ప్రజాహిత కార్యక్రమాలకు చేయూతనిస్తా
గుంటూరు నగరంలో ప్రజాహిత కార్యక్రమాలకు తనవంతు చేయూత అందిస్తానని రాజ్యసభకు ఎన్నికైన భాష్యం రామకృష్ణ అన్నారు. నారా భువనేశ్వరి జన్మదిన పూజ సందర్భంగా శనివారం రాత్రి స్థానిక బృందావన గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి ఆయన వచ్చారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ధ్యాన మందిరంలో ఆలయ పాలకమండలి ఆయనకు సన్మా నసభ నిర్వహించింది. ఈ సందర్భంగా రామ కృష్ణ మాట్లాడుతూ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గుంటూరుకు ఎంతో సేవ చేస్తున్నారని, వారితో కలిసి తాను మరింతగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటానన్నారు. శ్రీవెంకటేశ్వర ధార్మిక సేవా సమితి పక్షాన ఆలయ పాలకమండలి నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం, హాస్పీస్ పేరున క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధుల బారిన పడి అంత్యకా లంలో బాధపడుతున్న వారికి ఉపశమనం, దానికి కావాల్సిన అంబులెన్స్ తదితర సౌకర్యాల కల్పనకు కృషి చెయ్యడం అభి నందనీయమన్నారు. ఆ కృషికి తన సహాయ సహకారాలు నిరంతరం ఉంటాయని చెప్పారు. తాను వెంకటేశ్వరస్వామి భక్తుడినని, తన అభివృద్ధి అంతా ఆ స్వామి దయేనని వివరించారు. సభలో యడ్లపాటి అశోక్ కుమార్ శ్రీవెంకటేశ్వర సేవాసమితి, అన్నమయ్య సేవాసమితి నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. సభలో ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామ హేశ్వరరావు, సహాయకార్యదర్శి ఊటుకూరి నాగే శ్వరరావు, పి.రమేష్, పావులూరి శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు సత్యనారాయణ, మస్తానయ్య తదితరులు భాష్యం రామకృష్ణను ఘనంగా సత్కరించారు.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి