నారాయణ స్తోత్రం పఠనంతో సర్వ శుభాలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం ఆదిశంకరాచార్యులచే విరచితమైన నారాయణ స్తోత్రంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ పాలకమండలి వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ శ్రీమహావిష్ణువును కీర్తించే అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం అన్నారు. భక్తులలో అంతర్గత శాంతి, భావోద్వేగ బలం, ఆధ్యాత్మిక రక్షణను పెంపొందిస్తుందన్నారు. ఈ స్తోత్రం నారాయణ నారాయణ జయ గోవింద హరే అనే పల్లవితో ప్రారంభమై, విష్ణువు యొక్క దివ్య రూపాలను, గుణాలను వర్ణిస్తూ కష్టాలను, పాపాలను తొలగిస్తుందన్నారు. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజూ పఠించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయని విశ్వాసమన్నారు.





కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి