భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
లంకా సేవలకు గుర్తింపు
గుంటూరు అన్నదాన సమాజం ఆడిటోరియంలో, ఆదివారం సాయంత్రం అన్నమయ్య గ్రంథాలయ పాలకులు లంకా సూర్యనారాయణ చేసిన సేవలకు గుర్తింపుగా మిరాకిల్ వరల్డ్ రికార్డును మిరాకిల్ సంస్థ జ్యారీ సభ్యులు డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్ అందించారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత పంచాయితీ పరిషత్ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ గ్రంధాలయంలోని పుస్తకాలను చదివి విజ్ఞానవంతులు కావాలని కోరారు. మిరియాల ప్రసాదరావు, మద్దు వెంకటస్వామి, ఆర్.పి.ఎల్. నరసింహారావు,బండికల్లు జమదగ్ని, గాదె రత్నారెడ్డి తదితరులు లంకా వారు చేస్తున్న సేవలను ప్రస్తుతించారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి