హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
ఆకాశదీపం ప్రారంభం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర్వసామి వారి దేవాలయ ప్రాంగణంలో కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు మాధవస్వామి బృందంచే ములవిరాట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ద్వజస్తంభం వద్ద ఆకాశదీపం వెలిగించి పూజలు నిర్వహించి ఆకాశదీపం అరోహణ గావించారు. అధిక సంఖ్యలో భక్తులు, సువాసినీలు పూజలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. పద్మావతి కళ్యావేదికపై శ్రీమాన్ గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామిచే మహాభారతంలోని అరణ్యపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు.





కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి