భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో కార్తీకమాసం, మాసశివరాత్రి సందర్భంగా మంగళ వారం చండీహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు.ఆలయ కమిటి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
లంకా సేవలకు గుర్తింపు
గుంటూరు అన్నదాన సమాజం ఆడిటోరియంలో, ఆదివారం సాయంత్రం అన్నమయ్య గ్రంథాలయ పాలకులు లంకా సూర్యనారాయణ చేసిన సేవలకు గుర్తింపుగా మిరాకిల్ వరల్డ్ రికార్డును మిరాకిల్ సంస్థ జ్యారీ సభ్యులు డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్ అందించారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత పంచాయితీ పరిషత్ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ గ్రంధాలయంలోని పుస్తకాలను చదివి విజ్ఞానవంతులు కావాలని కోరారు. మిరియాల ప్రసాదరావు, మద్దు వెంకటస్వామి, ఆర్.పి.ఎల్. నరసింహారావు,బండికల్లు జమదగ్ని, గాదె రత్నారెడ్డి తదితరులు లంకా వారు చేస్తున్న సేవలను ప్రస్తుతించారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి