కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం శ్రీగోవిందాష్టకమ్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సుందర సత్సంగ్ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ గోవిందాష్టకమ్ అనేది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ రచించిన ఒక అత్యంత మధురమైన , భక్తిరస పూరితమైన స్తోత్రమన్నారు. ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ అష్టకంలో శ్రీకృష్ణుని లీలలు , ఆయన దివ్య మంగళ స్వరూపం , పరమాత్మ తత్త్వం అద్భుతంగా వర్ణించబడ్డాయన్నారు. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో కృష్ణుడిని కేవలం ఒక గోపాలకుడిగా మాత్రమే కాకుండా , సృష్టి-స్థితి-లయ కారకుడైన పరబ్రహ్మ స్వరూపంగా కొనియాడారన్నారు.
ఆకాశదీపం ప్రారంభం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర్వసామి వారి దేవాలయ ప్రాంగణంలో కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు మాధవస్వామి బృందంచే ములవిరాట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ద్వజస్తంభం వద్ద ఆకాశదీపం వెలిగించి పూజలు నిర్వహించి ఆకాశదీపం అరోహణ గావించారు. అధిక సంఖ్యలో భక్తులు, సువాసినీలు పూజలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. పద్మావతి కళ్యావేదికపై శ్రీమాన్ గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామిచే మహాభారతంలోని అరణ్యపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు.





కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి