ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంప్రదాయ కళలతో దేవాలయాలకు మరింత శోభ - 08.08.2026

సంప్రదాయ కళలతో దేవాలయాలకు మరింత శోభ సంప్రదాయ కళలు దేవాలయాలకు మరింత శోభను తీసుకువస్తాయని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమూర్తి అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై నృత్య కిన్నెర ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న కూచిపూడి నృత్యోత్సవాల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. కూచిపూడి నృత్య కళ ఆంధ్ర రాష్ట్రానికే గర్వ కారణమన్నారు. అనేకమంది నాట్యాచార్యులు దేశ, విదేశాలలో కూచిపూడి నృత్య వైభవాన్ని చాటారన్నారు. సంస్కృతి సంప్రదాయలపై మక్కువ పెంచుకొనే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నృత్య కిన్నెర వారిని ఆయన అభినందించారు. అనంతరం కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ మద్దాళి ఉషా గాయత్రీ నృత్య దర్శకత్వంలో నృత్య కిన్నెర శిష్యబృందం శ్రీ అలమేలు మంగ చరితం కూచిపూడి నృత్య రూపకం, హంసధ్వని కూచిపూడి నృత్యాలయం శిష్య బృందం కూచిపూడి నృత్యమాలిక ప్రేక్షకులను ఆలరించాయి. తొలుత ఈ కార్యక్రమాల్ని ఆలయ పాలక మండలి అధ్యక్షుడు మస్తానయ్య, ప్రముఖ అడిటర్ రామరాజు శ్రీనివాస్ తో కలిసి బొప్పూడి కృష్ణమ...

ధర్మబద్ధ రాజకీయ నాయకుడిలా ఉన్నా - శోభనాద్రీశ్వరరావు 22.02.2025

ధర్మబద్ధ రాజకీయ నాయకుడిలా ఉన్నా - శోభనాద్రీశ్వరరావు

'రైతు జన నేతగా, ప్రజానాయకుడిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను. ధర్మబద్ధ రాజకీయ నాయకుడు ఎలా. ఉండాలో అలా ఉన్నాను' అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వధర్మ సేవా సంస్థ శనివారం రాత్రి ఆయనకు ధర్మజ్యోతి పురస్కారం ప్రదానం చేసి సత్కరించింది. శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రైతు పరంగా లాండ్ సీలింగ్ యాక్ట్ తదితర సందర్భాల్లో వచ్చిన సమస్యలను దిల్లీ నాయకులతో చర్చించి పరిష్కరించినవి అనేకం ఉన్నాయన్నారు. తాను ఏ పదవిలో ఉన్నా.. ఇంటికి వచ్చిన వారందరికీ తన భార్య ఆతిథ్య మిచ్చి తనకు మంచి పేరు తెచ్చిపెట్టినట్లు వివరించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ మాట్లాడుతూ రాన్రాను యువత వ్యవసాయానికి దూరమవుతున్నారని, ఈ పరిస్థితి మారాలన్నారు. రైతు కుంటుంబం నుంచి ఢిల్లీ వరకు వెళ్లి పదవులు చేప ట్టిన వారు కూడా రైతుకు మేలు చేసేలా చట్టాలు తేలేకపోవడం విచారకరమన్నారు. గౌతు లచ్చన్న తదితర నాయకుల అడుగు జాడల్లో నడిచిన వడ్డే శోభనాద్రీశ్వరరావు లాంటి వారు మాత్రం శక్తికొద్దీ పోరాడుతున్నారని. అలాంటి ఆదర్శ నాయకులు రావాలన్నారు. స్వధర్మ సేవా సంస్థ అధ్యక్షుడు కొర్రపాటి రామారావు సభకు అధ్యక్షత వహించారు. సభలో రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, అన్నమయ్య గ్రంథాలయం వ్యవస్థాపకుడు లంకా సూర్యనారాయణ, డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ, భారతీ దార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, కన్నెగంటి బుచ్చయ్య చౌదరి, సంస్థ కార్యదర్శి తూనుగుంట్ల సుందరరామయ్య, దేవినేని కరుణచంద్రబాబు, చంద్రమౌళి, పావులూరి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొని శోభనాధీశ్వరావును ధర్మజ్యోతి పురస్కారంతో సత్కరించారు.








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

ఘనంగా గురువులకు సత్కారం - 10.11.2025

ఘనంగా గురువులకు సత్కారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం   గురువులకు   చిరు సత్కార కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో విశ్వపావని సభాధ్యక్షులుగా వ్యవహించారు. అతిథులుగా డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి,   బెండపూడి లక్ష్మీకుమారి, డాక్టర్ గిరిజాశేషమాంబ, పాటిబండ్ల జానకి, పసుమర్తి పద్మజకుమారి పాల్గొన్నారు. యిమ్మడి అంజనీదేవి బృందం గురు వందనంలో భాగంగా భక్తిమాల కీర్తనలు పుస్తకరూపం అలాగే సీ.డి. రూపంలో తమను ప్రోత్సహించిన అతిథులను ఘనంగా సన్మానించారు. అతిథులు యిమ్మడి అంజనీదేవి బృందం సంగీతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమాలను యిమ్మడి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.