ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

భక్తిశ్రద్ధలతో చండీహోమం - భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ - 18.11.2025

భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో కార్తీకమాసం, మాసశివరాత్రి సందర్భంగా మంగళ వారం చండీహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు.ఆలయ కమిటి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

నిరంతర కళావాహిని - అన్నమయ్య కళావేదికపై ఏడాది పొడవునా కార్యక్రమాలే

నిరంతర కళావాహిని - అన్నమయ్య కళావేదికపై ఏడాది పొడవునా కార్యక్రమాలే

అన్నమయ్య కళావేదిక.. అదొక నిరంతర కళావాహిని గుంటూ రుతో పాటు ఇతర జిల్లాల కళాకా రులకు ఈ పేరు పరిచయమే. గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్మితమైంది. ఇక్కడి వెంకటేశ్వర స్వామి దేవా లయం ఎలా ఏడాది పొడవునా భక్తులకు దైవదర్శన భాగ్యం కలిగి స్తుందో.. అలాగే ఒక్క రోజూ కూడా ఆగకుండా సాంస్కృతిక, కళా సాహిత్య కార్యక్రమాలను ఈ వేదిక అందిస్తుంటుంది. ఇక్కడ ప్రదర్శన, ఇరత కార్యక్రమాల నిర్వహణకు మూడు నెలల ముందే వేదిక తేదీలను నమోదు చేసుకోవాలి. ఈ దైనందిన కార్యక్రమాలను మొక్కుబడిగా ఎవరో ఉద్యోగికి అప్పగించి ఊరుకోరిక్కడ. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య.. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు ప్రదర్శింపజేయాలి, భక్తులకు అవి ఏమేరకు ఉపకరిస్తాయనే అంశాలు పర్యవేక్షిస్తుంటారు. సభ్యులు కూడా నిర్వహణకు కావాల్సిన అంశాలను చూస్తుంటారు.  

వర్షాలొచ్చినా ఆగకుండా.. అన్నమయ్య కళావేదికపై ప్రదర్శించే కార్యక్రమాల కోసం సాయంత్రం ఆరు గంటల కల్లా వంద నుంచి 200 మంది ప్రేక్షకులు వేచి చూస్తుంటారు. ప్రేక్షకులకు అనువైన కుర్చీలు తదితర సౌకర్యాలు సిద్ధంగా ఉంటాయి. ప్రద ర్శనలిచ్చే వారికి వేదిక తదితరాలన్నీ ఉచితమే. ఇది ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం. వర్షాలొచ్చినా కార్యక్రమాలు ఆగకుండా తగిన ఏర్పాట్లు ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాయి. పాలక మండలిలో ఉపాధ్యక్షురాలిగా సేవలందిం చిన గద్దె రామతులశమ్మ వేదిక నిర్మాణానికి సహకరించారు.

ఇటీవల కొవిడ్ సమయంలో లాక్ డౌన్ ప్రకటించినప్పుడు మినహా 2000 సంవత్సరం నుంచి నేటి వరకు ప్రతి నిత్యం సంగీతమో, నృత్యమో, ఉపన్యాసమో, నాటకమో, కళారూపమో ప్రదర్శితమవుతుంది. కార్యక్రమాలు లేకపోతే ప్రవచనకర్తలతో ఆధ్యాత్మిక ప్రసంగాలు, కళాకారులతో కచేరీలు ఏర్పాటు చేస్తుంటారు. కవులు, కళాకారులు, రచయితలకు ఇదొక ఆత్మీయ వేదికగా.. తెలుగు కళ, భాషా సంస్కృతుల నిధిలా కొనసాగుతూనే ఉంది.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు - 10.01.2025

ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు  ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని నగరంలోని బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఆలంకరించిన ఆసనంపై స్వామి ఉత్సవమూర్తులను ఉత్తరద్వారం ఎదురుగా ఏర్పాటు చేశారు. మూలవిరాట్‌లకు విశేష అభిషేకాలు , ప్రత్యేక పూజలు , అలంకరణ జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులుతీరారు. స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించి పూజలు నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.