బాల కళారత్న పురస్కార ప్రధానం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శ్రీ సాయిమంజీర కూచిపూడి ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో కాజ సత్యవతీదేవి నరసింహారావు మెమోరియల్ బాల కళావేదిక నిర్వహణలో 16వ చిల్డన్స్ డ్యాన్స్ ఒలంపియాడ్ ముగింపు సందర్భంగా ఆదివారం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన జూనియర్స్ విభాగానికి చెందిన కూచిపూడి నర్తకిమణుల పోటీలో పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శన చేసిన కళాకారులకు బాల కళారత్న పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ అధ్యక్షులు డాక్టర్ భూసుపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అతిథులుగా ఆలయ కమిటీ కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు,డాక్టర్ గాజుల రామకృష్ణ, సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి నాట్యాచార్య డాక్టర్ కాజ వెంకటసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని జమ్ము కుసుమాంజలి, దొంతిరెడ్డి లక్ష్మీ గోపిక, నువ్వుల చిన్మయి, సిహెచ్. వి. నివేదితశ్రీ, వై.కుందనసాయి, ఆర్.ఎస్.ఎల్. ఎస్.సాయి స్పందన, ఎం.నందయామిని లను బాలకళారత్న పురస్కారంతో, మూడు రోజులు న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించిన నాట్యచార్య ఎన్.బాలు, నాట్యాచార్య,కొరియోగ్రాఫర్ డాక్టర్ హలీంఖాన్ లను నటరాజ పాద స్వర్ణ మంజీర పురస్కారంతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని పి. నాగమహిత, నాగలక్ష్మిలు పర్యవేక్షించారు.




కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి