ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జులై, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

శ్రీమద్భగవద్గీత పై ప్రవచనము - బ్రహ్మశ్రీ నిష్ఠల నరసింహమూర్తి - 03.07.2026

శ్రీమద్భగవద్గీత పై ప్రవచనము   స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గురువారం శ్రీమద్భగవద్గీత _ నేటి సమాజానికి ఆవశ్యకత పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీమద్భగవద్గీత ను భారతంలో అందించిన వ్యాసుల వారి గురించి  ఉపనిషన్మందిరం , శ్రీకాకుళం సభ్యులు బ్రహ్మశ్రీ నిష్ఠల శ్రీ నరసింహమూర్తి గారు స్మరణ చేస్తూ యద్య దాచరతి శ్రేష్టః.... , అసంశయం మహాబాహో..... తద్విద్ధి ప్రణిపాతేన... మొదలగు శ్లోకములు నేటి సమాజమునకు ఏ విధముగా స్ఫూర్తిదాయకము , ఈ శ్లోకముల నుండి స్ఫూర్తి పొందిన కొందరి ప్రముఖుల ప్రస్తావనను వక్త వివరించారు.  ప్రధానంగా విద్యార్థులు , యువత ఈ శ్లోకముల ద్వారా ఏ విధమైన స్ఫూర్తిని పొంది జీవితంలో ఉన్నత స్థానములు అధిరోహించవచ్చును అనే వివరణ తెలియజేశారు.  వక్తను కార్యవర్గ సభ్యులు అభినందించి , సత్కరించారు.  

శ్రీమద్భగవద్గీత పై ప్రవచనము - బ్రహ్మశ్రీ నిష్ఠల నరసింహమూర్తి - 03.07.2026

శ్రీమద్భగవద్గీత పై ప్రవచనము   స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గురువారం శ్రీమద్భగవద్గీత _ నేటి సమాజానికి ఆవశ్యకత పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీమద్భగవద్గీత ను భారతంలో అందించిన వ్యాసుల వారి గురించి  ఉపనిషన్మందిరం , శ్రీకాకుళం సభ్యులు బ్రహ్మశ్రీ నిష్ఠల శ్రీ నరసింహమూర్తి గారు స్మరణ చేస్తూ యద్య దాచరతి శ్రేష్టః.... , అసంశయం మహాబాహో..... తద్విద్ధి ప్రణిపాతేన... మొదలగు శ్లోకములు నేటి సమాజమునకు ఏ విధముగా స్ఫూర్తిదాయకము , ఈ శ్లోకముల నుండి స్ఫూర్తి పొందిన కొందరి ప్రముఖుల ప్రస్తావనను వక్త వివరించారు.  ప్రధానంగా విద్యార్థులు , యువత ఈ శ్లోకముల ద్వారా ఏ విధమైన స్ఫూర్తిని పొంది జీవితంలో ఉన్నత స్థానములు అధిరోహించవచ్చును అనే వివరణ తెలియజేశారు.  వక్తను కార్యవర్గ సభ్యులు అభినందించి , సత్కరించారు.  

భగవద్గీత భారతీయతకు ఆత్మలాంటిది - బ్రహ్మశ్రీ నిష్టల నరసింహమూర్తి - 02.07.2026

భగవద్గీత భారతీయతకు ఆత్మలాంటిది భగవద్గీత భారతీయతకు ఆత్మలాంటిదని, గీతను తెలుసుకుంటే ఉత్తమ వ్యక్తులుగా మారేందుకు అవకాశం ఉంటుందని ప్రవచన కర్త నిష్టల నరసింహమూర్తి అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గురువారం రాత్రి భగవద్గీత నేటి సమాజానికి అవసరం అనే అంశంపై ఆయన మాట్లాడారు. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య. సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నరసింహమూర్తి మాట్లాడుతూ భగవద్గీత అవసరం సమాజానికి ఎంతో ఉందని వివరించారు.

అలరించిన మహిళా సీనియర్ సిటిజన్స్ కదంబ కార్యక్రమం - 01.07.2026

  అలరించిన మహిళా సీనియర్ సిటిజన్స్   కదంబ కార్యక్రమం బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం వారి కదంబ కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీమతి వంకాయలపాటి హనుమాయమ్మ సభాధ్యక్షురాలు సమక్షంలో శ్రీమతి ఝాన్సీలక్ష్మీబాయి ఏకపాత్రాభినయానికి ప్రేక్షకులు అభినందించారు. మహిళా విభాగం సీనియర్ సభ్యురాలు శ్రీమతి వై.ఎస్. రాజ్యం గారు తమ అలనాటి చలనచిత్రగీతాలు ఆలపించి ప్రముఖ గాయని శ్రీమతి భానుమతిని స్మరింపజేశారు. డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అష్టాదశ శక్తి పీఠాలు - ధారావాహిక కార్యక్రమంలో భాగంగా కంచి కామాక్షి శక్తిపీఠం విశేషాలు సోదాహరణంగా వివరించారు. డాక్టర్ మైలవరపు లలితకుమారిగారి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని దేవాలయ పాలక మండలి అధ్యక్షులు శ్రీ చిటిపోతు మస్తానయ్య , సంయుక్త కార్యదర్శి శ్రీ ఊటుకూరి నాగేశ్వరరావు గార్లు జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించారు. ఆలయ కమిటి వారు గౌరవాధ్యక్షురాలు , సేవావిశారద శ్రీమతి గద్దె రామతులశమ్మ గారు సభ నడిపించిన మహిళా విభాగం అనేక వైవిధ్య కార్యక్రమాలు నిర్వహిం...

గోపాలకృష్ణకు జీవన సాఫల్య పురస్కారం - గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ - 30.06.2026

గోపాలకృష్ణకు జీవన సాఫల్య పురస్కారం గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికపై డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణకు జీవన సాఫల్య పురస్కార ప్రదానం మంగళవారం రాత్రి జరిగింది. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు ఆకుల వెంకట శేషసాయి, గన్నమనేని రామకృష్ణప్రసాద్లు.. డాక్టర్ గోపాలకృష్ణయ్య వైద్య సేవలను ప్రశంసించారు. కవి రాజచరిత్ర (కమ్మజన వర కీర్తి చంద్రిక), జీవన దాత.. విద్యా ప్రదాత మద్దినేని గోపాలకృ 'ష్ణయ్య' పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. రాగాలు సుస్ధిరం: సభానంతరం ఆకాశవాణి విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ మంగళగిరి ఆదిత్యప్ర సాద్ కర్ణాటక, హిందూస్థానీ సంగీతాల విశేషాలను ఉదాహరణ పూర్వకంగా రాగరవళి పేరుతో గీతాలాపన, పద్యగానాలు చేస్తూ నిర్వహించారు. సభకు గోళ్ల నారాయణరావు అధ్యక్షత వహించారు. ఎం. రవికృష్ణ సమన్వయకర్తగా వ్యవహరించారు. కార్యక్ర మంలో స్వాతి, డాక్టర్ సృజన్ కుమార్, గుళ్లపల్లి శాంతి, డాక్టర్ నేహా, సేవా సంస్థ కన్వీనర్ గుళ్లపల్లి రాఘవేం...

భక్తిశ్రద్ధలతో చండీహోమం - 29.06.2026

భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా సోమవారం విశ్వశాంతిని కాంక్షిస్తూ చండీహోమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 1 1మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి , శివలింగానికి , నవగ్రహాలకు విశేష అభిషేకాలు , అర్చనలు , లక్ష్మీగణపతి , చండీ , రుద్ర హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. ఆలయ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విశేషంగా పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.

వామన చరిత్ర పై ప్రవచనము - 29.06.2026

వామన చరిత్ర పై ప్రవచనము స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం వామన చరిత్రపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్రహ్మశ్రీ మల్లాది కైలాసనాధ్ ప్రవచిస్తూ అహంకారము పొందుట వలన కలిగే అనర్థాలను తెలియజేసేటువంటి చక్కటి ఘట్టమీ , ఈ వామన చరిత్ర అనేటువంటి ఘట్టము , బలి అంటే ఆత్మబలము కలవాడన్నారు. మూడడుగుల మేర దానము ఇస్తే గనకు నువ్వు , నీ వంశము - అందరు -నశించిపోతారు అని తెల్చి చెప్పినప్పటికీ , బలి చక్రవర్తి దానమివ్వటానికి సిద్ధపడ్డాడన్నారు. అందుకే భగవంతుడు బలిచక్రవర్తి కి తరువాతి మన్వంతరములో ఇంద్రపదవిని ఇచ్చాడని , భగమతుడు వామనావ లూరములో వచ్చి మహాభక్తుడయిన బలిచిత్ర వీరిని కాపాడిన విధము ఈ ఘట్టములో ఎంతో చక్కగా వివరించారు.