ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మహాభారతంపై ఆధ్యాత్మిక ప్రవచనం - 19-21.05.2025

మహాభారతంపై ఆధ్యాత్మిక ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం మహాభారతంలోని అరణ్యపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్.మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మిక ప్రవచకులు గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి ప్రవచిస్తూ మహాభారత కాలంలో మద్ర రాజ్యానికి వారసుడు శల్యుడనీ, శల్యునికి వారసత్వంగా మద్ర రాజ్యం వచ్చిన మాట నిజమే అయినా, ఆ రాజ్యాన్ని కాచుకోగల పరాక్రమం అతని సొత్తన్నారు. శల్యునికి ఎదురుగా నిలబడి ఎవరైతే యుద్దం చేస్తారో...వారి మనసులో ఎంతటి క్రోధం ప్రబలుతూ ఉంటే, శల్యునికి అంతగా బలం చేకూరుతుందన్నారు. ధర్మరాజుకీ,శల్యునికీ మధ్య జరిగిన పోరులో అనేకసార్లు శల్యునిదే పైచేయి అయినప్పటికీ తుట్టతుదకు... ధర్మరాజు వదిలిన ఒక శూలంతో శల్యుడు నేలకూలక తప్పలేదన్నారు.అలా భారతంలో శల్యుని కథ ముగుస్తుందన్నారు. 

ఆదర్శ కవి.. తుమ్మల సీతారామమూర్తి - 21.03.2025

ఆదర్శ కవి.. తుమ్మల సీతారామమూర్తి 

సామాజిక చైతన్యంతో విప్లవాత్మక కవిత్వం రాసి తెలుగు జాతికి మార్గదర్శకత్వం వహించిన గొప్ప కవి తెనుగు లెంక తుమ్మల సీతారామమూర్తి అని పలువురు కీర్తించారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అన్న మయ్య కళావేదికపై తుమ్మల కళాపీఠం ఆధ్వ ర్యంలో తుమ్మల వర్ధంతి సందర్భంగా పోతన భాగవత సమారాధన, ఏటుకూరి సాహిత్య సమాలో చన, కార్యక్రమాలు జరిగాయి. తుమ్మల కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్ సభకు అధ్యక్షత వహించి కళాపీఠం నిర్వహిస్తున్న కార్యక్ర మాలను వివరించారు. పోతన సాహిత్య సమారా ధన ఆంశంలో టీజేపీఎస్ కళాశాల విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ గోనుగుంట్ల వైదేహి పోతన భాగవతంలోని గజేంద్రమోక్షంలో తాత్విక, ఆధ్యాత్మిక విశేషాలు వివరించారు. సాహితీవేత్త డాక్టర్ బీరం సుందర్రావు మాట్లాడుతూ ఏటుకూరి సాహిత్యంలోని కవితాత్మక అంశాలు వివరించారు. అనంతరం 'తుమ్మల కవిత్వంలో సామాజిక చైతన్య స్ఫూర్తి' అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో డాక్టర్ టేకుమళ్ల వెంకటప్పయ్యకు రూ.5 వేలు, డాక్టర్ పాతూరి సుబ్రహ్మణ్య కవికి రూ.3 వేలు, బొడ్డపాటి చంద్రశేఖర్కు రూ.2 వేలు నగదు ఇచ్చి నిర్వాహకులు సత్కరించారు. జేకేసీ కళాశాల విద్యార్థులకు నిర్వహించిన ఉగాది కవితల పోటీలో విజేతలకు నగదు బహుమతులిచ్చి బహుమతులిచ్చి సత్కరించారు. కార్యక్రమాలను కళాపీఠం కార్యదర్శి డాక్టర్ సూర్యదేవర రవికుమార్ నిర్వహించారు. కార్యక్రమంలో అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారా యణ, ఆలయ పాలకవర్గం అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య, సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగే శ్వరరావు, డాక్టర్ వి. నాగరాజ్యలక్ష్మి, పి. నాగసుశీల, పారా అశోక్, ఏలూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 04.10.2024 శుక్రవారం ఉదయం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికపై యం.వై.శేషురాణి, భువనేశ్వరి గార్లచే దేవీ కీర్తనల గానం సుమధురంగా సాగింది. తంగిరాల అన్నపూర్ణ (ఏ.ఐ.ఆర్. ఆర్టిస్ట్) వ్యాఖ్యానం అందించారు.
వాగ్గేయకారుల మహోత్సవాలు – గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావనగార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో వాగ్గేయకారుల మహోత్సవాలు 26.10.2027 శనివారం ప్రారంభమయ్యాయి. పి. జానకి జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. పెరవలి జయతి ప్రార్ధన అనంతరం స్థానిక విద్వాం సులు పలువురు వాగ్గేయకారుల వర్ణాలు , కృతుల గానం సంగీతాభిమానులను అలరించింది. ప్రధాన కచేరీలో భాగంగా విద్వాన్ వివేక్ మూజికులం , ( చెన్నై) శాస్త్రీయ సంగీత కచేరి జరి గింది. కచేరీకి వయోలి న్పై మంధా శ్రీరమ్య , ( చెన్నై) , మృదంగంపై బుర్రా శ్రీరామ్(చెన్నై) , ఘటం పై ఎస్.హను మంతరావు(తాడేపల్లి గూడెం) , వాద్య సహకా రాన్ని అందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామారావు , సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ ప్రసంగించారు. కార్యక్రమాలను డాక్టర్ జి. జాహ్నవి , ఆలయ పాలకమండలి అధ్యక్షులు మస్తానయ్య , కార్యదర్శి ఉమామహేశ్వరరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సంస్థ అధ్యక్ష, ప్రధా...
 తెలుగువారు గర్వించదగ్గ సాహితీ పరిశోధకులు ఆచార్య గంగప్ప ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు భాష విభాగాధిపతిగా పనిచేసిన సందర్భంలో తన శిష్యరికంలో వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దటంతో పాటు 25 మంది పిహెచ్డీలు 25 మంది ఎంఫిల్డ్ పట్టాలు సాధించటంతో పాటు శతాధిక గ్రంథకర్తగా, పరిశోధకుడిగా, మార్గదర్శకుడుగా ప్రఖ్యాతిగాంచిన ఆచార్య గంగప్ప రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప సాహిత్య కృషివలుడని ముఖ్యఅతిథిగా పాల్గొన్న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఇ.వి నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై ఆచార్య గంగప్ప స్మారక సాహిత్య పురస్కార కమిటీ ఆధ్వర్యంలో "ఆచార్య గంగప్ప 28వ సాహితీ పురస్కారం 2024" ప్రముఖ సాహిత్య వేత్త, అనువాద రచయిత డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి దేవి కి అందజేసి ఘనంగా సత్కరించి నగదు పురస్కారం అందజేశారు.  సభకు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షతగా దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన గావించారు. కార్యక్రమంలో ఆచార్య జీవి చలం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నిశెట్ట...