అలరించిన సినీ సౌరభాలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మహతి స్వర సుధ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం ద్వితీయ కార్యక్రమంలో జరిగిన సినీ సౌరభాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత చార్టెడ్ అకౌంటెంట్ జి. సాయిబాబు, సాహితీ ప్రియులు పచ్చి పులుసు సూర్యనారాయణ, కే.శ్రీధర్ బాబు, బొబ్బిళ్ళ వెంకటేశ్వరరావు, మన్నవ సుబ్బారావు,ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయని గాయకులు పత్రి నిర్మల, జి హరికృష్ణ, డాక్టర్ ఏ వీర రాఘవ, ఎస్ కే రసూల్ బాబు, బి కృష్ణ ప్రసాద్, కీబోర్డు కే రవి, ఎస్ కే వలీ, సిహెచ్ రాజ్యలక్ష్మి, ఎం ఎం ప్రసన్నలక్ష్మి, ఎండి జరీనా, జి సువర్ణ విద్య, వి. రాజేశ్వరి దేవి, సిహెచ్ సుధా శ్రీనివాస్,బి ప్రద్యుమ్న సత్యోద్భవి లు తమ గాత్రధారణ లొ అలనాటి మేటి చిత్రాల్లోని పలు మధుర గీతాలను శ్రావ్యంగా ఆలపించారు. కీబోర్డుపై కే రవిబాబు, తబలాపై ఎస్ వెంకట్, ప్యాడ్స్ పై టి.ఈశ్వర్ వాయిద్య సహకార అందించారు. కె.మదన్ మోహన్ రావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి