హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
అనువాదం చాలా కష్టమైన పని
ప్రముఖ పరిశోధకులు ఆచార్య
గంగప్ప సాహితీ పురస్కార సభలో ముఖ్యఅతిథిగా జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్
మాట్లాడుతూ అనువాదం అనేది చాలా కష్టమైన పని అని తెలిపారు. సాహిత్యంలో ఒక భాష నుండి
మరొక భాషలోకి అనువదించేటప్పుడు భావం తప్పనిసరిగా రావాలి అని ఉద్ఘాటించారు. స్థానిక
బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై
గురువారం ఆచార్య గంగప్ప స్మారక పురస్కార సభ జరిగింది. సభకు అధ్యక్షత వహించిన గోళ్ళ
నారాయణరావు మాట్లాడుతూ పురస్కార గ్రహీత వెన్నా వల్లభరావు ఆకాశవాణిలో 50 నాటికలు,
నాటకాలు ప్రదర్శించారని తెలిపారు. నల్లనివాడు అనే రెడియో నాటకానికి జాతీయ అవార్డు
అందుకున్నారన్నారు. డాక్టర్ గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ డాక్టర్ వల్లభరావు
కేంద్రసాహిత్య అకాడమీ అనువాద పురస్కారం పొందారన్నారు. త్రిపురనేని రామస్వామి,
పింగళి వెంకయ్యల జీవితాలను తెలుగులోను, హిందీలోను వ్రాశారన్నారు. జస్టిస్
రామకృష్ణప్రసాద్ పురస్కర గ్రహీతను ఘనంగా సత్కరించి 5 వేల రూపాయల నగదు అందజేశారు.
సభలో ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, కందిమళ్ళ సాంబశివరావు, వెన్నిశెట్టి
సింగారావు, చిట్టినేని శివకోటేశ్వరరావు, అశోక్రెడ్డి, షేక్ మస్తాన్, యస్. మురళి,
సుబ్రహ్మణ్యం, సుష్మా తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ యన్.వి. కృష్ణారావు వందన
సమర్పణ చేశారు.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి