భక్తిశ్రద్ధలతో చండీహోమం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో మాసశివరాత్రి సందర్భంగా ఆదివారం విశ్వశాంతిని కాంక్షిస్తూ చండీహోమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, లక్ష్మీగణపతి, చండీ, రుద్ర హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. శ్రీమతి ధూళిపాళ్ల జోతిర్మయి, ఆలయ కమిటి అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి పుట్టగుంట ప్రభాకరరావు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విశేషంగా పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి