‘గుంటూరు తిరుమల’ బృందావన్గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం శ్రీ దేవి శరన్నవరాతులు ముగింపు శనివారం 12.10.2024 విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో అన్నమయ్య కళావేదికపై మహతీస్వరసుధ వారి భక్తి సంగీత విభావరి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి పత్రి నిర్మల గారి ఆధ్వర్యంలో భక్తి సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. తొలుత గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ వారి ఆధ్వర్యంలో కళాకారులను ఘనంగా సత్కరించారు. పద్మావతి కళ్యాణవేదికపై సత్సంగ సభ్యులచే లలితా సహస్రనామ పారాయణ నిర్వహించారు.
ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.


.jpeg)

.jpeg)


.jpeg)
.jpeg)


.jpeg)

.jpeg)




కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి