కలిపురుషుని వృత్తాంతంపై ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధ వారం మహాభారతంలోని అర ణ్యపర్వంపై ఆధ్యాత్మిక ప్రవ చనం జరిగింది. తొలుత ఆల య కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచ కులు గుదిమెళ్ళ శ్రీకూర్మనాధస్వామి ప్రవచిస్తూ మహాభారతం ప్రకారం కలి ఒక దుష్టదేవత అని పూర్వీకులైన కశ్యపముని పదిహేనో కుమారుడిగా జన్మించాడన్నారు. కలియుగ ప్రభువు గా కలి తన ప్రభావాన్ని పాపపు చర్యలను ప్రోత్సహించడానికి రాజు పరిక్షిత్తు మహారాజుని అడిగి పొందిన వర సహాయంతో జూదం, మద్యపానం, వ్యభిచారం, హత్య, బంగారం అనే ఐదు వ్యసనాలకు లోబడిన ప్రజలను ఆవహించి వారిని పతనం చేస్తాడన్నారు. ఆయన కథనంలో ఆయన చేత పీడించి, హింసించబడిన నల మహారాజు వంటి వ్యక్తులతో ముడిపడి ఉందన్నారు. మహాభారతంలో దుర్యోధనుడు ఆయన అవతారంగా పరిగణించబడ్డారన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి