శ్రీమద్భగవద్గీతపై ప్రవచనాలు
స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం శ్రీమద్భగవద్గీత అష్టాదశ అధ్యాయంలోని మోక్షసన్యాస యోగంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కార్యక్రమాన్ని పాలకమండలి వారు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. చిన్మయమిషన్ సువీరానందస్వామి ప్రవచిస్తూ అగ్ని పొగచే ఆవహించబడినట్లు కర్మలన్ని ఏదైనా ఒక దోషంతో కూడి ఉంటాయని, ప్రాపంచిక విషయాలపై ఆసక్తి లేనివారు, స్పృహరహితులు, అంతఃకరణాన్ని జయించిన వారు సాంఖ్యాయోగం ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్మ సిద్ధిని పొందుతారని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలిపారని అన్నారు.






కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి