దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిది శత్రుదేశాల నుండి మనదేశాన్ని రక్షించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని మేజర్ జర్నల్ మాదినేని రమేష్ బాబు అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శుక్రవారం భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వారి ఆధ్వర్యంలో పాకిస్తాన్తో యుద్ధం-సింధూరం పై విశ్లేషణ ప్రసంగం జరిగింది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు గుడిపూడి వెంకటరాయుడు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేజర్ జర్నల్ మాదినేని రమేష్బాబు మాట్లాడుతూ యుద్ధం అనేది ఆర్మీకో ఎయిర్ఫోర్స్ కో నేవీ కో చెందినది కాదన్నారు. యుద్ధంలో దేశంలోని పౌరులందరు భాగస్వాములు కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మనకు, భవిష్యత్ తరాలకు, ఉన్నది ఒకటే దేశమన్నారు. ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకుల బాగస్వామ్యంతో విజయం సాధించామన్నారు. సభలో నాదెండ్ల మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అలరించిన భక్తిగీతాలపన
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం జరిగిన భక్తిగీతాలపన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయనీ యిమ్మడి అంజనీదేవి బృందం తమ గాత్రధారణలో పలు భక్తిగీతాలను శ్రావ్యంగా ఆలపించి ప్రేక్షకులను అలరింపజేశారు. వీరికి తబలపై బాలాజీ, కీబోర్డుపై అశోక్ కుమార్ చక్కటి వాయిద్య సహకారం అందించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి