భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
ఆకాశదీపం ప్రారంభం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర్వసామి వారి దేవాలయ ప్రాంగణంలో కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు మాధవస్వామి బృందంచే ములవిరాట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ద్వజస్తంభం వద్ద ఆకాశదీపం వెలిగించి పూజలు నిర్వహించి ఆకాశదీపం అరోహణ గావించారు. అధిక సంఖ్యలో భక్తులు, సువాసినీలు పూజలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. పద్మావతి కళ్యావేదికపై శ్రీమాన్ గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామిచే మహాభారతంలోని అరణ్యపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు.





కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి