ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

భక్తిశ్రద్ధలతో చండీ హోమం - 04.12.2026

భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.

శ్రీమద్భగవద్గీత - క్షేత్రజ్ఞవిభాగయోగః ప్రవచనము - 19.03.2025

శ్రీమద్భగవద్గీత - క్షేత్రజ్ఞవిభాగయోగః ప్రవచనము - 19.03.2025

స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామిదేవాలయం అన్నమయ్య కళావేదికపై జరుబుల బంగారుబాబు, శివకుమారి దంపతుల సౌజన్యంతో బుధవా రం శ్రీమద్భగవద్గీత త్ర యోదశ అధ్యాయంలోని క్షేత్రజ్ఞ విభాగ యోగం ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, జరుబుల బంగారుబాబు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయమిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి ప్రవచిస్తూ పరమాత్మ ఆధ్యాత్మిక జ్ఞానము నందు నిత్యస్థితుడై యుండుట, తత్త్వజ్ఞానానికి ప్రతిపాద్యుడు భగవంతుడేనని తెలుసుకొనుట, జ్ఞానప్రాప్తికి సాధనములని వీటికి విపరీతమైనది అజ్ఞానమన్నారు. సదసత్తులకు, ఇంద్రియాలకు అతీతుడన్నారు. ప్రకృతి సంబంధం వలన గుణానుభవములను కలిగి ఉన్నవారు పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతారని తెలిపారు.








కామెంట్‌లు