హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
కాలేయం, జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధులపై అవగాహన
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు మరియు గుంటూరుజిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కాలేయం, జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం జరిగింది. డాక్టర్. ఆర్. విష్ణు ప్రసాద్, డాక్టర్ బి.కె. ప్రసన్నకుమార్ గార్లు కాలేయం, జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధుల పట్ల తీసుకోవలసిన జగ్రత్తలు, సూచనలు తెలిపారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి