ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జూన్, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

దేహమే.. దేవాలయ భావనతో జీవితాన్ని కొనసాగించాలి - గరికపాటి నరసింహారావు - 14.12.2025

దేహమే.. దేవాలయ భావనతో జీవితాన్ని కొనసాగించాలి - గరికపాటి నరసింహారావు దేహమే దేవాలయం అన్న భావనతో జీవితాన్ని కొనసాగించడమే రాజనీతికి అంతిమ ప్రస్థానమని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై గుళ్లపల్లి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న గరిక పాటి ప్రవచనాలు ఆదివారంతో ముగిసాయి. చివరి రోజున ఆముక్తమాల్యద రాజనీతి అంశంపై డాక్టర్ గరికపాటి ప్రవచిస్తూ.. రాజైనవాడు తన పాలనలో ఆశ్రిత పక్షపాతాలకు తావివ్వకుండా ఆత్మసిద్ధితో నిర్ణయాలు తీసుకోవడంలో రాజు రాజర్షిగా వ్యవహరించాలని అన్నారు. విమర్శలను తట్టుకొని సమస్యలకు పరిష్కారం కోసం ధర్మ మార్గాన్ని ఎంచుకోవాలని ఆముక్తమాల్యద ద్వారా రాజనీతిజ్ఞత శ్రీకృష్ణదేవరాయలు ఆచరణలో చూపాడన్నారు. అవిశ్వాస తీర్మానం కుట్రతో టంగుటూరి ప్రకాశం, ఒక్క ఓటు తేడాతో మాజీ ప్రధాని వాజ్పేయి రాజీనామాలు చేసి రాజనీతిజ్ఞ తను చాటుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షుడు మస్తానయ్య, సేవా సంస్థ కన్వీనర్ గుళ్లపల్లి రాఘవేంద్రరావు శ్రీలక్ష్మి దంపతులు, చైత్రన్, చిట్టినేని శివ కోటేశ్వరరావు, పారా అశోక్ క...

దేహమే.. దేవాలయ భావనతో జీవితాన్ని కొనసాగించాలి - గరికపాటి నరసింహారావు - 14.12.2025

దేహమే.. దేవాలయ భావనతో జీవితాన్ని కొనసాగించాలి - గరికపాటి నరసింహారావు దేహమే దేవాలయం అన్న భావనతో జీవితాన్ని కొనసాగించడమే రాజనీతికి అంతిమ ప్రస్థానమని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై గుళ్లపల్లి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న గరిక పాటి ప్రవచనాలు ఆదివారంతో ముగిసాయి. చివరి రోజున ఆముక్తమాల్యద రాజనీతి అంశంపై డాక్టర్ గరికపాటి ప్రవచిస్తూ.. రాజైనవాడు తన పాలనలో ఆశ్రిత పక్షపాతాలకు తావివ్వకుండా ఆత్మసిద్ధితో నిర్ణయాలు తీసుకోవడంలో రాజు రాజర్షిగా వ్యవహరించాలని అన్నారు. విమర్శలను తట్టుకొని సమస్యలకు పరిష్కారం కోసం ధర్మ మార్గాన్ని ఎంచుకోవాలని ఆముక్తమాల్యద ద్వారా రాజనీతిజ్ఞత శ్రీకృష్ణదేవరాయలు ఆచరణలో చూపాడన్నారు. అవిశ్వాస తీర్మానం కుట్రతో టంగుటూరి ప్రకాశం, ఒక్క ఓటు తేడాతో మాజీ ప్రధాని వాజ్పేయి రాజీనామాలు చేసి రాజనీతిజ్ఞ తను చాటుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షుడు మస్తానయ్య, సేవా సంస్థ కన్వీనర్ గుళ్లపల్లి రాఘవేంద్రరావు శ్రీలక్ష్మి దంపతులు, చైత్రన్, చిట్టినేని శివ కోటేశ్వరరావు, పారా అశోక్ క...

రాజనీతిలో రాముడే ఆదర్శం - గరికపాటి నరసింహారావు - గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ - 13.12.2025

 రాజనీతిలో రాముడే ఆదర్శం ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు  భరతుడికి శ్రీరాముడు చేసిన ధర్మోపదేశం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. గుంటూరు, బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వర దేవస్థానం, అన్నమయ్య కళావేదికపై గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే గరికపాటి ప్రవచనాల కార్యక్రమం శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలుత శ్రీవేంకటేశ్వర దేవస్థానం వెబ్సైట్, యూప్ను దేవస్థానం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మస్తానయ్య, బొర్రా ఉమామహేశ్వరరావు, గుళ్ళపల్లి సుబ్బారావు, గుళ్ళపల్లి రాఘవేంద్ర రావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం రామాయణంలో రాజనీతిపై గరికపా టి ప్రవచించారు. రాజు అనేవాడు ఇంద్రియాలకు లొంగిపోకూడదు. పొగడ్తలకు పొంగిపోరాదు. అపరాధులను నేరం రుజువైన తరువాతే శిక్షించాలి. యువతలో దైవనామస్మరణ, ఆధ్యాత్మిక భావాలు పెంపొందించగల్గితే తద్వారా ధర్మ, చింతన పరోపకారకాలు సిద్ధి స్తాయని అన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రోత్సహిస్తే నాటి రాముడి రాజ్యం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని నగరంలో దేవాలయాల నిర్మాణం జరగడం శుభ సూచికమ...

క్షీరసాగర మధనంపై ఆధ్యాత్మిక ప్రవచనం - 09.12.2025

క్షీరసాగర మధనంపై ఆధ్యాత్మిక ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం క్షీర సాగర మధనంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మికవేత్త మల్లాది కైలాసనాధ్ ప్రవచిస్తూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ప్రయత్నం ప్రారంభించినప్పుడు మొదట ఆటంకాలు, కష్టాలు వస్తాయన్నారు. వాటిని చూసి భయపడి పారిపోకుండా ఓర్పుగా ప్రయత్నం చేసిన వారికి లక్ష్యం సిద్ధిస్తుందన్నారు.