వైభవంగా పద్య నాటకోత్సవాలు ప్రారంభం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, శ్రీ సర్వే శ్వర నాట్యమండలి ఆధ్వర్యంలో రెండు రోజులు జరగనున్న పద్య నాటకోత్సవాలు గురువారం మొదలయ్యాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య సభాధ్యక్షత వహించారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లా డుతూ తెలుగు పద్యానికి రాజాబాబు సేవలు ప్రశంసనీయమని అన్నారు. అట్ల రామకృష్ణారెడ్డి మయ సభ ఏకపాత్రాభినయంతో ఉత్సవాలను ప్రారం భించారు. శ్రీకృష్ణరాయభారం సన్నివేశంలో శ్రీకృష్ణుడిగా పల్నాటి సుబ్బారావు, అర్జునుడిగా చలువాది ప్రసాద్, దుర్యోధనుడిగా అట్ల రామకృ ష్ణారెడ్డి పౌరాణిక పద్యాలతో నాటక అభిమాను లను అలరించారు. అనంతరం సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్యకు చిత్ర విరించి బిరుదు ప్రదానం చేసి, సత్కరించారు. కార్యక్రమంలో శ్రీలక్ష్మీ నరసిం హస్వామి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ మేకల మోహనరావు, విశ్రాంత డీఎస్పీ రవికుమార్, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, ఊటుకూరి నాగేశ్వరరావు, మండలి అధ్యక్షుడు టి.రాజాబాబు, జి.మల్లికార్జునరావు పాల్గొన్నారు.


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి