కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం శ్రీగోవిందాష్టకమ్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సుందర సత్సంగ్ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ గోవిందాష్టకమ్ అనేది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ రచించిన ఒక అత్యంత మధురమైన , భక్తిరస పూరితమైన స్తోత్రమన్నారు. ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ అష్టకంలో శ్రీకృష్ణుని లీలలు , ఆయన దివ్య మంగళ స్వరూపం , పరమాత్మ తత్త్వం అద్భుతంగా వర్ణించబడ్డాయన్నారు. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో కృష్ణుడిని కేవలం ఒక గోపాలకుడిగా మాత్రమే కాకుండా , సృష్టి-స్థితి-లయ కారకుడైన పరబ్రహ్మ స్వరూపంగా కొనియాడారన్నారు.
అనువాదం చాలా కష్టమైన పని
ప్రముఖ పరిశోధకులు ఆచార్య
గంగప్ప సాహితీ పురస్కార సభలో ముఖ్యఅతిథిగా జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్
మాట్లాడుతూ అనువాదం అనేది చాలా కష్టమైన పని అని తెలిపారు. సాహిత్యంలో ఒక భాష నుండి
మరొక భాషలోకి అనువదించేటప్పుడు భావం తప్పనిసరిగా రావాలి అని ఉద్ఘాటించారు. స్థానిక
బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై
గురువారం ఆచార్య గంగప్ప స్మారక పురస్కార సభ జరిగింది. సభకు అధ్యక్షత వహించిన గోళ్ళ
నారాయణరావు మాట్లాడుతూ పురస్కార గ్రహీత వెన్నా వల్లభరావు ఆకాశవాణిలో 50 నాటికలు,
నాటకాలు ప్రదర్శించారని తెలిపారు. నల్లనివాడు అనే రెడియో నాటకానికి జాతీయ అవార్డు
అందుకున్నారన్నారు. డాక్టర్ గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ డాక్టర్ వల్లభరావు
కేంద్రసాహిత్య అకాడమీ అనువాద పురస్కారం పొందారన్నారు. త్రిపురనేని రామస్వామి,
పింగళి వెంకయ్యల జీవితాలను తెలుగులోను, హిందీలోను వ్రాశారన్నారు. జస్టిస్
రామకృష్ణప్రసాద్ పురస్కర గ్రహీతను ఘనంగా సత్కరించి 5 వేల రూపాయల నగదు అందజేశారు.
సభలో ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, కందిమళ్ళ సాంబశివరావు, వెన్నిశెట్టి
సింగారావు, చిట్టినేని శివకోటేశ్వరరావు, అశోక్రెడ్డి, షేక్ మస్తాన్, యస్. మురళి,
సుబ్రహ్మణ్యం, సుష్మా తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ యన్.వి. కృష్ణారావు వందన
సమర్పణ చేశారు.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి