ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం - పూజ్యశ్రీ కె.వి. కోటేశ్వరరావు - 08,09.07.2026

కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం శ్రీగోవిందాష్టకమ్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సుందర సత్సంగ్ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ  గోవిందాష్టకమ్ అనేది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ రచించిన ఒక అత్యంత మధురమైన , భక్తిరస పూరితమైన స్తోత్రమన్నారు. ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ అష్టకంలో శ్రీకృష్ణుని లీలలు , ఆయన దివ్య మంగళ స్వరూపం , పరమాత్మ తత్త్వం అద్భుతంగా వర్ణించబడ్డాయన్నారు. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో కృష్ణుడిని కేవలం ఒక గోపాలకుడిగా మాత్రమే కాకుండా , సృష్టి-స్థితి-లయ కారకుడైన పరబ్రహ్మ స్వరూపంగా కొనియాడారన్నారు.

నిరంతర కళావాహిని - అన్నమయ్య కళావేదికపై ఏడాది పొడవునా కార్యక్రమాలే

నిరంతర కళావాహిని - అన్నమయ్య కళావేదికపై ఏడాది పొడవునా కార్యక్రమాలే

అన్నమయ్య కళావేదిక.. అదొక నిరంతర కళావాహిని గుంటూ రుతో పాటు ఇతర జిల్లాల కళాకా రులకు ఈ పేరు పరిచయమే. గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్మితమైంది. ఇక్కడి వెంకటేశ్వర స్వామి దేవా లయం ఎలా ఏడాది పొడవునా భక్తులకు దైవదర్శన భాగ్యం కలిగి స్తుందో.. అలాగే ఒక్క రోజూ కూడా ఆగకుండా సాంస్కృతిక, కళా సాహిత్య కార్యక్రమాలను ఈ వేదిక అందిస్తుంటుంది. ఇక్కడ ప్రదర్శన, ఇరత కార్యక్రమాల నిర్వహణకు మూడు నెలల ముందే వేదిక తేదీలను నమోదు చేసుకోవాలి. ఈ దైనందిన కార్యక్రమాలను మొక్కుబడిగా ఎవరో ఉద్యోగికి అప్పగించి ఊరుకోరిక్కడ. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య.. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు ప్రదర్శింపజేయాలి, భక్తులకు అవి ఏమేరకు ఉపకరిస్తాయనే అంశాలు పర్యవేక్షిస్తుంటారు. సభ్యులు కూడా నిర్వహణకు కావాల్సిన అంశాలను చూస్తుంటారు.  

వర్షాలొచ్చినా ఆగకుండా.. అన్నమయ్య కళావేదికపై ప్రదర్శించే కార్యక్రమాల కోసం సాయంత్రం ఆరు గంటల కల్లా వంద నుంచి 200 మంది ప్రేక్షకులు వేచి చూస్తుంటారు. ప్రేక్షకులకు అనువైన కుర్చీలు తదితర సౌకర్యాలు సిద్ధంగా ఉంటాయి. ప్రద ర్శనలిచ్చే వారికి వేదిక తదితరాలన్నీ ఉచితమే. ఇది ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం. వర్షాలొచ్చినా కార్యక్రమాలు ఆగకుండా తగిన ఏర్పాట్లు ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాయి. పాలక మండలిలో ఉపాధ్యక్షురాలిగా సేవలందిం చిన గద్దె రామతులశమ్మ వేదిక నిర్మాణానికి సహకరించారు.

ఇటీవల కొవిడ్ సమయంలో లాక్ డౌన్ ప్రకటించినప్పుడు మినహా 2000 సంవత్సరం నుంచి నేటి వరకు ప్రతి నిత్యం సంగీతమో, నృత్యమో, ఉపన్యాసమో, నాటకమో, కళారూపమో ప్రదర్శితమవుతుంది. కార్యక్రమాలు లేకపోతే ప్రవచనకర్తలతో ఆధ్యాత్మిక ప్రసంగాలు, కళాకారులతో కచేరీలు ఏర్పాటు చేస్తుంటారు. కవులు, కళాకారులు, రచయితలకు ఇదొక ఆత్మీయ వేదికగా.. తెలుగు కళ, భాషా సంస్కృతుల నిధిలా కొనసాగుతూనే ఉంది.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.

ఘనంగా గురువులకు సత్కారం - 10.11.2025

ఘనంగా గురువులకు సత్కారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం   గురువులకు   చిరు సత్కార కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో విశ్వపావని సభాధ్యక్షులుగా వ్యవహించారు. అతిథులుగా డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి,   బెండపూడి లక్ష్మీకుమారి, డాక్టర్ గిరిజాశేషమాంబ, పాటిబండ్ల జానకి, పసుమర్తి పద్మజకుమారి పాల్గొన్నారు. యిమ్మడి అంజనీదేవి బృందం గురు వందనంలో భాగంగా భక్తిమాల కీర్తనలు పుస్తకరూపం అలాగే సీ.డి. రూపంలో తమను ప్రోత్సహించిన అతిథులను ఘనంగా సన్మానించారు. అతిథులు యిమ్మడి అంజనీదేవి బృందం సంగీతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమాలను యిమ్మడి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.