ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జనవరి, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

కళా దర్బార్ ఉగాది పురస్కారాల ప్రదానం - 31.03.2025

కళా దర్బార్ ఉగాది పురస్కారాల ప్రదానం బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై కళాదర్బార్-ఆంధ్రప్రదేశ్ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కారాల ప్రదానం సోమవారం రాత్రి జరిగింది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పొత్తూరి రంగారావు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ఆలయ పాలకమండలి కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనురాధ అయ్యంగారి(టీవీ రంగం), డాక్టర్ జి. నాగార్జున (వైద్యం), కనుమూర్ రాజ్యలక్ష్మి (విద్య), శనివారపు శిరీష (సంగీతం), చెన్నుపాటి శివనాగేశ్వర రావు(వ్యాపారం), సాయి లక్కరాజు(కళారంగం)లకు ఉగాది పురస్కారాలు అందించి సత్కరించారు. అనంతరం సినీ సంగీత విభావరి నిర్వహించారు. హేమమాలిని, సౌజన్య, బాబూరావు, సుధీర్ బాబు, అబ్దుల్ ఖాదర్ సినీ గీతాలను ఆలపించారు.

యుద్ధకాండపై ప్రవచనం - 30.01.2025

యుద్ధకాండపై ప్రవచనం  బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై ముప్పవ రపు కేశవరావు శత జయంతి ఉత్సవాలు కొనసాగుతు న్నాయి. ఈ సందర్భంగా రామాయణ నవాహ జ్ఞానయజ్ఞంలో గురువారం రాత్రి ప్రవచనకర్త బాచం పల్లి సంతోషకుమార్ శర్మ యుద్ధకాం డలో సీతను కనుగొన్న హనుమంతు డిని శ్రీరాముడు ప్రశంసిస్తూ ఆలిం గనం చేసుకోవడం, యుద్ధానికి వానర సైన్యాన్ని సిద్ధం చేసిన విధానం, వారధి నిర్మాణం వంటి విశేషాలను వివరించారు. ముప్పవరపు సింహాచ లశాస్త్రి, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు మస్తానయ్య, ఉమామహేశ్వరరావు, నాగేశ్వరరావులు జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభిం చారు. ముఖ్యఅతిథిగా డి. రాధాకృష్ణ (కాకినాడ) పాల్గొన్నారు. 

మానవధర్మ దర్శిని సుందరకాండ - 29.01.2025

 మానవధర్మ దర్శిని సుందరకాండ బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై ముప్పవరపు కేశవరావు శత జయంతిని పురస్కరించుకొని రామాయణ ప్రవచన నవాహ జ్ఞానయజ్ఞం బుధవారం రాత్రి కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా సుప్రసిద్ధ పండితుడు సామవేదం షణ్ముఖశర్మ సుందరకాండపై ప్రవచనం చేశారు. సుందరకాండలో అక్షరాక్షరంలోనూ మానవాళి పాటించాల్సిన ధర్మాలు, బీజాక్షరాలతో కూడిన మంత్ర సమానాలైన శ్లోకాలు ఉన్నాయన్నారు. హనుమాన్ అనే శబ్దానికి వేద పరంగా జ్ఞానవంతుడు అని, ఆంజనేయుడు అంటే.. ఇంతకుముందున్న దానిని కనుగొనేవాడని అర్ధాలున్నాయని పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా విద్యా రణ్య పీఠ పండితుడు, ఘనపారి విష్ణు భట్ల లక్ష్మీనారాయణ శర్మ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ముప్పవరపు సింహాచల శాస్త్రి నిర్వహించారు. భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపకుడు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్. మస్తానయ్య, ఊటుకూరి నాగేశ్వరరావులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రామాయణంలోని మిగిలిన కాండలకన్నా ప్రత్యేకమైనదని సుంధరకాండ - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

సుందరకాండపై ప్రవచనం వాల్మీకి రచించిన రామాయణంలోని సుందరకాండ ఎంతో శక్తివంత మైన మంత్ర నిధి లాంటిదని సుప్రసిద్ధ ప్రవచనకర్త సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో ముప్పవరపు కేశవరావు శత జయంతి సందర్భంగా రామాయణ నవాహ జ్ఞానయజ్ఞం జరుగుతోంది. మంగళవారం నాటి కార్యక్రమంలో ఆయన సుందరకాండపై ప్రవచనం చేశారు. ఆమన మాట్లాడుతూ సుందరకాండ అనే పేరే రామాయణంలోని మిగిలిన కాండలకన్నా ప్రత్యేకమైనదని వివరించారు. దీనిలో ఉన్న 68 సర్గలు దేనికదే మంత్ర శాస్త్ర నిధుల్లాగా పారాయణకు అనువుగా ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ యు. దుర్గాప్రసాదరావు, నిర్వాహకుడు ముప్పవరపు సింహాచలశాస్త్రి, ఆలయ పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్. మస్తానయ్య, బొర్రా ఉనమామహేశ్వరరావు, ఊటుకూరి నాగేశ్వరరావు, సాహితీ సమాఖ్య ప్రధానకార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. సామవేదం షణ్ముఖ శర్మ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ యు. దుర్గాప్రసాదరావును సత్కరించారు.

భక్తిశ్రద్ధలతో చండీహోమం - 27.01.2025

భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో మాసశివరాత్రి సందర్భంగా సోమవారం విశ్వశాంతిని కాంక్షిస్తూ చండీహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. ఆలయ కమిటి అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కిష్కింధ కాండ పై చంద్రశేఖరశర్మ - 27.01.2025

 కిష్కింధ కాండ పై చంద్రశేఖరశర్మ ప్రవచనం  స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై కీ.శే. ముప్పవరపు కేశవరావు శత జయంతిని పురస్కరించుకొని వారి కుమారుడు ముప్పవరపు వేంకట సింహాచలశాస్త్రి నిర్వహిస్తున్న శ్రీ వాల్మీకి మహర్షి ప్రణీత శ్రీ మద్రామాయణ ప్రవచన నవాహ జ్ఞానయజ్ఞంలో భాగంగా సోమవారం చంద్రశేఖరశర్మ కిష్కింధకాండలోని అనేక అంశాలను ప్రసంగిస్తూ హనుమంతుడు శ్రీరామలక్ష్మణులను కలిసిన విధానం, శ్రీరామ సుగ్రీవుల మైత్రి, వాలి వధ, సీతాన్వేషణ, హనుమత్ సంకల్పం వంటి అనేక ఘట్టాలను కనులకు కట్టినట్లు అనేక ఉపమానాలతో  వివరించి ఆహుతులను అలరించారు.  ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ ఆడిటర్ గబ్బిట శివరామకృషమూర్తి, ఆలయ పాలకమండలి  అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్. మస్తానయ్య, ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముఖ్యఅతిథి మాట్లాడుతూ కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులకు భిన్నంగా ముప్పవరపు వెంకట సింహాచలశాస్త్రి తన తండ్రి కేశవరావు గారి శతజయంతి ఉత్సవాలలో ఎన్నిసార్లు విన్నా క్రొత్తగా అనిపించే రామాయణ కథను, ఆ జ్ఞానాన్ని నలుగురికి అందించటం  ఒక విశేషమన్నా...

అరణ్యకాండపై ఆధ్యాత్మిక ప్రవచనం - 26.01.2025

అరణ్యకాండపై ఆధ్యాత్మిక ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ముప్పవరపు కేశవరావు శతజయంతి సందర్భంగా ఆదివారం శ్రీమద్రామాయణ నవాహా జ్ఞానయజ్ఞ ప్రవచన ప్రవాహం అరణ్యకాండపై ప్రవచనం జరిగింది. ప్రముఖ సంస్కృత పండితులు దోర్బల ప్రభాకరశర్మ, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సాహితీవేత్త బుఱ్ఱా భాస్కరశర్మ గారు వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణంలోని అరణ్యకాండపై ప్రవచనం చేస్తూ ఆగస్త్యేశ్వర ఆశ్రమ సందర్శనం, పంచవటిలో నివాసం, సుర్పనక గర్వభంగం, మాయాలేడి మోసం, సీతాపహరణం వంటి విషయాలను కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. కార్యక్రమాన్ని నిర్వాహకులు ముప్పవరపు వేంకట సింహాచలశాస్త్రి పర్యవేక్షించారు.

అయోధ్య కాండలో ఆదర్శాలు ఎన్నో - 25.01.2025

 అయోధ్య కాండలో ఆదర్శాలు ఎన్నో రామాయణంలోని అయోధ్యకాండలో అడుగడుగునా ఎన్నో ఆదర్శాలు కనిపిస్తాయని సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు అన్నారు. స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక మీద ముప్పవరపు కేశవరావు శత జయంతి ఉత్సవాలు జరుగుతు న్నాయి. ప్రముఖ హరికథకుడు ముప్పవరపు వేంకట సింహాచలశాస్త్రి నిర్వహణలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో వాల్మీకి రచించిన రామాయణంలోని అయోధ్య కాండ 63వ సర్గ నుంచి చివరి వరకు జరిగిన వివిధ అంశాలను డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు విశ్లేషించి చెప్పారు. ఈ కాండలో కనిపించే ప్రతి పాత్రలోనూ నేటి మానవాళి అనుసరించ తగ్గ ఆదర్శాలు ఎన్నో ఉన్నాయన్నారు. రామలక్ష్మణుల వనవాస దీక్ష, వన ప్రయాణం, గుహుని ఆతిథ్యం, చిత్రకూట నివాసం, దశర దుని మరణం, పాదుకాపట్టాభిషేకం వరకు ఉన్న పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆదాయ పన్ను శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(బెంగళూరు) కె.ఎస్.ఎ. శేష శైలేంద్ర మాట్లాడుతూ పురాణాలు, ఉపనిషత్తులోని కథాంశాలు, వాటిలోని ఆధ్యాత్మిక, వైజ్ఞానిక అంశాలను నేటి తరానికి తెలి యజ...

తాత్విక చింతనకు దర్పణం అయోధ్యకాండ - 24.01.2025

 తాత్విక చింతనకు దర్పణం అయోధ్యకాండ రామాయణంలోని అయోధ్యకాండకు కేవలం దశరథమహారాజు పాలించిన అభేద్య నగరం గురించి తెలిపే కాండ అని మాత్రమే అర్ధం చెప్పుకోకూడదని, దానిలో గొప్ప తాత్విక చింతన ఇమిడి ఉందని సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు మల్లాప్రగడ శ్రీమన్నారాయణ తెలిపారు. బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ముప్పవరపు కేశవరావు శత జయంతి సభలో ఆయన రామాయణంలోని అయోధ్యకాం డలో ఒకటి నుంచి 62వ సర్గ వరకు విశేషాలు శుక్రవారం రాత్రి వివరించారు. కార్యక్రమంలో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వాహకుడు కేఎస్ రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని సనాతన ధర్మ విశిష్టత వివరించారు. ఆలయ పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్, మస్తానయ్య, బొర్రా ఉమామహేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముప్పవరపు సింహాచలశాస్త్రి కార్యక్రమాన్ని నిర్వహించారు.

రామాయణం అక్షరాలా అమృతకలశం - 23.01.2025

రామాయణం అక్షరాలా అమృతకలశం రామాయణం అక్షరాలా ఒక అమృతకలశం లాంటిదని మహాసహ స్రావధాని మాడుగుల నాగఫణిశర్మ తెలిపారు. గుంటూరు బృందావన గార్డెన్స్‌లోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం రాత్రి రామా యణ నవాహ జ్ఞానయజ్ఞం ప్రారంభ మైంది. ముప్పవరపు వేంకట సింహా చలశాస్త్రి ఆధ్వర్యంలో ఆయన తండ్రి ముప్పవరపు కేశవరావు శతజయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తొమ్మిది రోజుల కార్యక్రమంలో తొలిరోజు రామాయణ ఆవిర్భావం, విశిష్టత, బాలకాండ విశేషాల గురించి మాడుగుల నాగపణిశర్మ విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. రామాయణంలోని 24 వేల శ్లోకాల్లో వాల్మీకి మహర్షి గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలను.. వెయ్యి శ్లోకాలకు ఒక బీజాక్షరం వంతున ఎలా నిక్షిప్తం చేసిందీ వివరించారు. వాల్మీకి మహర్షికి నారదుడు, బ్రహ్మ దేవుడు రామా యణ రచన విషయంలో ప్రేరణ కలిగించారన్న అంశాలను విపులీకరించారు. రామయణం.. ప్రపంచ వాజ్ఞయానికి దారిదీ. పంగా వాల్మీకి మహర్షి చెప్పారన్నారు. రాముడి ఆదర్శాన్ని నేటితరం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలన్నారు. కార్య క్రమంలో అమరావతి జ్యుడీషియల్ ఆకా డమీ డైరెక్టర్ అవధానుల హరనాథశర్మ పాల్గొని రామాయణంలోని సుందరకాండ విశేషాల...

ప్రతిభామూర్తులకు సత్కారాలు - 21.01.2025

  ప్రతిభామూర్తులకు సత్కారాలు వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన 70 సంవత్సరాల వయస్సు దాటిన మహిళలను సత్కరించారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై గుళ్లపల్లి సుబ్బారావు సేవాసంస్థ తరపున గుంటుపల్లి ఆరుణకుమారి మంగళవారం జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవాలయ పాలకమండలి గౌరవాధ్యక్షురాలు గద్దె రామతులశమ్మ (ఆధ్యాత్మికం) , వేమూరి రామలక్ష్మి (సంగీతం) , డాక్టర్ సీహెచ్. సుశీలమ్మ. (సాహిత్యం) , వ ి.యన్.డి. శ్యామసుందరీ దేవి (విద్య) , మాధవపెద్ది మీనాక్షి (సంగీతం) తో పాటు మరికొందరికి సత్కారాలు పొందారు. తొలుత గద్దె రామతులశమ్మ ఇంటి వద్ద ఆమెను సత్కరించి , రామతులశమ్మ జీవన యానం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి కుందుర్తి స్వరాజ్య పద్మజ అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్ ఎన్. విజయలక్ష్మి సంధానకర్తగా వ్యవహరించి గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ ప్రతి నెలా 70 సంవత్సరాలు దాటిన , వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన మహిళలను సన్మానించాలని తీర్మానించడం అభినంద నియమన్నారు. కార్యక్రమంలో గుళ్ళపల్లి స్వాతి , అర్ధలపూడి నేహ , గుళ్ళపల్లి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ...

సందేశాత్మకంగా సాగిన చిగురు మేఘం నాటిక - 19.01.2025

 సందేశాత్మకంగా సాగిన  చిగురు మేఘం నాటిక   స్థానిక బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కె. ఆర్.కె.ఈవెంట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాపరిషత్ 20వ నాటకోత్సవాల సందర్భంగా అదివారం ప్రదర్శించిన చిగురుమేఘం నాటిక, కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులు ఆకట్టుకున్నాయి. తొలుత  ఆలయ కమిటి  ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు జ్యోతి ప్రజ్వలన చేసి  కార్యక్రమాన్ని ప్రారంభించారు. లక్ష్మీ ప్రణీత, పుణ్యవతి, సోనిక, నాగ దివ్యశ్రీ, జ్ఞానితి, లాస్య, భోగ్య శ్రీ, మనస్విని,  సాన్వి, జాహ్నవి లు పలు కీర్తనలకు కూచిపూడి ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారు కావూరి సత్యనారాయణ  రచనకు, ఏపూరి హరిబాబు దర్శకత్వం వహించిన చిగురుమేఘం నాటికను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పరిషత్ నిర్వాహకులు రామకృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ, బొప్పన నరసింహారావు, (బుజ్జి) జి.మల్లికార్జున రావు, వేములపల్లి విఠల్ తదితరులు  పాల్గొని కళాకారులను ఘనంగా సత్కరించారు.