కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం శ్రీగోవిందాష్టకమ్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సుందర సత్సంగ్ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ గోవిందాష్టకమ్ అనేది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ రచించిన ఒక అత్యంత మధురమైన , భక్తిరస పూరితమైన స్తోత్రమన్నారు. ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ అష్టకంలో శ్రీకృష్ణుని లీలలు , ఆయన దివ్య మంగళ స్వరూపం , పరమాత్మ తత్త్వం అద్భుతంగా వర్ణించబడ్డాయన్నారు. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో కృష్ణుడిని కేవలం ఒక గోపాలకుడిగా మాత్రమే కాకుండా , సృష్టి-స్థితి-లయ కారకుడైన పరబ్రహ్మ స్వరూపంగా కొనియాడారన్నారు.
లంకా సేవలకు గుర్తింపు
గుంటూరు అన్నదాన సమాజం ఆడిటోరియంలో, ఆదివారం సాయంత్రం అన్నమయ్య గ్రంథాలయ పాలకులు లంకా సూర్యనారాయణ చేసిన సేవలకు గుర్తింపుగా మిరాకిల్ వరల్డ్ రికార్డును మిరాకిల్ సంస్థ జ్యారీ సభ్యులు డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్ అందించారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత పంచాయితీ పరిషత్ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ గ్రంధాలయంలోని పుస్తకాలను చదివి విజ్ఞానవంతులు కావాలని కోరారు. మిరియాల ప్రసాదరావు, మద్దు వెంకటస్వామి, ఆర్.పి.ఎల్. నరసింహారావు,బండికల్లు జమదగ్ని, గాదె రత్నారెడ్డి తదితరులు లంకా వారు చేస్తున్న సేవలను ప్రస్తుతించారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి