ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సాయిరాగా సంగీత కళాశాల పంచమ వార్షికోత్సవం - 31.01.2026

సాయిరాగా సంగీత కళాశాల పంచమ వార్షికోత్సవం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం సాయిరాగా సంగీత కళాశాల పంచమ వార్షికోత్సవాలు సంస్థ ప్రిన్సిపాల్ మునిపల్లె రమణి ఆధ్వర్యంలో ఉల్లాసంగా జరిగాయి. అతిథులుగా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి.హెచ్.మస్తానయ్య పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత రమణి మునిపల్లె ప్రార్ధనాగీతంతో స్వరార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూనియర్ శిష్యలు నాగవరపు తిశీత, కట్ట జూహితేశ్వరి, కట్టమోహిత యశస్వి, సూది గీతికా దీపాలక్ష్మీ శ్రీష్టి, సీనియర్స్ మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్, ఎం.రామశేషు గీతాలను ఆలపించి స్వరార్చన చేశారు. తబలాపై రమణ, ప్యాడ్స్పై ఈశ్వర్ చక్కటి వాయిద్య సహకారం అందించారు. మునిపల్లె మూర్తి వ్యాఖ్యనంతో బాబూరావు ఇస్మాయిల్, కార్య క్రమ పర్యవేక్షణ చేశారు.

విష్ణువును ఆరాధిస్తే ప్రేరణ పొందుతారు - సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం - 29,30.01.2026

విష్ణువును ఆరాధిస్తే ప్రేరణ పొందుతారు..

స్థానిక బృందావన్గార్డెన్ గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న అన్నమయ్య కళావేదికపై గురువారం భీష్మ ఏకాదశి పర్వదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ నిర్వాహకులు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో జరగ్గా, ఆలయ పాలక మండలి వారు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి నిర్వహణలో గోష్ఠి సభ్యులచే సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఆధ్యాత్మికవేత్త నారాయణం శేషుబాబు ప్రవచిస్తూ భీష్మ ఏకాదశి కురు పితామహుడు భీష్ముడు అంపశయ్యపై ఉండి, శ్రీకృష్ణుని సాక్షిగా పాండ వులకు విష్ణు సహస్రనామాలను ఉపదేశించిన పవిత్రమైన రోజు అని అన్నారు. ఉత్తరాయణ పుణ్య కాలంలో వస్తుందని పేర్కొన్నారు. భీష్ముని స్మరిస్తూ, విష్ణు ఆరాధన చేయడం ద్వారా జీవితంలో క్రమశిక్షణ, సత్యం, ధర్మాన్ని పాటించే ప్రేరణ పొందుతారని చెప్పారు.






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.