సాయిరాగా సంగీత కళాశాల పంచమ వార్షికోత్సవం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం సాయిరాగా సంగీత కళాశాల పంచమ వార్షికోత్సవాలు సంస్థ ప్రిన్సిపాల్ మునిపల్లె రమణి ఆధ్వర్యంలో ఉల్లాసంగా జరిగాయి. అతిథులుగా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి.హెచ్.మస్తానయ్య పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత రమణి మునిపల్లె ప్రార్ధనాగీతంతో స్వరార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూనియర్ శిష్యలు నాగవరపు తిశీత, కట్ట జూహితేశ్వరి, కట్టమోహిత యశస్వి, సూది గీతికా దీపాలక్ష్మీ శ్రీష్టి, సీనియర్స్ మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్, ఎం.రామశేషు గీతాలను ఆలపించి స్వరార్చన చేశారు. తబలాపై రమణ, ప్యాడ్స్పై ఈశ్వర్ చక్కటి వాయిద్య సహకారం అందించారు. మునిపల్లె మూర్తి వ్యాఖ్యనంతో బాబూరావు ఇస్మాయిల్, కార్య క్రమ పర్యవేక్షణ చేశారు.
భక్తి శ్రద్ధలతో రథసప్తమి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం ఉదయం రధసప్తమి పురస్కరించుకొని సూర్యభగవానునికి సువాసినులచే విశేష పొంగలి నివేదన జరిగింది. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి నిర్వహణలో ఆదిత్య హృదయ పారాయణ, లలిత సహస్రనామ పారాయణ జరిగాయి. ధార్మిక ప్రాంగణంలో బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో రుద్రం, సౌరహోమం నిర్వహించి అనంతరం పూర్ణాహుతి చేశాడు, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య, పాలకవర్గం పాల్గొన్నారు.




కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి