ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రవికిరణ్ కు అయ్యంగార్ అవార్డు ప్రదానం - గాయత్రి మహిళా సంగీత సన్మండలి - 11.07.2026

రవికిరణ్ కు అయ్యంగార్ అవార్డు ప్రదానం స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో డాక్టర్ వింజమూరి వరదరాజ అయ్యంగార్ 111వ జయంతి మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా పురస్కార ప్రదానోత్సవం, శాస్త్రీయ సంగీత కచేరీ నిర్వహిం చారు. తొలుత కార్యక్రమాన్ని డాక్టర్ లలిత్ ప్రకాష్ చంద్రజ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ముఖ్య అతిథి డాక్టర్ బి. విజయభాస్కర్, గౌరవ అతిథులు వింజమూరి సంధ్య (చెన్నై), ఆలయ కమిటీ అధ్య క్షుడు సీహెచ్ మస్తానయ్య పాల్గొని డాక్టర్ వింజమూరి వరదరాజ అయ్యంగార్ సంగీత సేవలను కొనియాడారు. అనంతరం జి.రవికిరణ్ కు డాక్టర్ వింజమూరి వరదరాజ అయ్యంగార్ మెమోరియల్ అవా ర్డును ప్రదానం చేసి సత్కరించారు. సభ అనంతరం రవికిరణ్ శాస్త్రీయ సంగీత గాత్ర కచేరీ నిర్వహించి త్యాగరాజు తదితర వాగ్గేయ కారుల కృతులను ఆలపించి సంగీతాభిమానులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం.వై. శేషురాణి, ఉపాధ్యక్షులు మాధవపెద్ది మీనాక్షి డాక్టర్ రాజరాజేశ్వరి, పాటిబండ లలిత, కార్యదర్శి ఎ.వి. మంగాదేవి తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శ కవి.. తుమ్మల సీతారామమూర్తి - 21.03.2025

ఆదర్శ కవి.. తుమ్మల సీతారామమూర్తి 

సామాజిక చైతన్యంతో విప్లవాత్మక కవిత్వం రాసి తెలుగు జాతికి మార్గదర్శకత్వం వహించిన గొప్ప కవి తెనుగు లెంక తుమ్మల సీతారామమూర్తి అని పలువురు కీర్తించారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అన్న మయ్య కళావేదికపై తుమ్మల కళాపీఠం ఆధ్వ ర్యంలో తుమ్మల వర్ధంతి సందర్భంగా పోతన భాగవత సమారాధన, ఏటుకూరి సాహిత్య సమాలో చన, కార్యక్రమాలు జరిగాయి. తుమ్మల కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్ సభకు అధ్యక్షత వహించి కళాపీఠం నిర్వహిస్తున్న కార్యక్ర మాలను వివరించారు. పోతన సాహిత్య సమారా ధన ఆంశంలో టీజేపీఎస్ కళాశాల విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ గోనుగుంట్ల వైదేహి పోతన భాగవతంలోని గజేంద్రమోక్షంలో తాత్విక, ఆధ్యాత్మిక విశేషాలు వివరించారు. సాహితీవేత్త డాక్టర్ బీరం సుందర్రావు మాట్లాడుతూ ఏటుకూరి సాహిత్యంలోని కవితాత్మక అంశాలు వివరించారు. అనంతరం 'తుమ్మల కవిత్వంలో సామాజిక చైతన్య స్ఫూర్తి' అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో డాక్టర్ టేకుమళ్ల వెంకటప్పయ్యకు రూ.5 వేలు, డాక్టర్ పాతూరి సుబ్రహ్మణ్య కవికి రూ.3 వేలు, బొడ్డపాటి చంద్రశేఖర్కు రూ.2 వేలు నగదు ఇచ్చి నిర్వాహకులు సత్కరించారు. జేకేసీ కళాశాల విద్యార్థులకు నిర్వహించిన ఉగాది కవితల పోటీలో విజేతలకు నగదు బహుమతులిచ్చి బహుమతులిచ్చి సత్కరించారు. కార్యక్రమాలను కళాపీఠం కార్యదర్శి డాక్టర్ సూర్యదేవర రవికుమార్ నిర్వహించారు. కార్యక్రమంలో అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారా యణ, ఆలయ పాలకవర్గం అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య, సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగే శ్వరరావు, డాక్టర్ వి. నాగరాజ్యలక్ష్మి, పి. నాగసుశీల, పారా అశోక్, ఏలూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.

ఘనంగా గురువులకు సత్కారం - 10.11.2025

ఘనంగా గురువులకు సత్కారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం   గురువులకు   చిరు సత్కార కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో విశ్వపావని సభాధ్యక్షులుగా వ్యవహించారు. అతిథులుగా డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి,   బెండపూడి లక్ష్మీకుమారి, డాక్టర్ గిరిజాశేషమాంబ, పాటిబండ్ల జానకి, పసుమర్తి పద్మజకుమారి పాల్గొన్నారు. యిమ్మడి అంజనీదేవి బృందం గురు వందనంలో భాగంగా భక్తిమాల కీర్తనలు పుస్తకరూపం అలాగే సీ.డి. రూపంలో తమను ప్రోత్సహించిన అతిథులను ఘనంగా సన్మానించారు. అతిథులు యిమ్మడి అంజనీదేవి బృందం సంగీతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమాలను యిమ్మడి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.