భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
అనువాదం చాలా కష్టమైన పని
ప్రముఖ పరిశోధకులు ఆచార్య
గంగప్ప సాహితీ పురస్కార సభలో ముఖ్యఅతిథిగా జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్
మాట్లాడుతూ అనువాదం అనేది చాలా కష్టమైన పని అని తెలిపారు. సాహిత్యంలో ఒక భాష నుండి
మరొక భాషలోకి అనువదించేటప్పుడు భావం తప్పనిసరిగా రావాలి అని ఉద్ఘాటించారు. స్థానిక
బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై
గురువారం ఆచార్య గంగప్ప స్మారక పురస్కార సభ జరిగింది. సభకు అధ్యక్షత వహించిన గోళ్ళ
నారాయణరావు మాట్లాడుతూ పురస్కార గ్రహీత వెన్నా వల్లభరావు ఆకాశవాణిలో 50 నాటికలు,
నాటకాలు ప్రదర్శించారని తెలిపారు. నల్లనివాడు అనే రెడియో నాటకానికి జాతీయ అవార్డు
అందుకున్నారన్నారు. డాక్టర్ గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ డాక్టర్ వల్లభరావు
కేంద్రసాహిత్య అకాడమీ అనువాద పురస్కారం పొందారన్నారు. త్రిపురనేని రామస్వామి,
పింగళి వెంకయ్యల జీవితాలను తెలుగులోను, హిందీలోను వ్రాశారన్నారు. జస్టిస్
రామకృష్ణప్రసాద్ పురస్కర గ్రహీతను ఘనంగా సత్కరించి 5 వేల రూపాయల నగదు అందజేశారు.
సభలో ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, కందిమళ్ళ సాంబశివరావు, వెన్నిశెట్టి
సింగారావు, చిట్టినేని శివకోటేశ్వరరావు, అశోక్రెడ్డి, షేక్ మస్తాన్, యస్. మురళి,
సుబ్రహ్మణ్యం, సుష్మా తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ యన్.వి. కృష్ణారావు వందన
సమర్పణ చేశారు.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి