చిల్డన్స్ డ్యాన్స్ ఒలంపియాడ్ ప్రారంభం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శ్రీ సాయిమంజీర కూచిపూడి ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో కాజ సత్యవతీదేవి నరసింహారావు మెమోరియల్ బాల కళావేదిక నిర్వహణలో 16వ చిల్డన్స్ డ్యాన్స్ ఒలంపియాడ్ శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన సీనియర్స్ విభాగానికి చెందిన కూచిపూడి నర్తకుల పోటీ సందర్భంగా ప్రదర్శించిన కూచిపూడి నాట్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉత్తమ ప్రదర్శన చేసిన 5గురు కళాకారులకు బాల కళారత్న పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ అధ్యక్షులు డాక్టర్ భూసుపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అతిథులుగా ఆలయ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, పర్చూరు మండల విద్యాశాఖాధికారి 1 డాక్టర్ అల్లూరు శివకోటేశ్వరరావు, విద్యాశాఖాధికారి పండలనేని వెంకటరామయ్య తదితరులు పాల్గొని అక్షిత, అధ్వైతరెడ్డి, రుషికా వైష్ణో, అన్వితశర్మ, ఉప్పాడ రుహిక, కొల్లి అక్షయ, కొట్టె తన్మయశ్రీ లను బాల కళారత్న పురస్కారంతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని వెంకటగిరి నాగలక్ష్మి, తాళ్ళూరి ధరణిలు తదితరులు పర్యవేక్షించారు.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి