సాహితీలోకం మరువలేని కవి ధనేకుల
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ లాంటి గొప్ప కవులతో సాన్నిహిత్యం కలిగి లలిత సుందర కవిత్వం రాసి గుంటూరు కవిగా పేరొందిన ధనేకుల వెంకటేశ్వరరావును సాహితీలోకం ఏనాటికీ మరువదని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్ర సాద్ అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వ రస్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికపై ధనేకుల వెంకటేశ్వరరావు సంస్మరణ సభ శుక్ర వారం రాత్రి జరిగింది. సభకు ఆలోకం పెద్ద బ్బయ్య అధ్యక్షత వహించారు. తొలుత ధనేకుల చిత్ర పటానికి ఆయన భార్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ పద్యాన్ని పండిత పామరులందరూ ఆస్వాదించేలా పద్యకవిత్వం రాయడంలో ధనేకుల మేటి అన్నారు. సభలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపకుడు బొల్లేపల్లి సత్య నారాయణ, తుర్లపాటి రాధాకృష్ణమూర్తి, నాయుడు గోపి, సుఖవాసి మల్లికార్జునరాయశాస్త్రి, నూతలపాటి తిరుపతయ్య. పెద్ది సాంబశివరావు, డాక్టర్ రావెల సాంబశివరావు, డాక్టర్ బీరం సుందరరావు, డాక్టర్ నరాలశెట్టి రవికుమార్, డాక్టర్ సతీష్, డాక్టర్ రావి రంగా రావు, డాక్టర్ పాపినేని శివశంకర్ తదితరులు ధనేకుల కవిత్వ విశేషాలు వివరించారు. కారుమంచి లీలాశం కర్, పీఎస్ మూర్తి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి