అలరించిన భక్తి సంగీత విభావరి స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం సాయంత్రం హైదరాబాదు వాస్తవ్యులు శ్రీవాణీ కళానికేత్ నిర్వాహకులు , ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ విశ్రాంత సీనియర్ బ్రాంచి మేనేజర్ , ఆకాశవాణి , దూరదర్శన్ కళాకారులు శ్రీ భాగినారాయణశాస్త్రి గారిచే కర్ణపేయమైన అనేక భక్తిగీతాలు , శ్రీ అన్నమాచార్యుల సంకీర్తనలు గానం చేసి ఆహుతులను ఆకట్టుకున్నారు. తొలుత ఆలయ అధ్యక్షులు సిహెచ్. మస్తానయ్య , ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భాగినారాయణశాస్త్రిచే వెండికొండ మీద ఉన్న, తిరుపతి వేంకట రమణ , హరే వేంకట రమణ బ్రోవరా , సప్తగిరులపై వెలసి వేంకటేశ , నామేను పులకించె ఈ జన్మ తరియించే అంటూ అనేక భక్తిగీతాలతో పాటు , మాధవా కేశ మధుసూదన , ఇందరికీ అభయంబు ఇచ్చుచేయి , నానాటి బ్రతుకు నాటకము , రంగ రంగ రంగపతి రంగనాధ్ , చూడరమ్మ సతులాలా అంటూ పలు అన్నమయ్య కీర్తనలు శ్రవణానందకరంగా ఆలపించి కచేరిని రక్తికట్టించారు. వీరికి వయోలిన్పై పి.యస్.ఆర్. ఆంజనేయశాస్త్రి, కీబోర్డుపై బి.యస్. సత్యదే...
యుద్ధకాండపై ప్రవచనం బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై ముప్పవ రపు కేశవరావు శత జయంతి ఉత్సవాలు కొనసాగుతు న్నాయి. ఈ సందర్భంగా రామాయణ నవాహ జ్ఞానయజ్ఞంలో గురువారం రాత్రి ప్రవచనకర్త బాచం పల్లి సంతోషకుమార్ శర్మ యుద్ధకాం డలో సీతను కనుగొన్న హనుమంతు డిని శ్రీరాముడు ప్రశంసిస్తూ ఆలిం గనం చేసుకోవడం, యుద్ధానికి వానర సైన్యాన్ని సిద్ధం చేసిన విధానం, వారధి నిర్మాణం వంటి విశేషాలను వివరించారు. ముప్పవరపు సింహాచ లశాస్త్రి, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు మస్తానయ్య, ఉమామహేశ్వరరావు, నాగేశ్వరరావులు జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభిం చారు. ముఖ్యఅతిథిగా డి. రాధాకృష్ణ (కాకినాడ) పాల్గొన్నారు.