అంకయ్యకు విశ్వనాథ సంస్కృతి పురస్కారం ప్రదానం ప్రపంచంలోని ఏడువేల భాషల్లో భారతదేశంలో ఎనిమిది వందల భాషల్లో అంకమ్మ కథలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలుగు నెరవు వ్యవస్థాపకులు స.వెం.రమేష్ అన్నారు. దివంగత జె.వెంకటేశ్వరరావు ఆకాంక్ష విశ్వనాథ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో శనివారం సాయం త్రం బృందావన్గార్డెన్స్స్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవ స్థానం అన్నమయ్య కళావేదికపై సంపూర్ణ అంకమ్మ కథల గాయకుడు చలంచర్ల దానం అంకయ్య( కావలి)కు విశ్వనాథ సంస్కృతి పురస్కారం, నగదు అందించి సత్కరించారు. ముఖ్య వక్త రమేష్ మాట్లాడుతూ నాగరికత, అభివృద్ధి పేరుతో మనిషి అంతరిక్షంలో విహరిస్తున్నాడని అన్నారు. అయితే పుట్టుకకు మూలమైన సంస్కృతి మూలాలను మర్చిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిర క్షరాస్యుడైన అంకమ్మ కథల్లో ఇతివృత్తం ఆయన జ్ఞాన తపస్సుకు అద్దం పడుతుందని అన్నారు. విశ్వనాథ సాహిత్య అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ మద్దినేని సింహకౌటిల్యచౌదరి మాట్లాడుతూ అరు దైన గొప్ప కథల గాన కళాకారుడైన అంకయ్యను సత్కరించడం సాహిత్య అకాడమీకి గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. అనంతరం వంతలకోటి సాంబమూర్తి కళామండలి డాక్టర్ బొంతల కోటిశం కరరావు భాగవత బృందంతో తూర...
ప్రజల వైద్యుడు డాక్టర్ ముద్దన హనుమంతరావు గ్రంథావిష్కరణ సభ
ప్రజల వైద్యుడు డాక్టర్
ముద్దన హనుమంతరావు జీవిత సంగ్రహంపై డాక్టర్ వెన్ని శెట్టి సింగారావు వ్రాసిన
గ్రంథా విష్కరణ సభ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర
స్వామి వారి దేవస్థానం శ్రీ పద్మావతి కళ్యాణ వేదికపై జరుపుతున్నట్లు భారతి ధార్మిక
విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లెపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ
వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆవరణలో కార్యక్రమం వివరాల ఆహ్వాన పత్రికను
ఆవిష్కరించిన అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ సభకు రాజ్యసభ పూర్వ సభ్యులు డాక్టర్
యలమంచిలి శివాజీ అధ్యక్షత వహిస్తారని, జ్యోతి ప్రకాశనం దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు
మస్తానయ్య చేస్తారని, విశిష్ట అతిథి పూర్వ పార్లమెంటు శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, శాసనమండలి పూర్వ సభ్యులు
కే ఎస్ లక్ష్మణరావు గౌరవ అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఆత్మీయ అతిథులుగా డాక్టర్ సీతారామయ్య
పారిశ్రామికవేత్త పోలిశెట్టి జ్ఞానదేవ్, సరస్వతి శిశు మందిరాల జిల్లా అధ్యక్షులు వనమా
పూర్ణచంద్రరావు, ఏపీ కాటన్ అసోసియేషన్ అధ్యక్షులు కొర్రపాటి రామారావు పాల్గొంటారు. డాక్టర్ ముద్దన హనుమంతరావు అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ
కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా బొల్లెపల్లి సత్యనారాయణ ఒక ప్రకటనలో
తెలియజేశారు. ఆహ్వాన పత్రికల ఆవిష్కరణలో బొల్లెపల్లి సత్యనారాయణ, చిటిపోతు మస్తానయ్య, డాక్టర్ వెన్ని శెట్టి
సింగారావు, ఏలూరి సూర్యనారాయణ, ఇరుగులపాటి వేణుగోపాలరావులు పాల్గొన్నారు.
.jpeg)
.jpeg)

.jpeg)
.jpeg)



.jpeg)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి