ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జూన్, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

మహాభారతంపై ప్రవచనం - 20.07.2026

మహాభారతంపై ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం మహా భారతంలోని విరాటపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మిక వేత్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి ప్రవచిస్తూ ద్రౌపది అసాధారణ సౌందర్యాన్ని చూసి రాణి సోదరుడు, సర్వసైన్యాధ్యక్షుడైన కీచకుడు తీవ్రమైన మోహానికి గురవుతాడ న్నారు. ద్రౌపది తన భర్తలు గంధర్వులని, నన్ను తాకవద్దని ఎంత హెచ్చరిం చినా మదాంధుడైన కీచకుడు వినకుండా, రాజసభలోనే ఆమెను కాలితో తన్ని తీవ్రంగా అవమానిస్తాడన్నారు. ద్రౌపది రహస్యంగా భీముడిని కలిసి తన బాధను వెళ్లబోసుకుంటుందన్నారు. అక్కడ ద్రౌప దిలా ముసుగు తన్నుకుని వేచి ఉన్న భీముడు, కీచకుడితో భయంకరమైన మల్లయుద్ధం చేసి అతడి అవయవాలను విరిచి దారుణంగా సంహరిస్తాడన్నారు.

అలరించిన భక్తి సంగీత విభావరి - మహతీ స్వరసుధ - 28.06.2026

అలరించిన భక్తి సంగీత విభావరి బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై మహతి స్వరసుధ ఆధ్వర్యంలో సంగీత విభావరి ఆదివారం రాత్రి జరిగింది. కార్యక్రమంలో మహతి స్వరసుధ అధ్యక్షురాలు పత్రి నిర్మల, పాడుతా తీయగా-2019 విజేత కాండూరి లక్ష్మీశ్రీవల్లిలను నిర్వాహకులు సత్కరించారు. అనంతరం గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ కన్వీనర్ గుళ్లపల్లి రాఘవేంద్రరావును సత్కరించారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, గుళ్లపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా డాక్టర్ నాగ భైరవ సాహిత్య పురస్కార ప్రదానం - 27.06.2026

ఘనంగా డాక్టర్ నాగ భైరవ సాహిత్య పురస్కార ప్రదానం స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అన్నమయ్య కళావేదికపై శతాధిక గ్రంథ రచయిత డాక్టర్ జీవీ పూర్ణచంద్కు నాగభైరవ సాహిత్య పురస్కార ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ జక్కంపూడి సీతారామారావు, ముఖ్య అతిథి ప్రపంచ తెలుగు సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ భూసరపల్లి వెంకటేశ్వర్లు తదితరులు డాక్టర్ జీవీ పూర్ణచంద్కు నాగ భైరవ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. డాక్టర్ మోదగుల రవికృష్ణ సభా నిర్వహణ గావించిన ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఏఎన్యూ తెలుగు శాఖాధిపతి డాక్టర్ ఎన్వి కృష్ణారావు, యర్రగుంట్ల పాణిరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత మద్దిరాల ఆర్నవి చేసిన భక్తిరస నృత్యాలు ఆహుతులను అలరించాయి.

రంగస్థల కళాకారులకు బీవీ రావు ఆదర్శనీయులు - 26.06.2026

రంగస్థల కళాకారులకు బీవీ రావు ఆదర్శనీయులు రంగస్థల కళాకారుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బీవీ రావు ఆదర్శనీయులని పలువురు నివాళులర్పించారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై శ్రీజైభవాని నాట్య మండలి ఆధ్వర్యంలో బీవీ రావు కళాసేవా పుర స్కార సభ జరిగింది. సభకు రంగస్థల ప్రముఖుడు ఎంవీఎల్ నరసింహారావు అధ్యక్షత వహించారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తా నయ్య, జైభవాని నాట్యమండలి అధ్యక్షుడు అయితి వాసు దేవశర్మ, ఆర్కిటెక్ట్ బి. శ్రీనివాస్ తదితరులు బీవీ రావు వృత్తి ప్రవృత్తుల్లో కనబర్చిన నీలబద్ధత, ఆదర్శాలను వివరించారు. బి.వి.రావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటి రాంపిళ్ల రాజేశ్వరికి వి.ఎస్.వి.ఎస్. రోహిత్ అందించి సత్కరించారు. ఈసందర్భంగా డాక్టర్ నరాలశెట్టి రవికుమార్ దుర్యోధన- హేమ్లెట్, శ్రీకృష్ణదేవరాయలు ఏక పాత్రలను అభినయించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్య క్షుడు పి. రామచంద్రరాజు పాల్గొన్నారు. కార్యక్రమాలను బీవీఎస్ ప్రసాద్, కావూరి సత్యనారాయణ పర్యవేక్షించారు. ఏవీకే సుజాత వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

కేనోపనిషత్ పై ప్రవచనము - చిన్మయామిషన్ సువీరానందస్వామి - 25.06.2026

కేనోపనిషత్ పై ప్రవచనము స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గురువారం జరుగుల బంగారుబాబు, శివకుమారి దంపతుల సౌజన్యంతో ఉపనిషత్ స్రవంతిలో కేనోపనిషత్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయామిషన్ సువీరానందస్వామి ప్రవచిస్తూ ప్రతి ఆలోచన వెనుక , ప్రతి ఇంద్రియ చలనం వెనుక ఉన్న సాక్షి భూతమైన ఆత్మను గుర్తించడమే నిజమైన జ్ఞానమని , దీని ద్వారానే మనిషికి అమరత్వం సిద్ధిస్తుందని ఇక్కడ వివరించబడిందన్నారు. మానవ జన్మ లభించినప్పుడే ఈ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం అత్యంత ముఖ్యమని , ఈ జన్మలోనే దానిని సాధిస్తేనే జీవితం ధన్యమౌతుందన్నారు. మహా వినాశనం తథ్యమని హెచ్చరిస్తూ , వివేకవంతులు అన్నింటిలోనూ ఆ పరమాత్మను దర్శించి అమరులవుతారని ఈ అధ్యాయం సంక్షిప్తంగా ప్రబోధిస్తుందన్నారు.

కేనోపనిషత్ పై ప్రవచనం - చిన్మయామిషన్ సువీరానందస్వామి - 22-25.06.2026

కేనోపనిషత్ పై ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం, శ్రీ పద్మావతి కల్యాణవేదికపై సోమవారం జరుగుల బంగారుబాబు, శివకుమారి దంపతుల సౌజన్యంతో ఉపనిషత్ స్రవంతిలో కేనోపనిషత్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయామిషన్ సువీరానందస్వామి ప్రవచిస్తూ కేనోపనిషత్తులోని రెండో అధ్యాయం బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన ఒక పరమ సత్యాన్ని ఎంతో గంభీరంగా వివరిస్తుందన్నారు. నేను బ్రహ్మమును పూర్తిగా తెలుసుకున్నాను అని ఎవరైనా భావిస్తే, వారు దాన్ని అసలు తెలుసుకోలేదని, ఎందుకంటే బ్రహ్మము అనేది బుద్ధికి, ఇంద్రియాలకు పరిమితమయ్యే వస్తువు కాదని ఈ అధ్యాయం స్పష్టం చేస్తుందన్నారు.

అలరించిన భక్తి సంగీత విభావరి - 21.06.2026

అలరించిన భక్తి సంగీత విభావరి బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై ఆదివారం హైదరాబాద్ శ్రీవాణి కళానికేతన్ నిర్వాహకుడు భాగి నారాయణశాస్త్రి సంగీత కచేరి చేశారు. కార్యక్రమంలో పలు భక్తిగీతాలు, అన్నమాచార్యుల సంకీర్తనలు గానం చేసి ఆకట్టుకున్నారు. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలి గించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాలపర్తి సీతారామాంజనేయ శాస్త్రి, బి.ఎస్. సత్యదేవ్, వెంకట్లు వాద్య సహకారం అందించారు.

ప్రజాహిత కార్యక్రమాలకు చేయూతనిస్తా - రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ - 20.06.2026

ప్రజాహిత కార్యక్రమాలకు చేయూతనిస్తా గుంటూరు నగరంలో ప్రజాహిత కార్యక్రమాలకు తనవంతు చేయూత అందిస్తానని రాజ్యసభకు ఎన్నికైన భాష్యం రామకృష్ణ అన్నారు. నారా భువనేశ్వరి జన్మదిన పూజ సందర్భంగా శనివారం రాత్రి స్థానిక బృందావన గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి ఆయన వచ్చారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ధ్యాన మందిరంలో ఆలయ పాలకమండలి ఆయనకు సన్మా నసభ నిర్వహించింది. ఈ సందర్భంగా రామ కృష్ణ మాట్లాడుతూ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గుంటూరుకు ఎంతో సేవ చేస్తున్నారని, వారితో కలిసి తాను మరింతగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటానన్నారు. శ్రీవెంకటేశ్వర ధార్మిక సేవా సమితి పక్షాన ఆలయ పాలకమండలి నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం, హాస్పీస్ పేరున క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధుల బారిన పడి అంత్యకా లంలో బాధపడుతున్న వారికి ఉపశమనం, దానికి కావాల్సిన అంబులెన్స్ తదితర సౌకర్యాల కల్పనకు కృషి చెయ్యడం అభి నందనీయమన్నారు. ఆ కృషికి తన సహాయ సహకారాలు నిరంతరం ఉంటాయని చెప్పారు. తాను వెంకటేశ్వరస్వామి భక్తుడినని, తన అభివృద్ధి అంతా ఆ స్వామి దయేనని వివరించారు. సభలో యడ్లపాటి అశో...

శ్రీ భక్త జ్ఞానానంద తీర్థ మెమోరియల్ పురస్కార ప్రదానం - 20.06.2026

శ్రీ భక్త జ్ఞానానంద తీర్థ మెమోరియల్ పురస్కార ప్రదానం స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి అధ్యక్షులు డాక్టర్ పి.విజయ ఆధ్వర్యంలో శనివారం శ్రీ భక్త జ్ఞానానంద తీర్థ 36వ ఆరాధన సంగీత మహోత్సవ సభ జరిగింది. ఆప్తమాలజిస్ట్ డాక్టర్ ఎం. శ్రీధర్, ఆత్మీయ అతిథిగా విశ్రాంత జియోఫిజిస్ట్ ఓగీరాల రామకృష్ణ పాల్గొనగా, కార్యక్ర మాలను గైనకాలజిస్ట్ డాక్టర్ సి. జ్యోతి కామ్ ప్రసాదు ప్రారంభించారు. అనంతరం ప్రముఖ కర్నాటిక సంగీత విద్వాంసురాలు, ప్రొఫెసర్ డాక్టర్ వీ.గౌరీ రామ్మోహన్ ను భక్త జ్ఞానానంద తీర్థ మెమోరియల్ పురస్కారం తో ఘనంగా సత్కరించారు. అనంతరం గౌరీ రామ్మోహన్ వారి గాత్ర సంగీత కచేరి వీనుల విందుగా గానం చేసి, సంగీతాభిమానులను అలరించారు. వీరికి వయోలిన్ పై హెచ్ రాంచరణ్, మృదంగంపై కే.అరవింద్ చక్కటి వాయిద్య సహకారం అందించారు. అనంతరం కళాకారులను సన్మండలి సభ్యులు ఘనంగా సత్కరించారు.

ముగిసిన శ్రీసద్గురు కళానిలయం నాటకోత్సవాలు - 17.06.2026

ముగిసిన శ్రీసద్గురు కళానిలయం నాటకోత్సవాలు స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం, అన్నమయ్య కళావేదికపై శ్రీసద్గు రు కళానిలయం రజతోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న నాటకోత్సవాలు బుధవారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు కార్యక్రమాల్ని భారతీ ధార్మి క విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాధామాధవ రసరంజని నిర్వాహకులు, ఎస్.కె.ఖలీల్ శిష్య బృందం పలు కీర్తనలకు కూచి పూడి నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు. సభలో ప్రముఖ సినీరచయిత బుర్రా సాయిమాధవ్, కళా విపంచి కార్యదర్శి జి. మల్లికార్జునరావు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహే శ్వరరావు, రంగస్థల నటులు వి.గోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ రావు తదితరులు పాల్గొని ప్రముఖ రంగస్థల నటులు దర్శకులు పీవీఎన్ కృష్ణను ఘనంగా సత్కరించారు. అనంతరం హిందూకాలేజి వైస్ ప్రిన్సిపాల్ కేవీఎస్. దుర్గాప్రసాద్, అతిథులు, కళాకారులు బసవరాజు జయశంకర్ దంపతులను ఘనంగా సత్కరించారు. సభానంతరం శ...

నాటక రంగం, పరిషత్ల అభివృద్ధికి కృషి - 16.06.2026

నాటక రంగం, పరిషత్ ల అభివృద్ధికి కృషి నాటక రంగానికి, పరిషత్ల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని రాష్ట్ర నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. మంగళవారం సాయంత్రం బృందావన్ గార్డెన్స్లోవ్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శ్రీ సద్గురు కళానిలయం రజతోత్సవాల్లో భాగంగా ఏపీ ప్రభుత్వ రాష్ట్ర సృజ నాత్మకత, సంస్కృతి సమితి, ఏపీ ప్రభుత్వ రాష్ట్ర నాటక అకాడమి సౌజన్యంతో నాటకోత్సవాలు నిర్వహించారు. నటులు బి. మంజునాథ్ సభా పరి చయం చేయగా, ఎస్ వీఆర్ ఆసుపత్రి దంత వైద్యురాలు వి.కమల జ్యోతిప్రజ్వలనతో ప్రారంభిం చారు. నృత్య కళాభారతి(గుంటూరు) విద్యార్థినులు కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. రంగస్థల రచయిత పిన్నమనేని మృత్యంజయరావు, వేదిక అధ్యక్షులు ముత్తవరపు సురేష్ బాబు, ఏఎనీ్యూ హెచ్డీ లక్కరాజు భూషణ్, సీనియర్ వైద్యులు వీవీ రామ్కుమార్, సినీ నటులు ఎన్.రవీంద్రరెడ్డి, చెరుకూరి సాంబశివరావు, ఆలయ పాలక మండలి సహాయ కార్యదర్శి పుట్టగుంట ప్రభాకరరావు ప్రసంగించారు. రచయిత తుర్లపాటి రాధాకృష్ణమూర్తిని సత్కరించారు. అనంతరం కెర టాలు అనే నాటిక ప్రదర్శించగా, సందేశాత్మకంగా కొనసాగించారు. కళా...