మహాభారతంపై ఆధ్యాత్మిక ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం మహాభారతంలోని అరణ్యపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్.మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మిక ప్రవచకులు గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి ప్రవచిస్తూ మహాభారత కాలంలో మద్ర రాజ్యానికి వారసుడు శల్యుడనీ, శల్యునికి వారసత్వంగా మద్ర రాజ్యం వచ్చిన మాట నిజమే అయినా, ఆ రాజ్యాన్ని కాచుకోగల పరాక్రమం అతని సొత్తన్నారు. శల్యునికి ఎదురుగా నిలబడి ఎవరైతే యుద్దం చేస్తారో...వారి మనసులో ఎంతటి క్రోధం ప్రబలుతూ ఉంటే, శల్యునికి అంతగా బలం చేకూరుతుందన్నారు. ధర్మరాజుకీ,శల్యునికీ మధ్య జరిగిన పోరులో అనేకసార్లు శల్యునిదే పైచేయి అయినప్పటికీ తుట్టతుదకు... ధర్మరాజు వదిలిన ఒక శూలంతో శల్యుడు నేలకూలక తప్పలేదన్నారు.అలా భారతంలో శల్యుని కథ ముగుస్తుందన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి