సాయిరాగా సంగీత కళాశాల పంచమ వార్షికోత్సవం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం సాయిరాగా సంగీత కళాశాల పంచమ వార్షికోత్సవాలు సంస్థ ప్రిన్సిపాల్ మునిపల్లె రమణి ఆధ్వర్యంలో ఉల్లాసంగా జరిగాయి. అతిథులుగా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి.హెచ్.మస్తానయ్య పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత రమణి మునిపల్లె ప్రార్ధనాగీతంతో స్వరార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూనియర్ శిష్యలు నాగవరపు తిశీత, కట్ట జూహితేశ్వరి, కట్టమోహిత యశస్వి, సూది గీతికా దీపాలక్ష్మీ శ్రీష్టి, సీనియర్స్ మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్, ఎం.రామశేషు గీతాలను ఆలపించి స్వరార్చన చేశారు. తబలాపై రమణ, ప్యాడ్స్పై ఈశ్వర్ చక్కటి వాయిద్య సహకారం అందించారు. మునిపల్లె మూర్తి వ్యాఖ్యనంతో బాబూరావు ఇస్మాయిల్, కార్య క్రమ పర్యవేక్షణ చేశారు.
మహాభారతం అరణ్యపర్వంపై ప్రవచనం
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గురువారం శ్రీమహాభారతంలో వ్యాసప్రాస్తం, కవిత్రయం, పెద్దు తెలిపిన అంశాలపై ఉపన్యాస భూషణ శ్రీమన్ గుదిమెళ్ల కూర్మనాథస్వామి ప్రసంగించారు. ఈనెల 23న వసంత పంచమి సందర్భంగా సరస్వతీ దేవీ పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించ నున్నట్లు ఆయన తెలిపారు.







కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి