ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై యువ కళావాహిని, కళావిపంచి సం యుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ప్రముఖులకు పురస్కార ప్రదానోత్సవ సభ నిర్వ హించారు. అనంతరం జె. రాధాకృష్ణకు కళావిపంచి జీవన సాఫల్య పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్యకు కళావిపంచి సాహిత్య పురస్కారం, జమలాపురం రాధాకృష్ణ జి.వి.జి.శంకర్, జి.మల్లికార్జునరావులకు బొప్పన ఆత్మీయ పురస్కారంతో సత్కరించారు. సభానంతరం ఉషోదయ కళానికేతన్ (కాట్రపాడు) ప్రదర్శించిన గారడి నాటిక అలరించింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విఫ్ జి.వి.ఆంజనేయులు, రాష్ట్ర నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికా ర్జునరావు, బి.జె.పి.అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్, డాక్టర్ రవి కొండబోలు, కె.సి.పి. సిమెంట్ వైస్ చైర్మన్ మధుసూదనరావు, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనా రాయణ, సయ్యద్ జానీబాషా పాల్గొన్నారు.
నాటక కళాకారులకు బొప్పన నరసింహారావు ఒక వరమని కళ పత్రిక సంపాదకుడు మొహమ్మద్ రఫీ అన్నారు. గుంటూరు బృందావన్గార్డెన్స్లోవ్స్లోని శ్రీవేంకటేశ్వ రస్వామి దేవాలయ ఆవరణలోని శ్రీపద్మావతి కళ్యాణ వేదికపై యువ కళావాహిని, ఆరాధన ఆర్ట్స్ అకాడమీ, డాక్టర్ రామరాజు ఫౌండేషన్, ఎన్టీఆర్ కళా పరిషత్, పతులూరు/ గుంటూరు, వై.కే.నాటక పరిషత్, ఉషోదయ కళానికేతన్, కళావిపంచి సంయు క్తంగా సోమవారం బొప్పన నరసింహారావు జన్మదిన వేడుకలు, కళ పత్రిక ప్రత్యేక సంచిక ఆవిష్కరణ, కళావిపంచి ఆత్మీయ పురస్కార సభ నిర్వహించారు. డాక్టర్ మొహమ్మద్ రఫీ, నూతలపాటి సాంబయ్య, డొగిపర్తి శంకరరావు, డాక్టర్ వంశీరామరాజు, నాయుడుగోపీ తదితరులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. యువకళావాహిని అధ్యక్షులు లంకా లక్ష్మీ నారాయణ సభాధ్యక్షత వహించారు.




కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి