అంకయ్యకు విశ్వనాథ సంస్కృతి పురస్కారం ప్రదానం ప్రపంచంలోని ఏడువేల భాషల్లో భారతదేశంలో ఎనిమిది వందల భాషల్లో అంకమ్మ కథలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలుగు నెరవు వ్యవస్థాపకులు స.వెం.రమేష్ అన్నారు. దివంగత జె.వెంకటేశ్వరరావు ఆకాంక్ష విశ్వనాథ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో శనివారం సాయం త్రం బృందావన్గార్డెన్స్స్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవ స్థానం అన్నమయ్య కళావేదికపై సంపూర్ణ అంకమ్మ కథల గాయకుడు చలంచర్ల దానం అంకయ్య( కావలి)కు విశ్వనాథ సంస్కృతి పురస్కారం, నగదు అందించి సత్కరించారు. ముఖ్య వక్త రమేష్ మాట్లాడుతూ నాగరికత, అభివృద్ధి పేరుతో మనిషి అంతరిక్షంలో విహరిస్తున్నాడని అన్నారు. అయితే పుట్టుకకు మూలమైన సంస్కృతి మూలాలను మర్చిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిర క్షరాస్యుడైన అంకమ్మ కథల్లో ఇతివృత్తం ఆయన జ్ఞాన తపస్సుకు అద్దం పడుతుందని అన్నారు. విశ్వనాథ సాహిత్య అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ మద్దినేని సింహకౌటిల్యచౌదరి మాట్లాడుతూ అరు దైన గొప్ప కథల గాన కళాకారుడైన అంకయ్యను సత్కరించడం సాహిత్య అకాడమీకి గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. అనంతరం వంతలకోటి సాంబమూర్తి కళామండలి డాక్టర్ బొంతల కోటిశం కరరావు భాగవత బృందంతో తూర...
విష్ణువును ఆరాధిస్తే ప్రేరణ పొందుతారు.. స్థానిక బృందావన్గార్డెన్ గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న అన్నమయ్య కళావేదికపై గురువారం భీష్మ ఏకాదశి పర్వదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ నిర్వాహకులు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో జరగ్గా, ఆలయ పాలక మండలి వారు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి నిర్వహణలో గోష్ఠి సభ్యులచే సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఆధ్యాత్మికవేత్త నారాయణం శేషుబాబు ప్రవచిస్తూ భీష్మ ఏకాదశి కురు పితామహుడు భీష్ముడు అంపశయ్యపై ఉండి, శ్రీకృష్ణుని సాక్షిగా పాండ వులకు విష్ణు సహస్రనామాలను ఉపదేశించిన పవిత్రమైన రోజు అని అన్నారు. ఉత్తరాయణ పుణ్య కాలంలో వస్తుందని పేర్కొన్నారు. భీష్ముని స్మరిస్తూ, విష్ణు ఆరాధన చేయడం ద్వారా జీవితంలో క్రమశిక్షణ, సత్యం, ధర్మాన్ని పాటించే ప్రేరణ పొందుతారని చెప్పారు.