‘గుంటూరుతిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికపై 20.10.2024 ఆదివారం రాత్రి డాక్టర్ ఉమ్మనేని రంగారావు ప్రథమ వర్ధంతి సంస్మరణ సభ నిర్వహించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య మాట్లాడుతూ చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో సుదీర్ఘ కాలం ప్రిన్సిపల్, డైరెక్టర్ డాక్టర్ రంగారావు చేసిన సేవలు ఆదర్శప్రాయమన్నారు. ఆయన నాటికలు, కళలు, సంస్కృతి, తెలుగుదనం అంటే ఎంతో ఇష్టపడేవారన్నారు. ప్రముఖ రంగస్థల చలన చిత్రనటుడు మల్లాది భాస్కర్ మాట్లాడుతూ రంగారావు జ్ఞాపకంగా ఆయన కుటుంబ సభ్యులు గుంటూరు హ్యూమర్ క్లబ్ ఆధ్వర్యంలో 115వ హాస్య వల్లరి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. సభకు గుంటూరు హ్యూమర్ క్లబ్ అధ్యక్షుడు జంపని కిషోర్బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మల్లాది క్రియేషన్స్, హైదరాబాద్ వారి చీకట్లో చంద్రుడు నాటిక ప్రదర్శించారు. కార్యక్రమంలో గుంటూరు హ్యూమర్ క్లబ్ కార్యదర్శి అత్తలూరి నాగజ్యోతి, వ్యవస్థాపక కార్యదర్శి లాల్ వజీర్, రంగారావు కుటుంబ సభ్యులు ఉమ్మనేని శివనాగేశ్వరరావు, ఉమ్మనేని వీరయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 04.10.2024 శుక్రవారం ఉదయం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికపై యం.వై.శేషురాణి, భువనేశ్వరి గార్లచే దేవీ కీర్తనల గానం సుమధురంగా సాగింది. తంగిరాల అన్నపూర్ణ (ఏ.ఐ.ఆర్. ఆర్టిస్ట్) వ్యాఖ్యానం అందించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి