ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంప్రదాయ కళలతో దేవాలయాలకు మరింత శోభ - 08.08.2026

సంప్రదాయ కళలతో దేవాలయాలకు మరింత శోభ సంప్రదాయ కళలు దేవాలయాలకు మరింత శోభను తీసుకువస్తాయని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమూర్తి అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై నృత్య కిన్నెర ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న కూచిపూడి నృత్యోత్సవాల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. కూచిపూడి నృత్య కళ ఆంధ్ర రాష్ట్రానికే గర్వ కారణమన్నారు. అనేకమంది నాట్యాచార్యులు దేశ, విదేశాలలో కూచిపూడి నృత్య వైభవాన్ని చాటారన్నారు. సంస్కృతి సంప్రదాయలపై మక్కువ పెంచుకొనే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నృత్య కిన్నెర వారిని ఆయన అభినందించారు. అనంతరం కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ మద్దాళి ఉషా గాయత్రీ నృత్య దర్శకత్వంలో నృత్య కిన్నెర శిష్యబృందం శ్రీ అలమేలు మంగ చరితం కూచిపూడి నృత్య రూపకం, హంసధ్వని కూచిపూడి నృత్యాలయం శిష్య బృందం కూచిపూడి నృత్యమాలిక ప్రేక్షకులను ఆలరించాయి. తొలుత ఈ కార్యక్రమాల్ని ఆలయ పాలక మండలి అధ్యక్షుడు మస్తానయ్య, ప్రముఖ అడిటర్ రామరాజు శ్రీనివాస్ తో కలిసి బొప్పూడి కృష్ణమ...

ఆకట్టుకున్న కీర్తనల గానం - 09.11.2025

ఆకట్టుకున్న కీర్తనల గానం

స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై ఆదివారం రాత్రి భక్తి మాల పేరుతో నిర్వహించిన గీతాలాపన కార్య క్రమం ఆకట్టుకుంది. తొలుత ఆలయపాలక మండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య జ్యోతివెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యిమ్మడి అంజనీదేవి, చింతలపాటి రమామహేశ్వరి, సోనాముఖి, పావని, హేమకుసుమ, లక్ష్మీదేవి, జీవనజ్యోతి, దుర్గ, పార్వతి, సుభాషిణి, యశోద, ఉష, ఉమ, నాగరవళి, లోకేశ్వరి, భారతి, కామాక్షి, సుజాత, లక్ష్మీకుమారి, భారతి, ముర ళీకృష్ణ, బ్రహ్మేశ్వరిలు పలు కీర్తనలు ఆలపించారు. వీటికి డాక్టర్ తాతా గిరిజా శేషమాంబ స్వరకల్పన చేశారు. మల్లికార్జునరావు పర్యవేక్షించారు.








కామెంట్‌లు