భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో కార్తీకమాసం, మాసశివరాత్రి సందర్భంగా మంగళ వారం చండీహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు.ఆలయ కమిటి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కాలేయం, జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధులపై అవగాహన
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు మరియు గుంటూరుజిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కాలేయం, జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం జరిగింది. డాక్టర్. ఆర్. విష్ణు ప్రసాద్, డాక్టర్ బి.కె. ప్రసన్నకుమార్ గార్లు కాలేయం, జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధుల పట్ల తీసుకోవలసిన జగ్రత్తలు, సూచనలు తెలిపారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి