాదశ అధ్యాయంలోని మోక్షసన్యాస యోగంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కార్యక్రమాన్ని పాలకమండలి వారు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. చిన్మయమిషన్ సువీరానందస్వామి ప్రవచిస్తూ అగ్ని పొగచే ఆవహించబడినట్లు కర్మలన్ని ఏదైనా ఒక దోషంతో కూడి ఉంటాయని, ప్రాపంచిక విషయాలపై ఆసక్తి లేనివారు, స్పృహరహితులు, అంతఃకరణాన్ని జయించిన వారు సాంఖ్యాయోగం ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్మ సిద్ధిని పొందుతారని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలిపారని అన్నారు.

మహతీ స్వరసుధ, గుంటూరు - 23.11.2025

మహతీ స్వరసుధ, గుంటూరు వారి రజతోత్సవాలలో భాగంగా ప్రముఖ గాయనీ, గాయకులచే 11వ సంగీత విభావరి. నిర్వహణ : పత్రి నిర్మల.

మల్లికార్జునరావుకు రంగస్థల పురస్కారం ప్రదానం - 21.11.2025

మల్లికార్జునరావుకు రంగస్థల పురస్కారం ప్రదానం స్థానిక బృందావన్గార్డెనన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్న మయ్య కళావేదికపై ఏపీ రాష్ట్ర భాషా సాంస్కృ తిక శాఖ, శ్రీసర్వేశ్వర నాట్యమండలి నిర్వహిస్తోన్న పద్య నాటకోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. తొలుత జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించగా, సభకు సంస్థ అధ్యక్షుడు టి.రాజాబాబు అధ్యక్షత వహించారు. అనం తరం జి.మల్లికార్జునరావును రంగస్థల పురస్కారంతో సత్కరించారు. సభానంతరం సత్యహరిశ్చంద్ర పద్య నాటకం ప్రదర్శించారు. హరిశ్చంద్రుడుగా చిట్యాల సతీష్పాల్, చంద్రమతిగా బి.అమృతవర్షిని రాగయుక్తంగా పద్యాలను అలపించారు. ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్.మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు.

వైభవంగా పద్య నాటకోత్సవాలు ప్రారంభం - 20.11.2026

వైభవంగా పద్య నాటకోత్సవాలు ప్రారంభం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, శ్రీ సర్వే శ్వర నాట్యమండలి ఆధ్వర్యంలో రెండు రోజులు జరగనున్న పద్య నాటకోత్సవాలు గురువారం మొదలయ్యాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య సభాధ్యక్షత వహించారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లా డుతూ తెలుగు పద్యానికి రాజాబాబు సేవలు ప్రశంసనీయమని అన్నారు. అట్ల రామకృష్ణారెడ్డి మయ సభ ఏకపాత్రాభినయంతో ఉత్సవాలను ప్రారం భించారు. శ్రీకృష్ణరాయభారం సన్నివేశంలో శ్రీకృష్ణుడిగా పల్నాటి సుబ్బారావు, అర్జునుడిగా చలువాది ప్రసాద్, దుర్యోధనుడిగా అట్ల రామకృ ష్ణారెడ్డి పౌరాణిక పద్యాలతో నాటక అభిమాను లను అలరించారు. అనంతరం సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్యకు చిత్ర విరించి బిరుదు ప్రదానం చేసి, సత్కరించారు. కార్యక్రమంలో శ్రీలక్ష్మీ నరసిం హస్వామి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ మేకల మోహనరావు, విశ్రాంత డీఎస్పీ రవికుమార్, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, ఊటుకూరి నాగేశ్వరరావు, మండలి అధ్యక్షుడు టి.రాజాబాబు, జి.మల్లికార్జునరావు పాల్గొన్నారు.