ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సిరుల కల్పవల్లీ వందనం - 26.09.2025

సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి. 

ధర్మబద్ధ రాజకీయ నాయకుడిలా ఉన్నా - శోభనాద్రీశ్వరరావు 22.02.2025

ధర్మబద్ధ రాజకీయ నాయకుడిలా ఉన్నా - శోభనాద్రీశ్వరరావు

'రైతు జన నేతగా, ప్రజానాయకుడిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను. ధర్మబద్ధ రాజకీయ నాయకుడు ఎలా. ఉండాలో అలా ఉన్నాను' అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వధర్మ సేవా సంస్థ శనివారం రాత్రి ఆయనకు ధర్మజ్యోతి పురస్కారం ప్రదానం చేసి సత్కరించింది. శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రైతు పరంగా లాండ్ సీలింగ్ యాక్ట్ తదితర సందర్భాల్లో వచ్చిన సమస్యలను దిల్లీ నాయకులతో చర్చించి పరిష్కరించినవి అనేకం ఉన్నాయన్నారు. తాను ఏ పదవిలో ఉన్నా.. ఇంటికి వచ్చిన వారందరికీ తన భార్య ఆతిథ్య మిచ్చి తనకు మంచి పేరు తెచ్చిపెట్టినట్లు వివరించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ మాట్లాడుతూ రాన్రాను యువత వ్యవసాయానికి దూరమవుతున్నారని, ఈ పరిస్థితి మారాలన్నారు. రైతు కుంటుంబం నుంచి ఢిల్లీ వరకు వెళ్లి పదవులు చేప ట్టిన వారు కూడా రైతుకు మేలు చేసేలా చట్టాలు తేలేకపోవడం విచారకరమన్నారు. గౌతు లచ్చన్న తదితర నాయకుల అడుగు జాడల్లో నడిచిన వడ్డే శోభనాద్రీశ్వరరావు లాంటి వారు మాత్రం శక్తికొద్దీ పోరాడుతున్నారని. అలాంటి ఆదర్శ నాయకులు రావాలన్నారు. స్వధర్మ సేవా సంస్థ అధ్యక్షుడు కొర్రపాటి రామారావు సభకు అధ్యక్షత వహించారు. సభలో రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, అన్నమయ్య గ్రంథాలయం వ్యవస్థాపకుడు లంకా సూర్యనారాయణ, డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ, భారతీ దార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, కన్నెగంటి బుచ్చయ్య చౌదరి, సంస్థ కార్యదర్శి తూనుగుంట్ల సుందరరామయ్య, దేవినేని కరుణచంద్రబాబు, చంద్రమౌళి, పావులూరి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొని శోభనాధీశ్వరావును ధర్మజ్యోతి పురస్కారంతో సత్కరించారు.








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

 తెలుగువారు గర్వించదగ్గ సాహితీ పరిశోధకులు ఆచార్య గంగప్ప ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు భాష విభాగాధిపతిగా పనిచేసిన సందర్భంలో తన శిష్యరికంలో వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దటంతో పాటు 25 మంది పిహెచ్డీలు 25 మంది ఎంఫిల్డ్ పట్టాలు సాధించటంతో పాటు శతాధిక గ్రంథకర్తగా, పరిశోధకుడిగా, మార్గదర్శకుడుగా ప్రఖ్యాతిగాంచిన ఆచార్య గంగప్ప రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప సాహిత్య కృషివలుడని ముఖ్యఅతిథిగా పాల్గొన్న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఇ.వి నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై ఆచార్య గంగప్ప స్మారక సాహిత్య పురస్కార కమిటీ ఆధ్వర్యంలో "ఆచార్య గంగప్ప 28వ సాహితీ పురస్కారం 2024" ప్రముఖ సాహిత్య వేత్త, అనువాద రచయిత డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి దేవి కి అందజేసి ఘనంగా సత్కరించి నగదు పురస్కారం అందజేశారు.  సభకు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షతగా దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన గావించారు. కార్యక్రమంలో ఆచార్య జీవి చలం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నిశెట్ట...

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు - 10.01.2025

ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు  ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని నగరంలోని బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఆలంకరించిన ఆసనంపై స్వామి ఉత్సవమూర్తులను ఉత్తరద్వారం ఎదురుగా ఏర్పాటు చేశారు. మూలవిరాట్‌లకు విశేష అభిషేకాలు , ప్రత్యేక పూజలు , అలంకరణ జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులుతీరారు. స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించి పూజలు నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.