హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
అలరించిన భక్తిసంగీత విభావరి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం భక్తిగాన లహరి వారిచే భక్తిసంగీత విభావరి కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బోడపాటి శ్రీనివాసరావు(జె.కె.సి. శ్రీను), సాంబశివరావులు తమ గాత్రధారణలో పలు భక్తి గీతాలను ఆలపించి ప్రేక్షకులను ఆలరింపజేశారు. కీబోర్డుపై లక్ష్మణ్, తబలాపై రమణ, ప్యాడ్స్ పై రవికుమార్ చక్కటి వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమానికి ఏ.వి.కె. సుజాత వ్యాఖ్యాతగా వ్యవహరించారు.






కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి