ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సనాతన ధర్మం – జీవనమార్గం - 11.07.2025

సనాతన ధర్మం – జీవనమార్గం సనాతన ధర్మం మతం కాదని జీవన విధానమని సంస్కృత భారతి సభ్యులు, భౌతికశాస్త్ర అధ్యాపకులు ఉపద్రష్ట లక్ష్మణసూరి అన్నారు.  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శుక్రవారం సనాతన ధర్మం – జీవన మార్గంపై ఆధ్యాత్మిక  ప్రసంగం జరిగింది. తొలుత ఆలయ కమిటి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు,  సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపద్రష్ట లక్ష్మణ సూరి ఉపన్యాసిస్తూ ప్రకృతిని ఆరాధించే సంస్కృతి మన సంప్రదాయమన్నారు. విశ్వప్రేమను భూమి అంత విస్తరింపచేసేది సనాతన ధర్మమన్నారు. ప్రశ్నించడం నేర్పిన సంస్కృతి మనదని, మనలో ఉన్న పరమాత్ముని చేరడానికీ భక్తి, కర్మ, జ్ఞాన మార్గాల ద్వారా మన సనాతన ధర్మం ఎన్నో సాంప్రదాయలను తరతరాలుగా అందించిదన్నారు. విజ్ఞానమయ భాండాగారమైన వేదాలు మనదేశానికి ఆస్తి అక్షర సంపదన్నారు. శాస్త్రవేత్త ప్రయోగశాలలో పరిశోధించే యంత్రమైన, దేవాలయంలో పురోహితుడు చదివే మంత్రమైన ఇద్దరి తంత్రం ఒకటేనన్నారు.

మానవధర్మ దర్శిని సుందరకాండ - 29.01.2025

 మానవధర్మ దర్శిని సుందరకాండ

బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై ముప్పవరపు కేశవరావు శత జయంతిని పురస్కరించుకొని రామాయణ ప్రవచన నవాహ జ్ఞానయజ్ఞం బుధవారం రాత్రి కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా సుప్రసిద్ధ పండితుడు సామవేదం షణ్ముఖశర్మ సుందరకాండపై ప్రవచనం చేశారు. సుందరకాండలో అక్షరాక్షరంలోనూ మానవాళి పాటించాల్సిన ధర్మాలు, బీజాక్షరాలతో కూడిన మంత్ర సమానాలైన శ్లోకాలు ఉన్నాయన్నారు. హనుమాన్ అనే శబ్దానికి వేద పరంగా జ్ఞానవంతుడు అని, ఆంజనేయుడు అంటే.. ఇంతకుముందున్న దానిని కనుగొనేవాడని అర్ధాలున్నాయని పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా విద్యా రణ్య పీఠ పండితుడు, ఘనపారి విష్ణు భట్ల లక్ష్మీనారాయణ శర్మ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ముప్పవరపు సింహాచల శాస్త్రి నిర్వహించారు. భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపకుడు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్. మస్తానయ్య, ఊటుకూరి నాగేశ్వరరావులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాగ్గేయకారుల మహోత్సవాలు – గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావనగార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో వాగ్గేయకారుల మహోత్సవాలు 26.10.2027 శనివారం ప్రారంభమయ్యాయి. పి. జానకి జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. పెరవలి జయతి ప్రార్ధన అనంతరం స్థానిక విద్వాం సులు పలువురు వాగ్గేయకారుల వర్ణాలు , కృతుల గానం సంగీతాభిమానులను అలరించింది. ప్రధాన కచేరీలో భాగంగా విద్వాన్ వివేక్ మూజికులం , ( చెన్నై) శాస్త్రీయ సంగీత కచేరి జరి గింది. కచేరీకి వయోలి న్పై మంధా శ్రీరమ్య , ( చెన్నై) , మృదంగంపై బుర్రా శ్రీరామ్(చెన్నై) , ఘటం పై ఎస్.హను మంతరావు(తాడేపల్లి గూడెం) , వాద్య సహకా రాన్ని అందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామారావు , సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ ప్రసంగించారు. కార్యక్రమాలను డాక్టర్ జి. జాహ్నవి , ఆలయ పాలకమండలి అధ్యక్షులు మస్తానయ్య , కార్యదర్శి ఉమామహేశ్వరరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సంస్థ అధ్యక్ష, ప్రధా...
‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 04.10.2024 శుక్రవారం ఉదయం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికపై యం.వై.శేషురాణి, భువనేశ్వరి గార్లచే దేవీ కీర్తనల గానం సుమధురంగా సాగింది. తంగిరాల అన్నపూర్ణ (ఏ.ఐ.ఆర్. ఆర్టిస్ట్) వ్యాఖ్యానం అందించారు.
 తెలుగువారు గర్వించదగ్గ సాహితీ పరిశోధకులు ఆచార్య గంగప్ప ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు భాష విభాగాధిపతిగా పనిచేసిన సందర్భంలో తన శిష్యరికంలో వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దటంతో పాటు 25 మంది పిహెచ్డీలు 25 మంది ఎంఫిల్డ్ పట్టాలు సాధించటంతో పాటు శతాధిక గ్రంథకర్తగా, పరిశోధకుడిగా, మార్గదర్శకుడుగా ప్రఖ్యాతిగాంచిన ఆచార్య గంగప్ప రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప సాహిత్య కృషివలుడని ముఖ్యఅతిథిగా పాల్గొన్న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఇ.వి నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై ఆచార్య గంగప్ప స్మారక సాహిత్య పురస్కార కమిటీ ఆధ్వర్యంలో "ఆచార్య గంగప్ప 28వ సాహితీ పురస్కారం 2024" ప్రముఖ సాహిత్య వేత్త, అనువాద రచయిత డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి దేవి కి అందజేసి ఘనంగా సత్కరించి నగదు పురస్కారం అందజేశారు.  సభకు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షతగా దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన గావించారు. కార్యక్రమంలో ఆచార్య జీవి చలం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నిశెట్ట...