ప్రజల వైద్యుడు డాక్టర్ ముద్దన హనుమంతరావు గ్రంథావిష్కరణ సభ ప్రజల వైద్యుడు డాక్టర్ ముద్దన హనుమంతరావు జీవిత సంగ్రహంపై డాక్టర్ వెన్ని శెట్టి సింగారావు వ్రాసిన గ్రంథా విష్కరణ సభ ఈ నెల 26 వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీ పద్మావతి కళ్యాణ వేదికపై జరుపుతున్నట్లు భారతి ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లెపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు . ఆదివారం ఉదయం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆవరణలో కార్యక్రమం వివరాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ సభకు రాజ్యసభ పూర్వ సభ్యులు డాక్టర్ యలమంచిలి శివాజీ అధ్యక్షత వహిస్తారని , జ్యోతి ప్రకాశనం దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య చేస్తారని , విశిష్ట అతిథి పూర్వ పార్లమెంటు శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి , శాసనమండలి పూర్వ సభ్యులు కే ఎస్ లక్ష్మణరావు గౌరవ అతిథిగా పాల్గొంటారని తెలిపారు . ఆత్మీయ అతిథులుగా డాక్టర్ సీతారామయ్య పారిశ్రామికవేత్త పోలిశెట్టి జ్ఞానదేవ్ , సరస్వతి శిశు మందిరాల జిల్లా అధ్యక్షులు వనమా పూర్ణచంద్రరావు , ఏప...
ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలి స్థానిక బృందావన్గార్డెవ్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదిత్య హృదయ పారాయణం, శృంగార నైషధంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఆధ్యాత్మిక ప్రవచకురాలు డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి ప్రవచిస్తూ పాకిస్థాన్ యుద్ధంలో భారత దేశమే పైచేయి కావాలని అన్నారు. కోవిడ్-19 బారిన పడకుండా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. భాగవత గోష్ఠితో మూడుసార్లు ఆదిత్య హృదయ పారాయణం నిర్వహించారని అన్నారు. అనంతరం శృం గార నైషధంలోని ఇతివృత్తాన్ని వివరించారు.