ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

భక్తిశ్రద్ధలతో చండీ హోమం - 04.12.2026

భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.

ప్రజల వైద్యుడు డాక్టర్ ముద్దన హనుమంతరావు గ్రంథావిష్కరణ సభ - 23.10.2025

ప్రజల వైద్యుడు డాక్టర్ ముద్దన హనుమంతరావు గ్రంథావిష్కరణ సభ

 

ప్రజల వైద్యుడు డాక్టర్ ముద్దన హనుమంతరావు జీవిత సంగ్రహంపై డాక్టర్ వెన్ని శెట్టి సింగారావు వ్రాసిన గ్రంథా విష్కరణ సభ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీ పద్మావతి కళ్యాణ వేదికపై జరుపుతున్నట్లు భారతి ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లెపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆవరణలో కార్యక్రమం వివరాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ సభకు రాజ్యసభ పూర్వ సభ్యులు డాక్టర్ యలమంచిలి శివాజీ అధ్యక్షత వహిస్తారని, జ్యోతి ప్రకాశనం దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య చేస్తారని, విశిష్ట అతిథి పూర్వ పార్లమెంటు శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, శాసనమండలి పూర్వ సభ్యులు కే ఎస్ లక్ష్మణరావు గౌరవ అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఆత్మీయ అతిథులుగా డాక్టర్ సీతారామయ్య పారిశ్రామికవేత్త పోలిశెట్టి జ్ఞానదేవ్, సరస్వతి శిశు మందిరాల జిల్లా అధ్యక్షులు వనమా పూర్ణచంద్రరావు, ఏపీ కాటన్ అసోసియేషన్ అధ్యక్షులు కొర్రపాటి రామారావు పాల్గొంటారు. డాక్టర్ ముద్దన హనుమంతరావు అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా బొల్లెపల్లి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆహ్వాన పత్రికల ఆవిష్కరణలో బొల్లెపల్లి సత్యనారాయణ, చిటిపోతు మస్తానయ్య, డాక్టర్ వెన్ని శెట్టి సింగారావు, ఏలూరి సూర్యనారాయణ, ఇరుగులపాటి వేణుగోపాలరావులు పాల్గొన్నారు.










కామెంట్‌లు