నాటక రంగం, పరిషత్ ల అభివృద్ధికి కృషి
నాటక రంగానికి, పరిషత్ల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని రాష్ట్ర నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. మంగళవారం సాయంత్రం బృందావన్ గార్డెన్స్లోవ్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శ్రీ సద్గురు కళానిలయం రజతోత్సవాల్లో భాగంగా ఏపీ ప్రభుత్వ రాష్ట్ర సృజ నాత్మకత, సంస్కృతి సమితి, ఏపీ ప్రభుత్వ రాష్ట్ర నాటక అకాడమి సౌజన్యంతో నాటకోత్సవాలు నిర్వహించారు. నటులు బి. మంజునాథ్ సభా పరి చయం చేయగా, ఎస్ వీఆర్ ఆసుపత్రి దంత వైద్యురాలు వి.కమల జ్యోతిప్రజ్వలనతో ప్రారంభిం చారు. నృత్య కళాభారతి(గుంటూరు) విద్యార్థినులు కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. రంగస్థల రచయిత పిన్నమనేని మృత్యంజయరావు, వేదిక అధ్యక్షులు ముత్తవరపు సురేష్ బాబు, ఏఎనీ్యూ హెచ్డీ లక్కరాజు భూషణ్, సీనియర్ వైద్యులు వీవీ రామ్కుమార్, సినీ నటులు ఎన్.రవీంద్రరెడ్డి, చెరుకూరి సాంబశివరావు, ఆలయ పాలక మండలి సహాయ కార్యదర్శి పుట్టగుంట ప్రభాకరరావు ప్రసంగించారు. రచయిత తుర్లపాటి రాధాకృష్ణమూర్తిని సత్కరించారు. అనంతరం కెర టాలు అనే నాటిక ప్రదర్శించగా, సందేశాత్మకంగా కొనసాగించారు. కళాకారులను, అతిథులను సత్క రించగా, శ్రీ సద్గురు కళా నిలయం ప్రధాన కార్య దర్శి బసవరాజు జయశంకర్, బసవరాజు శ్రీలక్ష్మి పాల్గొన్నారు.




కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి