సంప్రదాయ కళలతో దేవాలయాలకు మరింత శోభ సంప్రదాయ కళలు దేవాలయాలకు మరింత శోభను తీసుకువస్తాయని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమూర్తి అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై నృత్య కిన్నెర ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న కూచిపూడి నృత్యోత్సవాల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. కూచిపూడి నృత్య కళ ఆంధ్ర రాష్ట్రానికే గర్వ కారణమన్నారు. అనేకమంది నాట్యాచార్యులు దేశ, విదేశాలలో కూచిపూడి నృత్య వైభవాన్ని చాటారన్నారు. సంస్కృతి సంప్రదాయలపై మక్కువ పెంచుకొనే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నృత్య కిన్నెర వారిని ఆయన అభినందించారు. అనంతరం కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ మద్దాళి ఉషా గాయత్రీ నృత్య దర్శకత్వంలో నృత్య కిన్నెర శిష్యబృందం శ్రీ అలమేలు మంగ చరితం కూచిపూడి నృత్య రూపకం, హంసధ్వని కూచిపూడి నృత్యాలయం శిష్య బృందం కూచిపూడి నృత్యమాలిక ప్రేక్షకులను ఆలరించాయి. తొలుత ఈ కార్యక్రమాల్ని ఆలయ పాలక మండలి అధ్యక్షుడు మస్తానయ్య, ప్రముఖ అడిటర్ రామరాజు శ్రీనివాస్ తో కలిసి బొప్పూడి కృష్ణమ...
ప్రజల వైద్యుడు డాక్టర్ ముద్దన హనుమంతరావు గ్రంథావిష్కరణ సభ
ప్రజల వైద్యుడు డాక్టర్
ముద్దన హనుమంతరావు జీవిత సంగ్రహంపై డాక్టర్ వెన్ని శెట్టి సింగారావు వ్రాసిన
గ్రంథా విష్కరణ సభ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర
స్వామి వారి దేవస్థానం శ్రీ పద్మావతి కళ్యాణ వేదికపై జరుపుతున్నట్లు భారతి ధార్మిక
విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లెపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ
వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆవరణలో కార్యక్రమం వివరాల ఆహ్వాన పత్రికను
ఆవిష్కరించిన అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ సభకు రాజ్యసభ పూర్వ సభ్యులు డాక్టర్
యలమంచిలి శివాజీ అధ్యక్షత వహిస్తారని, జ్యోతి ప్రకాశనం దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు
మస్తానయ్య చేస్తారని, విశిష్ట అతిథి పూర్వ పార్లమెంటు శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, శాసనమండలి పూర్వ సభ్యులు
కే ఎస్ లక్ష్మణరావు గౌరవ అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఆత్మీయ అతిథులుగా డాక్టర్ సీతారామయ్య
పారిశ్రామికవేత్త పోలిశెట్టి జ్ఞానదేవ్, సరస్వతి శిశు మందిరాల జిల్లా అధ్యక్షులు వనమా
పూర్ణచంద్రరావు, ఏపీ కాటన్ అసోసియేషన్ అధ్యక్షులు కొర్రపాటి రామారావు పాల్గొంటారు. డాక్టర్ ముద్దన హనుమంతరావు అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ
కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా బొల్లెపల్లి సత్యనారాయణ ఒక ప్రకటనలో
తెలియజేశారు. ఆహ్వాన పత్రికల ఆవిష్కరణలో బొల్లెపల్లి సత్యనారాయణ, చిటిపోతు మస్తానయ్య, డాక్టర్ వెన్ని శెట్టి
సింగారావు, ఏలూరి సూర్యనారాయణ, ఇరుగులపాటి వేణుగోపాలరావులు పాల్గొన్నారు.
.jpeg)
.jpeg)

.jpeg)
.jpeg)



.jpeg)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి