ఆధ్యాత్మికత శాంతికి సోపానం సమాజంలో ఆధ్యాత్మిక చింతన పెరిగినప్పుడు శాంతి వర్ధిల్లుతుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ల మాధవి అన్నారు. స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ సమేత మహాకుంభాబిషేక మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదివారం శేష వాహన సేవ ఆలయ పాలకమండలి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. మూలవిరాట్లకు విశేష అభిషేకాలు, అర్చనలు, ఆలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య అధ్యక్షత వహిం చారు. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ తిరుమలలో జరిగినట్లుగానే గుంటూరులో ఉత్సవాలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. భీమవరానికి చెందిన త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి భాగవత విశేషాలను వివరించారు. ప్రముఖ సాహితీవేత్త మల్లాది కైలాస నాథ్ కుంభాబిషేక విశిష్టతను వివరించారు. వీవీఐటీ విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, భారతీ ధార్మిక విజ్ఞానపరిషత్ వ్యవస్థాపకుడు బొల్లే పల్లి సత్యనారాయణ, బొర్రా ఉమామహేశ్వరరావు ప్రసంగించారు. లంకా సూర్యనారాయణ, ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సూర్యదే...
లంకా సేవలకు గుర్తింపు
గుంటూరు అన్నదాన సమాజం ఆడిటోరియంలో, ఆదివారం సాయంత్రం అన్నమయ్య గ్రంథాలయ పాలకులు లంకా సూర్యనారాయణ చేసిన సేవలకు గుర్తింపుగా మిరాకిల్ వరల్డ్ రికార్డును మిరాకిల్ సంస్థ జ్యారీ సభ్యులు డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్ అందించారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత పంచాయితీ పరిషత్ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ గ్రంధాలయంలోని పుస్తకాలను చదివి విజ్ఞానవంతులు కావాలని కోరారు. మిరియాల ప్రసాదరావు, మద్దు వెంకటస్వామి, ఆర్.పి.ఎల్. నరసింహారావు,బండికల్లు జమదగ్ని, గాదె రత్నారెడ్డి తదితరులు లంకా వారు చేస్తున్న సేవలను ప్రస్తుతించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి