ముగిసిన శ్రీసద్గురు కళానిలయం నాటకోత్సవాలు
స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం, అన్నమయ్య కళావేదికపై శ్రీసద్గు రు కళానిలయం రజతోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న నాటకోత్సవాలు బుధవారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు కార్యక్రమాల్ని భారతీ ధార్మి క విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాధామాధవ రసరంజని నిర్వాహకులు, ఎస్.కె.ఖలీల్ శిష్య బృందం పలు కీర్తనలకు కూచి పూడి నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు. సభలో ప్రముఖ సినీరచయిత బుర్రా సాయిమాధవ్, కళా విపంచి కార్యదర్శి జి. మల్లికార్జునరావు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహే శ్వరరావు, రంగస్థల నటులు వి.గోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ రావు తదితరులు పాల్గొని ప్రముఖ రంగస్థల నటులు దర్శకులు పీవీఎన్ కృష్ణను ఘనంగా సత్కరించారు. అనంతరం హిందూకాలేజి వైస్ ప్రిన్సిపాల్ కేవీఎస్. దుర్గాప్రసాద్, అతిథులు, కళాకారులు బసవరాజు జయశంకర్ దంపతులను ఘనంగా సత్కరించారు. సభానంతరం శిష్ట్లా చంద్రశేఖర్ రచనకు కేవీ ప్రసాద్ దర్శకత్వం వహించిన బహు రూపి నాటికను ప్రద ర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి