సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి.
అలరించిన భక్తిగీతాలపన
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం జరిగిన భక్తిగీతాలపన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయనీ యిమ్మడి అంజనీదేవి బృందం తమ గాత్రధారణలో పలు భక్తిగీతాలను శ్రావ్యంగా ఆలపించి ప్రేక్షకులను అలరింపజేశారు. వీరికి తబలపై బాలాజీ, కీబోర్డుపై అశోక్ కుమార్ చక్కటి వాయిద్య సహకారం అందించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి